ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి.
గోదావరిఖని కల్యాణ్నగర్లోని మురుగు కాలువ
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం: రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. గోదావరి నదీ జలాల శుద్ధి కార్యక్రమంలో భాగంగా సుమారు మూడు దశాబ్దాల క్రితం రామగుండంలో శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ గాడి తప్పడంతో పారిశ్రామిక ప్రాంతంలోని మురుగు జలాలు నేరుగా గోదావరినదిలో కలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో మురుగు జలాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని కాలుష్య నియంత్రణ మండలి, హరిత ట్రిబ్యునల్ పలుమార్లు నగరపాలికకు నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వంలో చలనం మొదలైంది. మురుగు జలాల శుద్ధి కోసం అనేకసార్లు అంచనాలు సిద్ధం చేసినప్పటికీ నిధుల కొరతతో పాటు వివిధ కారణాలతో ఆచరణకు నోచుకోలేదు. తాజాగా ‘అమృత్-2.0’లో రామగుండంలో ప్రధాన మురుగు కాలువలు, మురుగు జలాల శుద్ధి కేంద్రాల నిర్వహణకు రూ.252.82 కోట్లు మంజూరు చేయడంతో త్వరలోనే మురుగు సమస్య పరిష్కారమయ్యే అవకాశముంది. మురుగు జలాల శుద్ధి కేంద్రాల నిర్వహణకు అవసరమైన స్థల సేకరణకు మరో రూ.3 కోట్లు కేటాయించారు.
రామగుండం నగరపాలక ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం యు.ఐ.డి.ఎఫ్. నుంచి రూ.88.9 కోట్లు ప్రకటించారు. ఇందులో 85 శాతం నిధులను నేషనల్ హౌసింగ్ బ్యాంకు ద్వారా రుణసాయం అందించనుండగా మిగతా 15 శాతం నిధులను నగరపాలిక సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంకు రుణం అందించాక రెండేళ్ల పాటు మారటోరియం విధించనుండగా ఆ తర్వాత అయిదేళ్లలో అయిదు సమాన వాయిదాల్లో రుణసాయాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ‘అమృత్’ నిధులతో రామగుండం కార్పొరేషన్లోని భీమునిపట్నం, సీఎస్పీ కాలనీ, విఠల్నగర్లో మూడు ట్యాంకులతో పాటు 16 కిలోమీటర్లు నీటి సరఫరా ప్రధాన పైపులైన్లు, 150 కిలోమీటర్లు ఇంటింటా నీటి సరఫరా కోసం డిస్ట్రిబ్యూషన్ పైపులైన్లు నిర్మించడంతో పాటు 20 వేలకు పైగా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. రామగుండంలో మొత్తం 13 ట్యాంకుల ద్వారా నీటి సరఫరా కొనసాగుతున్నప్పటికీ వివిధ కారణాలతో కొన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న ఇక్కట్లు తీర్చడంతో పాటు నీటి సరఫరా తీరును మరింత మెరుగు పరుస్తూ ప్రజలకు నిరంతరంగా నీటిని సరఫరా చేసేందుకు యు.ఐ.డి.ఎఫ్. నిధులు ఉపయోగపడే అవకాశముంది.
అమృత్-2.0 కేటాయింపులు (రూ. కోట్లలో)
కేంద్ర ప్రభుత్వం 68.88
రాష్ట్ర ప్రభుత్వం 118.43
15వ ఆర్థిక సంఘం 19.35
నగరపాలిక 46.16
తాగునీటి సరఫరాకు 88.9
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు సభలతో కాంగ్రెస్ జోరు
[ 04-05-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒకే రోజు రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించడం.. సీఎం రేవంత్రెడ్డి హాజరవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.. నిర్ణీత సమయానికి దాదాపు మూడు నుంచి నాలుగు గంటలపాటు సభలు ఆలస్యమైనా ప్రజలు సీఎం ప్రసంగానికి ఉత్సాహంతో స్పందించారు. -
శాసన సమరం.. దిల్లీలో గళం
[ 04-05-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు నేతలు ఇటు శాసనసభ, అటు లోక్సభ సభ్యులుగా ఎన్నికై ప్రత్యేకత చాటుకున్నారు. రాజకీయ అనుభవం, ప్రజాదరణతో రెండు స్థాయిల్లోని చట్టసభల్లో అడుగుపెట్టి గళం విప్పారు. -
కేసీఆర్ రోడ్ షోతో భారాసలో హుషారు
[ 04-05-2024]
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పెద్దపల్లి లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని ప్రచారానికి వచ్చిన కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా గోదావరిఖనిలో చేపట్టిన రోడ్షో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. -
నేను ఈవీఎం.. 13న కలుద్దాం
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోవైపు పోలింగ్ శాతం పెంపునకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అనారోగ్యంతో ఆబ్కారీ ఎస్సై మృతి
[ 04-05-2024]
ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఆబ్కారీ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న సాదుల కాళిప్రసాద్ (61) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ ఏడాది అక్టోబరులో ఉద్యోగ విరమణ పొందాల్సిన ఆయన అకాల మరణంతో తీవ్ర విషాదం నెలకొంది. -
మావోయిస్టు నేతకు అంతిమ వీడ్కోలు
[ 04-05-2024]
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో ప్రజా సంఘాలు, పౌర హక్కుల నాయకులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో మావోయిస్టు నేత చీమల నర్సయ్య అలియాస్ జోగన్న అంత్యక్రియలను శుక్రవారం నిర్వహించారు. -
బియ్యం అమ్మకాల్లో గోల్మాల్
[ 04-05-2024]
సన్న బియ్యం ధరలు బహిరంగ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు భారంగా మారింది. మరోవైపు తక్కువ తూకంతో వినియోగదారులకు బియ్యం విక్రయిస్తూ కొత్త అక్రమానికి వ్యాపారులు తెరలేపారు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా జిల్లాలో తొలిరోజు 320 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
‘చక్కెర పరిశ్రమపై కాంగ్రెస్ డ్రామా’
[ 04-05-2024]
చక్కెర పరిశ్రమపై రైతులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ డ్రామా అడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. భాజపా జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘పని చేయని నాయకులను నిలదీయాలి’
[ 04-05-2024]
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి పనిచేయని నాయకులను నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలకు పిలుపునిచ్చారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
[ 04-05-2024]
కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం గోవింద్పేట్, పిప్రి, చేపూర్ గ్రామాల్లో, మాక్లూర్ మండలకేంద్రంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. -
పంట రుణాలపై వడ్డీ వసూలు
[ 04-05-2024]
జిల్లాలో వానాకాలం, యాసంగి పంట ఉత్పత్తుల అమ్మకం జోరందుకోగా ప్రభుత్వం, ప్రైవేటు వ్యాపారులు డబ్బులను రైతుల బ్యాంకుఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు బ్యాంకుల్లోని తమ పంట రుణాలను పెద్దఎత్తున రెన్యూవల్స్ చేస్తుండగా వడ్డీభారం వేధిస్తోంది. -
క్యూఆర్ కోడ్తో ఓపీ నమోదు
[ 04-05-2024]
చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే వారు ఓపీ నమోదులో పడుతున్న ఇబ్బందులను తప్పించేందుకు ప్రభుత్వం క్యూఆర్కోడ్ ద్వారా ఓపీ నమోదు చేసుకునే సదుపాయం కల్పించిందని గోదావరిఖనిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందుసింగ్ అన్నారు. -
ఆ రెండు పార్టీలకు ఓటేసి మోసపోవద్దు
[ 04-05-2024]
ఎన్నికల్లో ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని భారాస కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
కేంద్రంలో కాంగ్రెస్కు అధికారం అసాధ్యం
[ 04-05-2024]
లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదానే లేదని, ప్రస్తుతం 300 సీట్లలోకూడా పోటీ చేయని పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. -
వాహనాలు ఇలా.. చెత్త సేకరణ ఎలా?
[ 04-05-2024]
వాహనాలు మరమ్మతులకు గురి కావడంతో వ్యర్థాలు, చెత్త సేకరణపై తీవ్ర ప్రభావం పడుతోంది. వాటిని బాగు చేయించకపోవడంతో నెలల తరబడి మూలన పడి ఉంటున్నాయి. ఫలితంగా వార్డుల్లో సేకరణ సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. -
ఆస్తి పన్ను చెల్లింపులో ఆదర్శం
[ 04-05-2024]
నగర, పురపాలికల్లో ఆస్తిపన్ను చెల్లించే వారిని ప్రోత్సహించేందుకు పురపాలకశాఖ ఏప్రిల్ 1 నుంచి 30 వరకు ఎర్లీబర్డ్ పథకం ప్రవేశపెట్టింది. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ ప్రకటించింది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 04-05-2024]
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తోంది. కరీంనగర్ నగర పాలక సంస్థ పాలకవర్గంలో 60 మంది కార్పొరేటర్లు ఉండగా, ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా లేరు. -
ఈసీ మార్గదర్శకాలపై అవగాహన అవసరం
[ 04-05-2024]
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సూక్ష్మ పరిశీలకులకు (మైక్రో అబ్జర్వర్ల)కు పూర్తి అవగాహన ఉండాలని, ఎన్నికల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పహిల్వాన్ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్
-
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!