Brahmanandam: భాజపాకు మద్దతుగా నటుడు బ్రహ్మానందం ప్రచారం
కర్ణాటక విధానసభ ఎన్నికలు చేరువ అవుతుండడంతో సినీనటుల ప్రచారమూ ఊపందుకుంది. చిక్కబళ్లాపుర నియోజకవర్గంలోని పుర, గిడగానహళ్లి, మంచెనహళ్లి, పోశెట్టిహళ్లి, కనగానగొప్ప, జోడి బొమ్మనహళ్లి తదితర గ్రామాలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గురువారం ప్రచారాన్ని నిర్వహించారు.
మైసూరు, న్యూస్టుడే : కర్ణాటక విధానసభ ఎన్నికలు చేరువ అవుతుండడంతో సినీనటుల ప్రచారమూ ఊపందుకుంది. చిక్కబళ్లాపుర నియోజకవర్గంలోని పుర, గిడగానహళ్లి, మంచెనహళ్లి, పోశెట్టిహళ్లి, కనగానగొప్ప, జోడి బొమ్మనహళ్లి తదితర గ్రామాలో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గురువారం ప్రచారాన్ని నిర్వహించారు. భాజపా అభ్యర్థి, మంత్రి డాక్టర్ కె.సుధాకర్కు ఓటు వేసి గెలిపించాలని తెలుగులో విన్నవించారు. ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు జిల్లా కావడంతో చిక్కబళ్లాపురలో ఎక్కువ మంది తెలుగు వారే ఉన్నారు. సేద్యం, ఉపాధి రంగాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు బ్రహ్మానందాన్ని రంగంలో దించారు. మంత్రి సుధాకర్తో తనకు మొదటి నుంచి పరిచయం ఉండడం, వైద్యునిగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు తెలిసి ప్రచారానికి వచ్చానని బ్రహ్మానందం చెప్పారు. చిక్కబళ్లాపురలో నటుడు దర్శన్, లోక్సభ సభ్యుడు పీసీ మోహన్లతో కలిసి సుధాకర్ రోడ్షోలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరవు గాయానికి మందు!
[ 28-04-2024]
కేంద్ర, రాష్ట్రాల మధ్య కరవు పరిహారం కోసం కొనసాగుతున్న పోరు కొలిక్కి వచ్చింది. గత శుక్రవారం కేంద్ర సర్కారు వారం రోజుల్లో ఈ పరిహారం చెల్లిస్తామని హామీ ఇస్తూ విచారణ వాయిదా చేయాలని కోరిన విషయం తెలిసిందే. -
ఇక..ఉత్తర దిగ్విజయయాత్ర!
[ 28-04-2024]
కర్ణాటక దక్షిణ, పాతమైసూరు, కరావళి ప్రాంతాల్లో తొలివిడత ఎన్నికలను విజయవంతంగా ముగించిన పార్టీలు.. రెండో విడతపై దృష్టి సారించాయి. -
హాసనలో లైంగిక దౌర్జన్యాలపై సిట్
[ 28-04-2024]
హాసన జిల్లాలో ఓ పార్టీకి చెందిన యువ నాయకుడు యువతులు, మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. -
భాజపా తీరు ప్రమాదకరం
[ 28-04-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా నాయకులతో వెనుకబడిన వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. -
తప్పుడు ప్రచారంలో ఆరితేరారు
[ 28-04-2024]
అబద్ధాలను చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరితేరారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. చెప్పిన అబద్ధాన్ని మరోసారి చెప్పకుండా, కొత్తవి నమ్మించేలా చెప్పడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. -
కారటగిలో రెండు ఆదర్శ పోలింగ్ కేంద్రాలు
[ 28-04-2024]
ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు ఆకర్షించేందుకు కారటగి పట్టణంలోని రెండు పోలింగ్ కేంద్రాలను అధికారులు మాదిరి పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. -
కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం
[ 28-04-2024]
పేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, కూలీలు, విద్యార్థులకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలని డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ కోరారు. -
అమాత్యులకు పరువు.. ఆయనకు రాజకీయ మలుపు
[ 28-04-2024]
బళ్లారి లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాం గెలుపును బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, జమీర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. -
ప్రధాని ముఖంలో ఓటమి భయం
[ 28-04-2024]
అబద్ధాల సర్దార్..మౌని బాబా ప్రధాని నరేంద్ర మోదీ ముఖంలో ఓటమి భయం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని లోక్సభ మాజీ సభ్యుడు వి.ఎస్.ఉగ్రప్ప తెలిపారు. -
కాంగ్రెస్ వారు చెంబు లీజ్కు తీసుకున్నారా?
[ 28-04-2024]
బళ్లారి నగరంలో జరిగిన బహిరంగ సమావేశంలో రాహుల్గాంధీ హస్తం గుర్తు గురించి మాట్లాడలేదు. ఖాళీ చెంబు గురించే మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!