logo

అదనపు బస్సు నడపరూ!

చెళ్లకెర నుంచి జిల్లా కేంద్రమైన చిత్రదుర్గంలో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్తున్న తమకు వేళకు బస్సు లేక ఇబ్బందిపడుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులు బస్సు పాసులు జారీ చేసినా ప్రయోజనం కలగడం లేదన్నారు. గురువారం చెళ్లకెర

Published : 21 Jan 2022 06:31 IST

చెళ్లకెర, న్యూస్‌టుడే: చెళ్లకెర నుంచి జిల్లా కేంద్రమైన చిత్రదుర్గంలో ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్తున్న తమకు వేళకు బస్సు లేక ఇబ్బందిపడుతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులు బస్సు పాసులు జారీ చేసినా ప్రయోజనం కలగడం లేదన్నారు. గురువారం చెళ్లకెర బస్టాండు ఆవరణలో విద్యార్థులు ఆందోళన చేశారు. విద్యార్థినులు అశ్విని, భవాని, స్వాతి తదితరులు మాట్లాడుతూ అదనపు బస్సు నడిపితే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. డిపో మేనేజర్‌ వెంకటేశ్‌కు వినతిపత్రం అందజేశారు. పైఅధికారుల దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లి చెళ్లకెర నుంచి మరో బస్సు నడిపేలా చర్య తీసుకుంటానని డిపో మేనేజర్‌ హామీ ఇచ్చారు.

ఆర్టీసీ మేనేజర్‌కు వినతిపత్రం అందజేస్తున్న విద్యార్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు