‘ముఖ్యమంత్రిపై మాట్లాడే నైతికత మీకెక్కడిది?’
ప్రతిపక్షనేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ తమ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అవినీతిపై మాట్లాడే నైతికత లేదు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బి.శ్రీరాములు, చిత్రంలో డీసీ, ఎస్పీ, జడ్పీ సీఈవో, తదితరులు
బళ్లారి, న్యూస్టుడే: ప్రతిపక్షనేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ తమ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అవినీతిపై మాట్లాడే నైతికత లేదు. అవినీతిలో కాంగ్రెస్ పెద్ద రాయబారి. కాంగ్రెస్ నేతల డీఎన్ఏలో కూడా అవినీతి తెలుస్తోందని రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమశాఖ మంత్రి బి.శ్రీరాములు విమర్శించారు. విమ్స్ వైద్య కళాశాల క్రీడామైదానంలో 74వ గణతంత్ర దినోత్సవంలో త్రివర్ణ జెండా ఎగురవేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు నోరు విప్పితే అవినీతి మాటలు తప్పా...మరి ఏమి రావడం లేదన్నారు. తమ ముఖ్యమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడిపై మాట్లాడే నైతికత కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. సిద్ధరామయ్య, డి.కె.శివకుమార్ దోస్తిల రంగు త్వరలో వెల్లడికానుందన్నారు. ఓటమి భయంతో సిద్ధరామయ్య కోలారు వీడే ఆలోచనలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అంత సులభం కాదన్నారు. ఏడాది ముందు బళ్లారి జిల్లా బాధ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించినా.. జిల్లాలో అభివృద్ధి పనులు పరుగులు తీయించినట్లు తెలిపారు. రాబోయే విధానసభ ఎన్నికల్లో బళ్లారి జిల్లా నుంచే పోటీ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. బళ్లారి గ్రామీణ, లేకుంటే సండూరు విధానసభ క్షేత్రం నుంచి పోటీ చేసే ఆలోచన ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. డీసీ పవన్కుమార్ మాలపాటి, జడ్పీ సీఈవో జి.లింగమూర్తి, ఎస్పీ రంజిత్కుమార్ బండారు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?