కేంద్ర కారాగారంలో ఆకస్మిక తనిఖీలు
కేంద్ర కారాగాన్ని జిల్లా పోలీస్ అధికారి రంజిత్కుమార్ బండారు తమ అధికారులు, సిబ్బందితో కలిసి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు.
మూడు చరవాణులు, సిమ్ కార్డులు స్వాధీనం
సిమ్కార్డులు, చరవాణులు ఉపయోగిస్తున్న ఖైదీలతో పోలీస్ అధికారులు, జైలు అధికారులు
బళ్లారి, న్యూస్టుడే: కేంద్ర కారాగాన్ని జిల్లా పోలీస్ అధికారి రంజిత్కుమార్ బండారు తమ అధికారులు, సిబ్బందితో కలిసి మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. జైల్లోని వివిధ బ్లాక్లను జల్లెడ పట్టగా ఒక్కొక్క సిమ్ కార్డ్ ఉన్న మూడు చరవాణులు, మూడు ప్రత్యేక సిమ్కార్డులను గుర్తించి స్వాధీనం చేసుకుని ఖైదీలపై బళ్లారి గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు. బళ్లారి కేంద్ర కారాగారంలో ఉంటున్న ఖైదీలు చరవాణి ఉపయోగిస్తున్నారు. గంజాయి కూడా వాడుతున్నారని ముందుగా అందిన సమాచారంతో ఎస్పీ రంజిత్కుమార్, నగర డీఎస్పీ కె.బసవరాజ, సీఐలు శ్రీనివాసమేటి, సిద్దరామేశ్వర, ఎం.ఎస్.సిందూరు, వాసుకుమార్, బసవరాజ పాటిల్, గుండూరావ్, అంబరేశ్ హుబ్బళ్లి, గోవింద, ఎస్.ఐలు తదితర 100 మంది పోలీసులు ఉదయం 6 గంటలకు కేంద్ర కారాగారానికి చేరుకున్నారు. ఖైదీలు ఉంటున్న బ్లాక్లను జల్లెడ పట్టారు. ఒక్కొక్క బ్లాక్ను రెండు గంటలకుపైగా పరిశీలించారు. ఖైదీలు ఉంటున్న బ్లాక్లో సంచులు, దుస్తులు తదితర వాటిని తనిఖీ చేయగా మూడు చరవాణులు, ఛార్జర్లు, మూడు సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ అధికారులకు జైలు ముఖ్య పర్యవేక్షకురాలు లత, ఉప పర్యవేక్షకులు అంబరీశ్ పూజారి, తదితర జైలు అధికారులు, సిబ్బంది కూడా సహకరించారు. సిమ్ కార్డులతో పాటు, చరవాణులు ఉపయోగిస్తున్న ఖైదీలపై బళ్లారి గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి వాటికి తావు లేకుండా అధికారులు తరుచు పరిశీలించాలని జైలు అధికారులకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్