న్యాయస్థానాల్లో మౌలిక సౌకర్యాలు అవసరం
న్యాయస్థానాల్లో మౌలిక సౌకర్యాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి సూచించారు. బళ్లారిలోని తాళూరు రహదారిలో కొత్తగా నిర్మించిన జిల్లా న్యాయస్థానం భవనాన్ని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించి ప్రసంగించారు. వేగవంతంగా న్యాయం అందిస్తామని చెప్పారు. న్యాయస్థానాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఆవరణలో మొక్క నాటి నీరు వేస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి
బళ్లారి, న్యూస్టుడే : న్యాయస్థానాల్లో మౌలిక సౌకర్యాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి సూచించారు. బళ్లారిలోని తాళూరు రహదారిలో కొత్తగా నిర్మించిన జిల్లా న్యాయస్థానం భవనాన్ని ఆదివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించి ప్రసంగించారు. వేగవంతంగా న్యాయం అందిస్తామని చెప్పారు. న్యాయస్థానాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తగిన మౌలిక సదుపాయాలు లేకుంటే చట్టాలు అమలు చేయడం కష్టమవుతుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని వృత్తులతోపాటు న్యాయవాది వృత్తిని కూడా మార్చివేసిందన్నారు. బళ్లారి జిల్లా న్యాయవాదుల సంఘం ప్రతినిధులు సమస్యలను ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకురాగా.. వాటిని పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా న్యాయస్థానం పరిపాలన బాధ్యులు జస్టిస్ ఆర్.దేవదాస్ అధ్యక్షత వహించి మాట్లాడారు. రాష్ట్రంలోని బళ్లారి న్యాయస్థానం భవనం పెద్దదని, విశాలమైన ప్రాంగణం ఉందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ మాట్లాడుతూ తనకు బళ్లారి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. కర్ణాటక న్యాయపరిషత్ సభ్యుడు కె.కోటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో కర్ణాటక న్యాయవాదుల పరిషత్ సభ్యుడు జె.ఎం.అనిల్కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.హెచ్.పుష్పాంజలి దేవి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.ఎర్రిగౌడ, సభ్యులు వీరంద్రనాథ, నాగరాజనాయక్, త్రివేణి పత్తార్, ప్రజాపనులశాఖ ఇంజినీరు పూజారి, బళ్లారి న్యాయవాదుల సంఘం ట్రెజరర్ ఈరేశ, బళ్లారి, విజయనగర జిల్లాల న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘం సభ్యులు, ప్రజాపనుల శాఖాధికారులను సన్మానం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..