పంచాయతీ గ్రంథాలయాల డిజిటలీకరణ
రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలోని గ్రంథాలయాలను డిజిటలీకరణ చేసే భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గ్రామ డిజి వికసన కార్యక్రమం, శిక్షణ ఫౌండేషన్ విజయనగర జిల్లా అధికారి చరంతయ్య హిరేమఠ పేర్కొన్నారు.
అవగాహన కల్పిస్తున్న అధికారి చరంతయ్య హిరేమఠ
హొసపేటె, న్యూస్టుడే: రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలోని గ్రంథాలయాలను డిజిటలీకరణ చేసే భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని గ్రామ డిజి వికసన కార్యక్రమం, శిక్షణ ఫౌండేషన్ విజయనగర జిల్లా అధికారి చరంతయ్య హిరేమఠ పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా బుధవారం పంచాయతీల గ్రంథాలయాల నిర్వాహకులకు గ్రామ డిజి వికసనపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓ కంప్యూటర్ తయారు సంస్థ, సంబంధించిన జిల్లా పంచాయతీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. పంచాయతీ పరిధిలోని గ్రంథాలయాలకు కూడా పెద్దఎత్తున విద్యార్థులు, యువకులు సమాచారం కోసం వెళ్తున్నారు. వారికి సాంకేతిక సమాచారం కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీలోని గ్రంథాలయాలను డిజిటలీకరణ చేస్తున్నామని చెప్పారు. ప్రతీ గ్రంథాలయానికి అత్యాధునిక టీవీ, నాలుగు నాజూకు చరవాణులు, ఇతర సాంకేతిక పరికరాలను అందిస్తున్నాం. గ్రంథాలయానికి వచ్చిన విద్యార్థులు, యువకులు వాటిద్వారా సాంకేతిక సమాచారాన్ని తెలుసుకునేందుకు సాధ్యపడుతుందని వివరించారు. ఉన్నత చదువులు చదివిన గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నైపుణ్యత, భావవ్యక్తీకరణ గుణాలు లేకపోవడంతో వారి చదువులకు తగిన ఉద్యోగాలు దొరకడంలేదని అన్నారు. అ నేపథ్యంలో గ్రంథాలయాలను డిజిటలీకరించి, వారికి తగిన సమాచార అందించే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1200 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ డిజి వికసన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. విజయనగర జిల్లాలోని ఆరు తాలూకాల్లో ఈ అవగాహన కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..