తుదిపోరు.. యమజోరు
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరుగుతున్న 6వ ఇంటర్ సొసైటీ లీగ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. నాలుగు రోజులపాటు కిన్నెరసాని క్రీడా పాఠశాల వేదికగా సందడిగా సాగిన పోటీల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముగిసిన ఇంటర్ సొసైటీ లీగ్ రాష్ట్రస్థాయి పోటీలు
ఓవరాల్ ఛాంపియన్ ట్రోఫీతో మొదటి స్థానంలో నిలిచిన సోషల్ వెల్ఫేర్ టీం క్రీడాకారులు
పాల్వంచ(జగన్నాథపురం), న్యూస్టుడే: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరుగుతున్న 6వ ఇంటర్ సొసైటీ లీగ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు గురువారం ముగిశాయి. నాలుగు రోజులపాటు కిన్నెరసాని క్రీడా పాఠశాల వేదికగా సందడిగా సాగిన పోటీల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 148 మంది రిఫరీలు, 550 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, 20 ఆర్గనైజింగ్ కమిటీల్లో 300 మంది వివిధ సొసైటీ ఉద్యోగులు, 300 మంది వంట సిబ్బంది, 3500 మంది క్రీడాకారులతో 13 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు ప్రత్యేక పర్యవేక్షణలో వసతి, భోజన విషయంలో లోటుపాట్లు తలెత్తకుండా చూసుకున్నారు. గురువారం ముగింపు కార్యక్రమానికి ముఖË్య అతిథిగా జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులు, సొసైటీ అధికారులు, సిబ్బంది నిర్వహించిన కవాతును తిలకించారు. అనంతరం మాట్లాడుతూ.... స్నేహభావంతో ఉండేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. డీడీ రమాదేవి మాట్లాడుతూ... క్రీడలు సజావుగా సాగాయని, ఏడు సొసైటీల అధికారులు, కోచ్లు, పీడీ, పీఈటీలు, ఇతర సిబ్బంది సహకారం మరువలేదనిదన్నారు. ఏపీవో జనరల్ డేవిడ్రాజ్ కృతజ్ఞతలు తెలిపారు.
క్రీడల అధికారికి సన్మానం:
జిల్లా గిరిజన క్రీడల అధికారి డా.ఎం.వీరునాయక్ను ఏడు సొసైటీల అధికారులు, పీడీ, పీఈటీ, కోచ్, రిఫరీలు సన్మానించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గురువారం ఓ క్రీడాధికారి స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. సీవోఈపీడీ లక్ష్మణ్నాయక్, క్రీడల రాష్ట్ర అధికారులు సోమేశ్, రామ్లక్ష్మణ్, రవికుమార్, అరుణకుమారి, జ్యోతి, పార్థసారథి, డిప్యూటీ సెక్రటరీలు లతీఫ్, తిరుపతి, రామ్లాల్, జిల్లా గిరిజన క్రీడల అధికారి డా.ఎం.వీరునాయక్ తదితరులు పాల్గొన్నారు.
* అథ్లెటిక్స్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్బాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్ తదితర 13 క్రీడల్లో పలువురు క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. గురువారం తుది పోరులో ఓవరాల్ ఛాంపియన్గా సోషల్ వెల్ఫేర్, ద్వితీయ స్థానంలో ట్రైబల్ వెల్ఫేర్(ఆశ్రమ), తృతీయ స్థానంలో మైనార్టీ గురుకులాలు నిలిచాయి.
* ఓవరాల్.. ఆల్ ఏజ్ గ్రూప్ గేమ్స్ ఛాంపియన్షిప్: సోషల్ వెల్ఫేర్ ప్రథమ, ట్రెబల్ వెల్ఫేర్(ఆశ్రమ) ద్వితీయ, మైనార్టీ, (బీసీ) గురుకులాలు (తృతీయ).
* ఓవరాల్ ఛాంపియన్షిప్ ఆల్ ఏజ్ గ్రూప్ స్పోర్ట్స్: సోషల్ వెల్ఫేర్, మైనార్టీ గురుకులం, ఆశ్రమ (ట్రెబల్ వెల్ఫేర్)
* ఓవరాల్.. ఆల్ ఏజ్ గ్రూప్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్: సోషల్ వెల్ఫేర్, ఆశ్రమ స్కూల్స్(ట్రెబల్ వెల్ఫేర్), మైనార్టీ మూడో స్థానంలో నిలిచాయి.
ద్వితీయ స్థానంలో ఆశ్రమ(ట్రెబల్ వెల్ఫేర్) జట్టు క్రీడాకారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..