logo

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

కారటగి పోలీసు ఠాణా పరిధి జూరటగి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాల మేరకు.. గంగావతి నుంచి సింధనూరు వైపు వెళ్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది.

Published : 25 May 2022 05:07 IST

దెబ్బతిన్న కారు

కారటగి, న్యూస్‌టుడే: కారటగి పోలీసు ఠాణా పరిధి జూరటగి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాల మేరకు.. గంగావతి నుంచి సింధనూరు వైపు వెళ్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కారటగికి చెందిన నాగరాజ్‌ (24), శ్రీధర్‌ (28) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనం నుజ్జు నుజ్జయింది. ఇద్దరు యువకులు పక్కనే ఉన్న పొలంలోకి ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారటగి ఠాణాలో కేసు నమోదైంది.

మృతి చెందిన యువకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని