ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది.
అక్రమాల నియంత్రణకు రంగంలోకి సివిల్ సర్వీసెస్ అధికారులు
నేడు నియోజకవర్గాలకు రాక.. నామపత్రాల పరిశీలన
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలకు చెందిన సివిల్ సర్వీసెస్ అధికారులను నియోజకవర్గాలకు సాధారణ, వ్యయ పరిశీలకులుగా నియమించింది. నామపత్రాల స్వీకరణ మొదలు నుంచి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు మూడు పర్యాయాలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. గురువారం నియోజకవర్గాల్లోని నామపత్రాల స్వీకరణ ప్రక్రియ పరిశీలించనున్నారు.
ప్రచార సరళిపై నిఘా
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునే వ్యూహం రచిస్తున్నారు. ప్రచారాల ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నగదు, మద్యం ఇతర తాయిలాల ఆశ చూపెడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తున్నారు. నిర్దేశించిన వ్యయం కంటే రెట్టింపుగా ఖర్చు చేయడంలో వెనుకాడటంలేదు. ఈ నేపథ్యంలో ప్రచార సరళిపై నిఘా పెంచి, అక్రమాలను కట్టడి చేసేందుకు ఐఏఎస్, ఐపీఎస్ వారిని సాధారణ, ఐఆర్ఎస్, ఐడీఏఎస్ సర్వీసు అధికారులు వ్యయ పరిశీలకులుగా రంగంలోకి దిగనున్నారు. నిఘా బృందాలు చిత్రీకరించిన ప్రచారాలు, అభ్యర్థుల ఖర్చులను వీక్షించనున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు.
మూడు విడతలుగా పర్యటన
లోక్సభ పరిధిలో మూడు విడతలుగా అధికారులు పర్యటించనున్నారు. నామపత్రాల దాఖలు చివరి వరకు, ఉపసంహరణ తర్వాత నుంచి లెక్కింపు వరకు ఇక్కడే మకాం వేస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన 27 రోజుల తర్వాత మరోసారి ఇలా మూడు విడతలుగా నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అభ్యర్థుల ప్రచార సరళి, వ్యయంపై అధికారికంగా రూపొందించిన దస్త్రాలు, ఇతర ఆధారాలను నిశితంగా పరిశీలిస్తారు. వీడియో చిత్రీకరణ, దస్త్రాల్లో వ్యత్యాసం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆయా అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. గురువారం జిల్లాలకు రానుండటంతో అతిథి గృహాలను కేటాయించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల బరిలో 99మంది
[ 30-04-2024]
ఎట్టకేలకు లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిచే వారెవరో తేలింది.. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారం మధ్యాహ్నంతో ముగియడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమైంది.. -
నేడు జమ్మికుంటకు సీఎం.. 8న వేములవాడకు పీఎం
[ 30-04-2024]
పెరుగుతున్న ఉష్ణోగ్రతల మాదిరిగానే పార్టీలు ప్రచార వేడిని క్రమంగా పెంచుతున్నాయి. ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లాగా పేరొందిన ఉమ్మడి కరీంనగర్పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నాయి. -
సెలవు పెట్టలేదు.. విధులకు రాలేదు!
[ 30-04-2024]
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని పలువురు వైద్యులు సెలవు పెట్టకుండా, విధులకు హాజరుకాకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులుపడ్డారు. -
తగ్గుతున్న మామిడి ధర
[ 30-04-2024]
మామిడి ధరలు రోజురోజుకు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. -
కమల దళంలో మారిన సమీకరణలు
[ 30-04-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ నేత బోర్లకుంట వెంకటేశ్నేత భాజపా గూటికి చేరారు. -
నెరవేరని వస్త్రోత్పత్తి లక్ష్యం
[ 30-04-2024]
ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12న పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులకు సిద్ధం చేయడం అసాధ్యమనిపిస్తోంది. -
చైతన్య ఫలితం.. శాంతియుతం
[ 30-04-2024]
ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది. -
యువత.. కురిపించాలి మమత
[ 30-04-2024]
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
సుర్రుమంటూ సూరీడు.. ఉసూరుమంటూ నాయకుడు
[ 30-04-2024]
‘ మెల్లగా తెల్లారిందే అలా..!’ అనుకుంటూ రాజకీయ నాయకులు ప్రచారానికి పరుగులెత్తిన కొద్దిసేపటికే భానుడు సుర్రుమంటున్నాడు.. ఉదయం ఏడింటికే భగభగ మండుతున్నాడు.. -
రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రకటించరెందుకు?
[ 30-04-2024]
రిజర్వేషన్లు రద్దు చేయబోమని భాజపా, ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రకటించడం లేదని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్ ప్రశ్నించారు. -
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్
[ 30-04-2024]
జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ సామల్ల మనోహర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. -
ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
[ 30-04-2024]
జిల్లాలో అందిస్తున్న ఉచిత వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయం జెఫ్ బెజోస్ నుంచే నేర్చుకున్నా
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత