బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాఘవాపూర్లో నిర్మాణం.. రామగుండం, మంథని, సుల్తానాబాద్లలో స్థలం కొరత
ఈనాడు, పెద్దపల్లి
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణలో కీలకమైన బయోమైనింగ్ విధానం అమలుకు పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. కొండల్లా పేరుకుపోతున్న టన్నుల కొద్ది చెత్తను ప్రాసెస్ చేసి ఘన వ్యర్థాల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలు, జాతీయ హరిత ట్రైబ్యునల్ మార్గదర్శకాల మేరకు ఘన వ్యర్థాలను నిర్వహించేలా బయోమైనింగ్ ప్రక్రియను అనుసరించనున్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్లో 5 ఎకరాల స్థలంలో దాదాపు రూ.3.5 కోట్లతో బయోమైనింగ్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ యూనిట్ నిర్మాణ ప్రక్రియ యంత్రాల బిగింపు పూర్తయినా ప్రాసెసింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ విషయమై పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ మాట్లాడుతూ.. యంత్రాల బిగింపు పూర్తయిందని, ప్రాసెసింగ్ ప్రారంభించాలని గుత్తేదారులకు సూచించామన్నారు. త్వరలో ఉన్నతాధికారుల సాయంతో బయోమైనింగ్ ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సేంద్రియ ఎరువుతో భూసారం..
పెద్దపల్లిలో రైతులు ఏటా 25 వేల మెట్రిక్ టన్నుల పరిమాణంలో యూరియా, ఇతరత్రా ఎరువులు ఉపయోగిస్తున్నారు. విపరీతమైన యూరియా, డీఏపీ ఎరువుల వాడకంతో భూసారం తగ్గడంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. బయోమైనింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన ఎరువులను పొలాల్లో చల్లడం వల్ల భూసారం పెరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాల ఎరువులను స్టీల్, ఇతరత్రా పరిశ్రమల్లో బొగ్గుకు బదులుగా ఇంధనంగా వాడేందుకు ఈ పద్ధతి ఉపయోగపడనుంది. చేపల చెరువుల్లోని అడుగులో అమ్మోనియా గాఢతను స్థిరీకరించి జలచరాల మనుగడకు భరోసా కల్పించేందుకు ఈ ఎరువును భవిష్యత్తులో ఉపయోగించనున్నారు.
రోజుకు 30 టన్నుల వ్యర్థాలు
జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు 30 టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయి. నియోజకవర్గానికి ఒక యూనిట్ చొప్పున జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తుండగా కేవలం పెద్దపల్లిలోని రాఘవపూర్లో 5 ఎకరాల స్థలం లభించింది. రామగుండం, సుల్తానాబాద్ ప్రాంతాల్లో లభించడం లేదు. మంథనిలోని రచ్చపల్లి ప్రాంతంలో సింగరేణి సంస్థ బయోమైనింగ్ యూనిట్ ఏర్పాటుకు అంగీకరించారు. పెద్దపల్లి మినహా ప్రత్యేకంగా రామగుండం నగరపాలక, మంథని, సుల్తానాబాద్ పురపాలికల్లో బయోమైనింగ్ యూనిట్లు ఏర్పాటు చేయలేదు. బయోమైనింగ్ యూనిట్తో పేరుకుపోయిన ఘన వ్యర్థాలను శుద్ధి చేయడంతో పాటు కొత్తగా రోజూ ఉత్పన్నమయ్యే వ్యర్థాలను ప్రాసెస్ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. వ్యర్థాలను నిర్దేశించిన ప్రమాణాల మేరకు రీసైక్లింగ్ చేస్తారు. ఈ యూనిట్లలో ఉక్కు, ఇతరత్రా పరిశ్రమల్లో బొగ్గుకు బదులుగా పనికొచ్చే ప్లాస్టిక్ వ్యర్థాల ఎరువులు ఉపయోగించనున్నారు. ఇందౌర్, ముంబయి, విశాఖ నగరాల తరహాలో ఈ-బయోమైనింగ్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. తడి, పొడి చెత్తను సేకరించి 8 గ్రేడులుగా విభజించి సేంద్రియ ఎరువులను తయారు చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
82 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వంలో భాగంగా శుక్రవారం నామపత్రాల పరిశీలన ప్రక్రియ నిర్వహించి 34 మందివి తిరస్కరించి, 82 మందివి ఆమోదించారు. -
గ్యారంటీలను అమలు చేస్తాం : మంత్రి పొన్నం
[ 27-04-2024]
‘పంద్రాగస్టులోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీశ్రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ సవాల్ విసిరారు. -
అభ్యర్థులను చూసి ఓటు వేయండి
[ 27-04-2024]
కాంగ్రెస్, భారాసలకు ఆ పార్టీల కార్యకర్తలే ఓటు వేసే పరిస్థితి లేదని ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
జాతీయ పార్టీలతో అభివృద్ధి శూన్యం
[ 27-04-2024]
జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక్క పని కూడా కాలేదని, అభివృద్ధి జరగాలంటే గులాబీ జెండా ఎంపీ అవసరమని కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
వేసవి వేళ.. ఆటల వేడుక
[ 27-04-2024]
వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడితో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తరువాత ఊపిరి పీల్చుకుంటారు. -
బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం
[ 27-04-2024]
ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. -
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో