logo

చిట్టీల పేరిట ఆర్‌ఎంపీ డబ్బు వసూళ్లు

శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్‌ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..

Published : 19 Apr 2024 04:04 IST

ఐపీ పెట్టి పరారీ.. కొత్తగట్టులో కలకలం

శంకరపట్నం, న్యూస్‌టుడే: శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్‌ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం.. సైదాపూర్‌ మండలానికి చెందిన ఆర్‌ఎంపీ 20 ఏళ్ల కిందట అత్తగారి గ్రామమైన కొత్తగట్టులో స్థిరపడ్డాడు. వైద్యంతోపాటు ప్రైవేటు చిట్టీలు నడిపేవాడు. కొత్తగట్టుతోపాటు సైదాపూర్‌ మండలంలోని రెండు గ్రామాలకు చెందిన పలువురు అతడి వద్ద చిట్టీలు వేశారు. కొందరి సభ్యులకు నగదు చెల్లింపులు చేస్తూ మిగతా వారి వద్ద అప్పులు తీసుకొని చెల్లింపులు జరిగేలా నమ్మబలికాడు. ఇరవై రోజుల నుంచి ఇంటికి తాళం వేసి ఉండడంతో బాధితులు ఫోన్‌ చేస్తే స్పందిస్తూ నమ్మకంగా సమాధానాలిచ్చాడు. ఈ క్రమంలో గురువారం కొత్తగట్టుకు చెందిన సుమారు 41 మందికి ఐపీలు రావటంతో లబోదిబోమంటున్నారు. సైదాపూర్‌ మండలానికి చెందిన 32 మందికీ ఐపీలు పంపించినట్లు సమాచారం. ఇప్పటికే ఆర్‌ఎంపీ ఉండే ఇంటిని వేరే వ్యక్తుల పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగట్టుతోపాటు సైదాపూర్‌ మండలంలోని రెండు గ్రామాల్లో కలకలం రేపింది. దీనిపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని స్థానిక ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని