పరిషత్లో విపక్షనేతగా హరిప్రసాద్
రాష్ట్ర విధానపరిషత్లో ప్రతిపక్ష నాయకుడిగా బీకే హరిప్రసాద్ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఆయనతో పాటు చీఫ్విప్గా ప్రకాష్ రాథోడ్, ఉపనాయకుడిగా గోవిందరాజులును నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు.
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : రాష్ట్ర విధానపరిషత్లో ప్రతిపక్ష నాయకుడిగా బీకే హరిప్రసాద్ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఆయనతో పాటు చీఫ్విప్గా ప్రకాష్ రాథోడ్, ఉపనాయకుడిగా గోవిందరాజులును నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు జారీ చేశారు. ఇదివరకటి ప్రతిపక్ష నేత ఎస్.ఆర్.పాటిల్కు ఇటీవల ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. ఆయన పదవీకాలం ముగిసింది. ఆ పదవికి హరిప్రసాద్ను ఎంపిక చేశారు. బీకే రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఏడేళ్ల పాటు గుజరాత్ రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతల్లో కొనసాగారు. రెండేళ్ల కిందట ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గత లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రతిపక్ష స్థానంపై కన్నేసి పావులు కదిపిన సీనియర్ నేత సి.ఎం.ఇబ్రహీంకు నిరాశ మిగిలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
[ 29-04-2024]
హాసన సెక్స్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు- ఎంపీ ప్రజ్వల్పై లైంగిక దౌర్జన్యం కింద కేసు నమోదు చేసిన మహిళ (47).. భవానీ రేవణ్ణకు స్వయానా మేనత్త కుమార్తె. -
ఉత్తరాన మోదీ ఉరుములు
[ 29-04-2024]
రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం భాజపా ప్రచారం వాయువేగంతో ప్రారంభించింది. ఒకే రోజున నాలుగు ప్రాంతాలు, తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థుల విజయం కోసం భాజపా కీలకనేత- ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారాన్ని ఉరకలెత్తించారు. -
చైతన్యమే జయకేతనం
[ 29-04-2024]
ఉద్యాననగరి బెంగళూరువాసులు చైతన్యవంతంగా అడుగు ముందుకేశారు. -
అడిగింది కొండంత... ఇచ్చింది గోరంత
[ 29-04-2024]
కన్నడనాడుకు రూ.18 వేల కోట్ల కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కోరితే కేంద్రం రూ.3,454 కోట్లు మాత్రమే ఇచ్చిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. -
చెలరేగిన నిరసన ప్రజ్వాల
[ 29-04-2024]
లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన లోక్సభ సభ్యుడు, జనతాదళ్ యువ నాయకుడు ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణలపై కఠిన చర్యలు తీసుకోవాలని యువ కాంగ్రెస్ సమితి డిమాండు చేసింది. -
బెళగావిలో నేనే అభ్యర్థిని!
[ 29-04-2024]
బెళగావి లోక్సభ ఎన్నికల్లోనే తానే అభ్యర్థిని అని భావించి ఓటర్లు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. -
చందనసీమలో నమోజపం!
[ 29-04-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం కర్ణాటకలో నాలుగు బహిరంగసభల్లో పాల్గొని భాజపా అభ్యర్థులకు ఓట్లు అభ్యర్థించారు. -
ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తిరిగిస్తా
[ 29-04-2024]
భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వేసిన ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తప్పకుండా తిరిగి ఇస్తానని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం హొసపేటెలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. -
అబద్ధాలను విశ్వసించవద్దు : సిద్ధు
[ 29-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి యజమానురాలి ఖాతాకు ఏటా రూ.ఒక లక్ష జమ చేస్తామని, రైతుల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీనిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్ కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య