నకిలీ స్టాంపులతో ఆస్తుల కబ్జా
ఏకంగా రాజధాని నగరంలోని రెవెన్యూ భవన్ ఆవరణలో నకిలీ స్టాంపు కాగితాలను విక్రయిస్తున్న 11 మందిని బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు అరెస్టు చేశారు. విశ్వనాథ్, కార్తిక్, వెంకటేశ్, శ్యామరాజు, శశిధర, కరియప్ప, రవిశంకర్
నకిలీ స్టాంపు కాగితాలను పరిశీలిస్తున్న అధికారులు రమణ గుప్త, డాక్టర్ శరణప్ప తదితరులు
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : ఏకంగా రాజధాని నగరంలోని రెవెన్యూ భవన్ ఆవరణలో నకిలీ స్టాంపు కాగితాలను విక్రయిస్తున్న 11 మందిని బెంగళూరు నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు అరెస్టు చేశారు. విశ్వనాథ్, కార్తిక్, వెంకటేశ్, శ్యామరాజు, శశిధర, కరియప్ప, రవిశంకర్, శివశంకరప్ప, గుణశేఖర్, రాఘవ, కిశోర్లను నిందితులుగా గుర్తించామని జాయింటు పోలీసు కమిషనర్ రమణగుప్త శుక్రవారం ప్రకటించారు. వీరి నుంచి రూ.5.11 లక్షల ముఖ విలువ కలిగిన 2664 నకిలీ స్టాంపు కాగితాలు, కంప్యూటర్, టైపు రైటర్, ప్రింటర్, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారుల పేరిట తయారు చేయించిన 119 నకిలీ సీళ్లు, హార్డ్డిస్క్లను స్వాధీనపరుచుకున్నారు. ఒక్కో స్టాంపు కాగితాన్ని రూ.5 వేలకు విక్రయించినా, వీటి విలువ రూ.1.33 కోట్లు ఉంటుందని చెప్పారు. వీరు తొమ్మిదో దశకంలోని స్టాంపు కాగితాలను తయారు చేసి, వాటిపై నకిలీ ఒప్పంద పత్రాలు తయారు చేసి, ఆస్తుల కబ్జాకు ప్రయత్నాలు చేశారని గుర్తించారు. పాత స్టాంపు కాగితాలను రూ.5-8 వేలకు వీరు విక్రయించేవారు. ఆస్తి వివాదాలు ఉన్న వారిని వీరు సంప్రదించి, నకిలీ విల్లు, ఒప్పంద పత్రాలను తయారు చేసే వారని ప్రాథమిక విచారణలో గుర్తించారు. వీరి నుంచి నకిలీ స్టాంపు కాగితాలను కొనుగోలు చేసుకున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని డీసీపీ డాక్టర్ శరణప్ప తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు. కేసు తదుపరి దర్యాప్తు బాధ్యతలను హలసూరు గేటు పోలీసులకు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?