ఏటా... ఊరట
మాతృ మరణాల నివారణకు ప్రభుత్వ కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే మరణాలు తగ్గాయి. ఏటా పదుల సంఖ్యలో మాతృ మరణాలు సంభవిస్తున్నాయి.
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే
రామవరం ఎంసీహెచ్లో బాలింత మృతితో శోకసంద్రంలో కుటుంబ సభ్యులు (పాత చిత్రం)
మాతృ మరణాల నివారణకు ప్రభుత్వ కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గతేడాదితో పోలిస్తే మరణాలు తగ్గాయి. ఏటా పదుల సంఖ్యలో మాతృ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రసవ సమయంలో లేదా ఆ తర్వాత 42 రోజుల్లోపు బాలింతలు మరణిస్తే వాటిని ప్రసూతి మరణాలుగా పరిగణిస్తారు. జాతీయ నమూనా సర్వే నివేదికలో రాష్ట్రం ప్రాతిపదికన ప్రతి లక్ష కాన్పుల చొప్పున వీటిని లెక్కిస్తారు.
మరణాల్లో..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉభయ జిల్లాల్లో ఆరేళ్ల నుంచి మాతృమరణాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకున్నాయి. 2017-18 నుంచి 2019-20 వరకు ఖమ్మం జిల్లాలో 37 మరణాలు సంభవించగా భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 64 నమోదయ్యాయి. 2021-22లో ఖమ్మం జిల్లాలో 17 మంది మరణించగా.. భద్రాద్రిలో మాత్రం 12 మంది చనిపోయారు. ఖమ్మం జిల్లాతో పోలిస్తే భద్రాద్రిలో ప్రసవాలూ తక్కువగానే జరిగాయి. ఈ ఏడాది రెండు జిల్లాల్లోనూ తొమ్మిది మంది చొప్పున బాలింతలు మరణించినట్లు నివేదిక చెబుతోంది. ఏటా జరుగుతున్న కాన్పులను పరిశీలిస్తే మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. గర్భస్థ దశ నుంచి ప్రసవం వరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సంరక్షణ పథకాలు అమలుచేస్తుంది. మాతృమరణాల తగ్గుదలకు ఇవి దోహదపడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గర్భిణుల సత్వర నమోదు నుంచి..
మాతృ మరణాల నివారణకు క్షేత్ర స్థాయి నుంచే ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గర్భం దాల్చిన మూడో నెలలో స్థానిక ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పేర్లు నమోదు చేస్తున్నారు. ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ నిరంతరం వారిని పర్యవేక్షిస్తున్నారు. మాతృమరణాల్లో ప్రధాన కారణంగా భావిస్తున్న రక్తహీనతను అధిగమించేందుకు ఐరన్ మాత్రలు అందిస్తున్నారు. హైరిస్క్ కేసులను ముందస్తుగానే గుర్తించి శ్రద్ధ చూపుతున్నారు. సాధారణ ప్రసవాలు పెంచేందుకు మిడ్వైఫరీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. గర్భస్థ దశలో యోగాసనాలు, వ్యాయామాలు, ఆహారం వంటి అంశాల ప్రాధాన్యం గురించి వివరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..