ముఖ్యమంత్రి కేసీఆర్ హిందూ ద్రోహి
సంపూర్ణ హిందువునని చెప్పుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువుల ద్రోహి అని శ్రీకాకుళం ఆనందాశ్రమం పీఠాధిపతి, సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. భద్రాచలం విచ్చేసిన ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు
ఆనందాశ్రమం పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసానంద సరస్వతి, చిత్రంలో కుంజా సత్యవతి
భద్రాచలం పట్టణం, న్యూస్టుడే: సంపూర్ణ హిందువునని చెప్పుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువుల ద్రోహి అని శ్రీకాకుళం ఆనందాశ్రమం పీఠాధిపతి, సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. భద్రాచలం విచ్చేసిన ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి హిందువై ఉండి.. హిందువులను కాలరాస్తా, నాశనం చేస్తా అంటున్న వారితో జత కట్టడమే ఆయన ద్రోహి అనడానికి నిదర్శనమన్నారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి రాముడికి రూ.100 కోట్లు ప్రకటించి విస్మరించారని ఎద్దేవా చేశారు. ఏపీలో ఉన్న దేవస్థానం భూములు కబ్జాకు గురవుతుంటే చేష్టలుడిగి చూడటం దారుణమన్నారు. తితిదే భూములు దేశంలో ఎక్కడ ఉన్నా వారు పరిరక్షించుకోవడం లేదా అని అన్నారు. యాదాద్రి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ దందాలో తనకు నచ్చిన వారి భూములున్నాయని అక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేశారని ఆరోపించారు. త్వరలో అన్ని ధార్మిక సంస్థలతో భద్రాచలంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించి భద్రాద్రికి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతామని హెచ్చరించారు. హిందువులంతా పార్టీలకు అతీతంగా భద్రాచలానికి న్యాయం జరిగేలా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. భాజపా నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, భాజపా నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎలా వెళ్తారో.. అలా రావాల్సిందే..
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రెండేళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వినియోగించే ఈవీఎంలను ఆయా శాసనసభ నియోజకవర్గాలకు తరలించిన అధికారులు.. పోలింగ్ సిబ్బందిని సైతం సిద్ధం చేశారు. -
జిల్లాలో వర్షం
[ 08-05-2024]
నెల రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతున్న జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లని గాలులతో ప్రజలు సేదదీరారు. అక్కడక్కడ జల్లులు కురిశాయి. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..
[ 08-05-2024]
ఉభయ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా మొదలైంది. విద్యా సంవత్సరం ఆరంభం కాగానే విద్యార్థులకు అందజేసే లక్ష్యంతో విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు చర్యలను సెలవులు మొదలైన తర్వాత ఏప్రిల్ నెల నుంచే ఉన్నతాధికారులు ప్రారంభించారు. -
రక్తహీనత.. బాధితులకు చేయూత
[ 08-05-2024]
థలసీమియా.. చిన్నారులకు ఒక శాపం. వంశపారంపర్యంగా, మేనరికం వివాహాల వల్ల ఇది సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి బయటపడిన చిన్నారులు నెలకోసారి రక్తం ఎక్కించుకుంటూ జీవితకాలాన్ని పొడిగించుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. -
ఖమ్మంలో కమల వికాసం ఖాయం
[ 08-05-2024]
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ఖమ్మం లోక్సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కాంగ్రెస్, భారాస హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశించిన స్థాయి అభివృద్ధి జరగలేదని, ప్రజలు ఈసారి భాజపా వైపు చూస్తున్నారని చెప్పారు. -
సత్వర న్యాయమే ప్రథమ ప్రాధాన్యం: జిల్లా జడ్జి
[ 08-05-2024]
కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే ప్రథమ ప్రాధాన్యమని, న్యాయవాదులు బెంచ్కు సహకరించాలని జిల్లా జడ్జి జి.రాజగోపాల్ అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి చింతనిప్పు వెంకట్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ హాల్లో నూతన న్యాయాధికారుల పరిచయ కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. -
ఘనంగా సీతారామ కల్యాణోత్సవం
[ 08-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు సాగాయి. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చన నిర్వహించడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. -
రఘురాంరెడ్డిని గెలిపిస్తే.. ‘ఖమ్మం’ను అగ్రస్థానంలో నిలబెడతారు
[ 08-05-2024]
కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపిస్తే ఖమ్మం లోక్సభ స్థానాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతారని సినీనటుడు విక్టరీ వెంకటేశ్ అన్నారు. పట్టణ ప్రముఖులు, వైద్యులతో కొత్తగూడెం క్లబ్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. -
భారాస విజయమే లక్ష్యంగా పనిచేయండి: నామా
[ 08-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భారాస విజయమే లక్ష్యంగా బూత్ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆపార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన బూత్స్థాయి కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కేసీఆర్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: కవిత
[ 08-05-2024]
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మాజీ సీఎం కేసీఆర్తోనే సాధ్యమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. దాస్తండాలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి: భంజ్దేవ్
[ 08-05-2024]
భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి సాధ్యమని కాకతీయవంశ వారసుడు, బస్తర్ మహారాజు కమల్చంద్ర భంజ్దేవ్ అన్నారు. భాజపా లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావుకు మద్దతుగా దమ్మపేటలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి దుర్మరణం
[ 08-05-2024]
విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం.. అశ్వారావుపేటలో ఓ భవన నిర్మాణ పనుల కోసం గుత్తేదారు, ఏపీలోని కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం బాలరామపురానికి చెందిన దాసరి సూరిబాబు(40), మరి కొందరిని తీసుకొచ్చాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజీఎఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!