భూసేకరణలో జాప్యం
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు
జాతీయ రహదారుల విస్తరణలో ఇబ్బందులు
న్యూస్టుడే, జగిత్యాల: భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు. నిజామాబాద్-జగదల్పూర్ జాతీయ రహదారి జిల్లాలో మెట్పల్లి నుంచి రాయపట్నం వరకు ఉంది. రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు నాలుగైదేళ్లుగా ప్రయత్నాలు జరుగుతుండగా.. నిధులు మంజూరైనప్పటికీ భూసేకరణకు అడ్డంకులు ఏర్పడుతుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రెండు జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ షేక్యాస్మిన్బాషా ఇప్పటికే అధికారులతో సమీక్ష జరిపి దిశానిర్దేశం చేశారు. ఇబ్బందులున్న గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జగిత్యాల-కరీంనగర్: జగిత్యాల-కరీంనగర్ మీదుగా వరంగల్ వరకు జాతీయ రహదారిగా మార్చేందుకు ఆరేళ్ల కిందట నిధులు మంజూరయ్యాయి. నాలుగేళ్ల కిందట భూసేకరణ విషయమై అభ్యంతరాలు రావటంతో అర్ధంతరంగా నిలిచిపోగా ప్రస్తుతం కరీంనగర్-వరంగల్ మధ్య రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండగా జగిత్యాల-కరీంనగర్ మధ్య పనులకు మోక్షం కలగపోవడంతో నిధులు వెనక్కివెళ్లాయి. గతంలో రహదారికి ఒకేవైపు భూసేకరణ జరపాలని నిర్ణయించడంతో భూనిర్వాసితులు అభ్యంతరం వ్యక్తం చేయటమే కాకుండా 18 కి.మీ మేరకు మిషన్ భగీరథ పైపులైన్లు పోతుండటంతో నిలిపివేశారు. దీనికి బదులు జగిత్యాల-పెగడపల్లి-చొప్పదండి మీదుగా మానకొండూర్ చేరుకునే విధంగా గ్రీన్ఫీల్డ్ రహదారిని ప్రతిపాదించి సర్వే జరిపినప్పటికి పెద్దగా ఉపయోగం ఉండదని భావించి నిలిపివేశారు. ప్రస్తుతం పాత రహదారికిరువైపులా విస్తరణకు ప్రతిపాదించటంతో భూసేకరణ పనులు జరుగుతున్నాయి. జిల్లాలో చల్గల్ బైపాస్ రహదారి నుంచి రాజారం మీదుగా నమిలికొండ వరకు 130 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. మరో మూడునెలల్లో భూసేకరణ పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ రహదారి విస్తరణ పనులను వచ్చే బడ్జెట్లో ప్రతిపాదించనుంటంతో పనులు ఆలస్యమయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
వేగం పెంచుతాం
- పి.మధుసూదన్, జగిత్యాల ఆర్డీవో
జిల్లాలో జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణలో వేగం పెంచుతాం. జగిత్యాల డివిజన్లో చల్గల్ నుంచి రాయపట్నం వరకు అవసరమైన భూసేకరణ కోసం సర్వే పూర్తయింది. ఆరునెలల్లో ప్రక్రియ పూర్తవుతుంది. జగిత్యాల-కరీంనగర్ రహదారిలో అవసరమైన భూసేకరణ పూర్తికావస్తోంది. మరోమూడు నెలల్లో సేకరణ ప్రక్రియ పూర్తవుతుంది.
నిజామాబాద్-జగదల్పూర్
నిజామాబాద్-జగదల్పూర్ మధ్య గతంలోనే జాతీయ రహదారి నిర్మాణం జరగ్గా నాలుగు వరుసలుగా విస్తరించేందుకు నిధులు కేటాయించినా అవసరమైన భూసేకరణ ఆలస్యం కావటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లాలో మెట్పల్లి నుంచి రాయపట్నం వరకు 224 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. రహదారికిరువైపులా విస్తరించాలని మొదట ప్రతిపాదించగా మార్గమధ్యలో ఉన్న పట్టణ, గ్రామాల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో పట్టణాలు, మండల కేంద్రాల్లో బైపాస్ రహదారులు నిర్మించటంతోపాటు జగిత్యాల జిల్లా కేంద్రం తగలకుండా చల్గల్ నుంచి పొలాస శివారుకు చేరే విధంగా బైపాస్ రహదారి ప్రతిపాదించారు. అక్కడి నుంచి ధర్మపురి పట్టణానికి సంబంధం లేకుండా బుగ్గారం మండలం మీదుగా నేరుగా రాయపట్నం వెళ్లే విధంగా రహదారి నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో సుమారు 69 కి.మీ మేర నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. భూసేకరణ జరిగితే వెంటనే పనులు మొదలయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో