అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా పట్టివేత
సింధనూరు తాలూకా గాంధీనగర్లో 20 రోజుల కిందట సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యక్తి ముళ్లపూడి భాస్కరరావు ఇంట్లో దోపిడీ చేసిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
సింధనూరు పోలీసుల ఎదుట నిందితులు, స్వాధీనం చేసుకున్న కార్లు, నగలు, నగదు
సింధనూరు, న్యూస్టుడే: సింధనూరు తాలూకా గాంధీనగర్లో 20 రోజుల కిందట సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యక్తి ముళ్లపూడి భాస్కరరావు ఇంట్లో దోపిడీ చేసిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. సింధనూరు పట్టణం, గాంధీనగర్, పక్కన మాన్విల్లో జరిగిన దోపిడీలు ఈ ముఠా చేసినవే. రాయచూరులోని ఓ శ్రీమంతుని ఇంట్లో కూడా దోపిడీకి పన్నాగం వేయగా.. పక్కా ప్రణాళికతో ఈ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నామని రాయచూరు జిల్లా ఎస్పీ బి.నిఖిల్ సింధనూరులో ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వీరి నుంచి రెండు కార్లు, 520 గ్రాముల బంగారు నగలు, రూ.1.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. గడిచిన రెండు నెలలుగా సింధనూరులో వరుస దోపిడీలు, దొంగతనాలు జరిగాయి. ఇవన్నీ ఈ ముఠా ఆకృత్యాలే. వీటికి సుజాత అనే మహిళ నేతృత్వం వహించేది. స్థానిక ఆదర్శ కాలనీలో అద్దె ఇంట్లో ఉండే ఈ సుజాతది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపాన దువ్వాడ. సింధనూరు కేంద్రంగా రాయచూరు, మాన్విల్లోనూ ఇళ్లను అద్దెకు తీసుకుంది. తొలుత స్థానికంగా శ్రీమంతులతో పరిచయాలు పెంచుకుని వారి పూర్తి వివరాలు సేకరించేది. ఇంట్లో వ్యక్తులు, ఇళ్ల చిరునామాలు, చుట్టుపక్కల ప్రజల తీరు, సీసీ కెమేరాలు తదితర వివరాలు సేకరించి దోపిడీకి పథకం సిద్ధం చేసేది. ఈ పూర్తి సమాచారాన్ని ముగ్గురు యువకుల ముఠాకు అందజేసి.. పని పూర్తయ్యాక నలుగురూ వాటాలు పంచుకునేవారు.
యువకులు ముగ్గురూ గోదావరి జిల్లా వారు..
రామకృష్ణరాజు (భీమవరం), కుమారరాజు, లక్ష్మణ్ (నరసాపురం) ఈ ముగ్గురూ సుజాత ఇచ్చిన సమాచారంతో దోపిడీకి దిగేవారు. ప్లాస్టిక్ పిస్తోలు, రాడ్లు వీరి ఆయుధాలు. ముగ్గురూ 25 నుంచి 30 ఏళ్లలోపు వయసు వారు. ఇందులో రామకృష్ణరాజు, కుమారరాజా ఇద్దరూ ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమెస్ట్రీ పట్టభద్రులని ఎస్పీ వివరించారు. గాంధీనగర్ దోపిడీ సమయంలో ఒక కారు మాత్రం ఉండేది. ఆ దోపిడీ తరువాత బెంగళూరులో మరో కారు కొనుగోలు చేశారు. గాంధీనగర్ ఇంట్లో దోపిడీలో జతగా లాక్కొచ్చిన సీసీ కెమెరా డీవీఆర్ను ఎక్కడో కాలువలో విసిరేశారని తెలిపారు. సెప్టెంబరు నుంచే ఈ ముఠాపై కన్ను వేసి ఉంచామని, 20 రోజులుగా పక్క రాష్ట్రానికి వెళ్లి ఎంతో కష్టపడగా ఈ ముఠా చిక్కిందని ఎస్పీ తెలిపారు. ఇందుకు సింధనూరు పోలీసులను అభినందిస్తున్నానని తెలిపారు. సింధనూరు పోలీసు బృందానికి ఎస్పీ రూ.25 వేల నగదు బహుమతిగా అందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ శివకుమార్, డీఎస్పీ వెంకటప్ప నాయక్, సింధనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..