అవినీతి పాలనకు అంతిమకాలం
కర్ణాటకలో రాహుల్ గాంధీ 510 కిలోమీటర్ల పాదయాత్రను చామరాజనగర జిల్లా గుండ్లుపేట నుంచే ప్రారంభించారని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ గుర్తు చేశారు.
భాజపాపై కాంగ్రెస్ నిప్పులు
‘ప్రజాధ్వని’ వేదికపై జ్యోతి వెలిగిస్తున్న సిద్ధరామయ్య, శివకుమార్
చామరాజనగర, న్యూస్టుడే : కర్ణాటకలో రాహుల్ గాంధీ 510 కిలోమీటర్ల పాదయాత్రను చామరాజనగర జిల్లా గుండ్లుపేట నుంచే ప్రారంభించారని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, వచ్చినా.. ముఖ్యమంత్రి పదవి కోసం నాయకుల మధ్య చీలికలు వస్తున్నాయని అధికార పార్టీ చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. చామరాజనగర జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాహుల్ పాదయాత్రకు, దసరా ఉత్సవాలకు హాజరైన సమయంలో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ వచ్చిన సమయంలో ఈ జిల్లా ప్రజలు చూపించిన ఉత్సాహాన్ని ఎన్నికలలో ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. చామరాజనగరలో ప్రజాధ్వని సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. మేకెదాటు కోసం నిర్వహించిన పాదయాత్రకూ ఇక్కడి ప్రజల నుంచి మద్దతు లభించిందని గుర్తు చేశారు. అవినీతికి పెద్ద పీటవేసే భాజపాను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 17న ప్రవేశపెట్టే బడ్జెట్లోనూ అబద్ధపు కేటాయింపులే ఉంటాయని, దాన్ని విశ్వసించి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల ధ్వనిని, ఆగ్రహాన్ని, వారికి కావలసిన అంశాలను గుర్తించేందుకు చేస్తున్న ప్రజాధ్వని యాత్రకు చక్కని స్పందన లభిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సాధికారత లభించినట్లేనని తెలిపారు. భాజపాది రహస్య అజెండా అని, శ్రీమంతులు, వ్యాపారులకు మాత్రమే మేలు చేస్తుందని విమర్శించారు. గత ఎన్నికలలో పూర్తి మెజార్టీ రాకపోవడంతో దళ్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, ‘ఆపరేషన్ కమల’తో భాజపా ఆ ప్రభుత్వాన్ని కూలదోసిందని ఆరోపించారు. చామరాజనగర ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా లేక 36 మంది మరణించారని, అప్పుడు కూడా ముగ్గురే చనిపోయారని మంత్రులు అబద్ధం ఆడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మృతుల కుటుంబాలలోని అర్హులకు చామరాజనగర వైద్య కళాశాలలో ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ నాయకులు బీకే హరిప్రసాద్, ధ్రువనారాయణ, గోవిందరాజు, పుట్టరంగశెట్టి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్