logo

నాకు ప్రాణాపాయం

లోక్‌సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ఆరోపించారు.

Published : 29 Mar 2024 03:26 IST

ప్రియాంక్‌ ఖర్గే ఆందోళన

కలబురగి, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే ఆరోపించారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తాను రాజ్యాంగంపై నమ్మకం ఉన్న వ్యక్తినని చెప్పారు. తనను అంతం చేస్తానని అశ్లీల పదాలు ఉపయోగించి లేఖలు వచ్చాయన్నారు. పంచామృతంతో పూజ చేసినా, నీ కులం నిన్ను వదిలిపెట్టదని, వేషాన్ని మార్చినా, మంత్రి అయినా, రాజు అయినా నిన్ను అంతం చేస్తామంటూ వచ్చిన లేఖను చదివి వినిపించారు. సమావేశం అనంతరం స్థానిక ఠాణాలో ఆయన ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని