ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి.
2023-24 లక్ష్యాన్ని అధిగమించని జగిత్యాల జిల్లా
జమ్మికుంట మార్కెట్లో పత్తి బిడ్డింగ్
న్యూస్టుడే, జమ్మికుంట: పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. 2023-2024 సంవత్సరానికి నాలుగు జిల్లాల్లోని మార్కెట్ల ఆదాయం రూ.86.94 కోట్లు సాధించేందుకు మార్కెటింగ్ శాఖ లక్ష్యాన్ని నిర్ణయించగా.. నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి రూ.96.21 కోట్ల ఆదాయం సాధించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే జమ్మికుంట మార్కెట్కు ఆదాయం అధికంగా రావటం విశేషం.
రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలు భేష్
మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన రూ.14.12 నిర్ణీత ఆదాయ లక్ష్యాన్ని అధిగమించి రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.19.22 కోట్లు (136 శాతం) ఆదాయం వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన రూ.18.38 లక్ష్యాన్ని అధిగమించి రూ.19.67 ఆదాయాన్ని సాధించింది. జగిత్యాల జిల్లాలో మార్కెటింగ్ శాఖ నిర్ణీత లక్ష్యానికి చేరువలో 98 శాతం సాధించగా రూ.25.54 కోట్లు ఆదాయం లభించింది. ధాన్యానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల పాత బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జమ కావటంతో జగిత్యాల జిల్లా నిర్ణీత లక్ష్యానికి చేరువకు చేరిందని మార్కెటింగ్ శాఖ అధికారులు అంటున్నారు. రాజన్న సిరిసిల్లలోని 10 వ్యవసాయ మార్కెట్లలో వేములవాడ మార్కెట్ ఆదాయం రూ.5.40 కోట్ల (170 శాతం) లక్ష్యానికి చేరింది. సిరిసిల్ల, పోత్గల్, రుద్రంగి, ఇల్లంతకుంట, బోయినిపల్లి మార్కెట్ల నిర్ణీత ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. గంభీరావుపేట నిర్ణీత లక్ష్యానికి చేరువలో 97 శాతం, బొప్పాపూర్ మార్కెట్ 88 శాతం ఆదాయానికి చేరింది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి మార్కెట్ ఆదాయం మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన లక్ష్యానికి చేరువలో రూ.4.77 కోట్లు (99 శాతం) ఆదాయం లభించింది. సుల్తానాబాద్ మార్కెట్ 85 శాతం, కమాన్పూర్ మార్కెట్ 78 శాతం ఆదాయం లభించింది. మంథని మార్కెట్ నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి రూ.3.02 కోట్ల ఆదాయం (193 శాతం) సాధించడం విశేషం. ధర్మారం, జూలపల్లి, శ్రీరాంపూర్, రామగుండం మార్కెట్లు లక్ష్యాన్ని అధిగమించాయి. జగిత్యాల జిల్లాలోని 13 మార్కెట్లలో మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి, మల్యాల, మేడిపల్లి, వెల్గటూరు మార్కెట్లకు నిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి ఆదాయం లభించింది. వెల్గటూరు మార్కెట్కు రూ.2.24 కోట్లు ఆదాయం (131 శాతం) లభించింది. జగిత్యాల మార్కెట్కు రూ.3.65 కోట్లు (79 శాతం) లభించగా, గొల్లపల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, రాయికల్ మార్కెట్లలో నిర్ణీత ఆదాయం లక్ష్యాన్ని అధిగమించలేదు.
మద్దతు ధర పెరగటంతోనే..
జమ్మికుంట మార్కెట్కు ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ల కంటే అధిక ఆదాయం లభించింది. పంటల మద్దతు ధర పెరగటం, గతేడాదికి సంబంధించిన ప్రభుత్వ సంస్థల పాత బకాయిలు జమకావటం, పత్తి విక్రయాలతోనూ జమ్మికుంట మార్కెట్ ఆదాయం పెరిగింది. ఇతర మార్కెట్ల కంటే పత్తికి అధిక ధర ఉండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల రైతులు ఇక్కడే పత్తిని విక్రయించారు.
జి.రెడ్డినాయక్, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్, జమ్మికుంట
లక్ష్యం రూ.86.94 కోట్లు.. సాధించింది రూ.96.21 కోట్లు
కరీంనగర్ జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్లలో రూ.28.50 కోట్ల ఆదాయాన్ని సాధించేందుకు మార్కెటింగ్ శాఖ నిర్ణయించగా.. రూ.31.77 కోట్లు ఆదాయం సాధించింది. ఉమ్మడి జిల్లాలోని జమ్మికుంట ప్రధాన వ్యవసాయ మార్కెట్లో మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన రూ.7.64 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి రూ.9.78 కోట్లు ఆదాయం (128 శాతం) లభించటం విశేషం. కరీంనగర్ మార్కెట్ ఆదాయం రూ.5.77 కోట్లతో 104 శాతం సమకూరింది. హుజూరాబాద్ మార్కెట్ 6.58 కోట్లు (163 శాతం), మానకొండూరు మార్కెట్ రూ.3.21 కోట్లు (152 శాతం) ఆదాయం లభించింది. చొప్పదండి మార్కెట్ రూ.2.24 కోట్లు (76 శాతం), గంగాధర మార్కెట్ రూ.1.31 కోట్లు (58 శాతం), గోపాల్రావుపేట మార్కెట్ రూ.1.84 కోట్లు (70 శాతం) సైదాపూర్ మార్కెట్ రూ.కోటి ఆదాయం (80 శాతం) సమకూరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బరిలో 99మంది
[ 30-04-2024]
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది.. -
నేడు జమ్మికుంటకు సీఎం.. 8న వేములవాడకు పీఎం
[ 30-04-2024]
పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. -
సెలవు పెట్టలేదు.. విధులకు రాలేదు!
[ 30-04-2024]
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని పలువురు వైద్యులు సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులుపడ్డారు. -
తగ్గుతున్న మామిడి ధర
[ 30-04-2024]
మామిడి ధరలు రోజురోజుకు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
కమల దళంలో మారిన సమీకరణలు
[ 30-04-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత బోర్లకుంట వెంకటేశ్నేత భాజపా గూటికి చేరారు. -
నెరవేరని వస్త్రోత్పత్తి లక్ష్యం
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది. -
చైతన్య ఫలితం.. శాంతియుతం
[ 30-04-2024]
ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది. -
యువత.. కురిపించాలి మమత
[ 30-04-2024]
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
సుర్రుమంటూ సూరీడు.. ఉసూరుమంటూ నాయకుడు
[ 30-04-2024]
‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు.. -
రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రకటించరెందుకు?
[ 30-04-2024]
రిజర్వేషన్లు రద్దు చేయబోమని భాజపా, ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రకటించడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్ ప్రశ్నించారు. -
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్
[ 30-04-2024]
జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
[ 30-04-2024]
జిల్లాలో అందిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు