అన్నపూర్ణగా మారిన తెలంగాణ వైపే దేశం చూపు: మంత్రి
రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
రఘునాథపాలెం రైతు వేదికలో కరపత్రాలను ఆవిష్కరిస్తున్న
మంత్రి అజయ్కుమార్, ఎంపీ నామా, కలెక్టర్ గౌతమ్ తదితరులు
రఘునాథపాలెం, న్యూస్టుడే: రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అన్నపూర్ణగా మారిన తెలంగాణ వైపే యావత్ దేశం చూస్తోందన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రఘునాథపాలెం, రాంక్యాతండా రైతు వేదికల్లో శనివారం నిర్వహించిన రైతు దినోత్సవాల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ వీపీ గౌతమ్లతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఎరువులు, విత్తనాలు, గిట్టుబాటు ధర, విద్యుత్తు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసి భూగర్భ జలాలను పెంచామని, ప్రాజెక్టులను నిర్మించి సాగునీటిని అందించామన్నారు. రైతుబంధుతో ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి అందిస్తున్నామని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతాల్లో సోమవారం నుంచి పరిహారం జమవుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ అండతో ఆర్థికంగా బలోపేతమై ఇప్పుడు ఆయననే గద్దె దించుతాం, ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వబోమని కొందరు ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీగా గ్రామాల్లో తట్ట మట్టి పోయని వాళ్లు ఇప్పుడు అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు. అటువంటి నాయకులను గ్రామ పొలిమేరల్లోనే అడ్డుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పదేళ్లలో కనీవినీ ఎరుగని ప్రగతి సాధించామన్నారు. గతంలో వేసవి వస్తే గ్రామాల్లో తాగునీరు, సాగునీరు, విద్యుత్తు అందక ఇబ్బందులు ఎదురయ్యేవని చెప్పారు. అన్నదాతల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, పంటల కొనుగోలు, ఉచిత విద్యుత్తు వంటి పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ... రైతును రాజును చేసి వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగలా మార్చిందన్నారు. ప్రతి క్లస్టర్లో రైతు వేదికలు నిర్మించి పంటల సాగు, మార్కెటింగ్ మెలకువలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కరపత్రాలు, గోడపత్రికలను ఆవిష్కరించారు. డీఏఓ విజయనిర్మల, డీసీఓ విజయకుమారి, ఎంపీపీ భూక్యా గౌరి, జడ్పీటీసీ సభ్యురాలు మాలోతు ప్రియాంక, సర్పంచులు శారద, అమాలి, ఆత్మ ఛైర్మన్ లక్ష్మణ్ నాయక్, మద్దినేని వెంకటరమణ, మందడపు సుధాకర్, తాతా రఘురాం, నల్లమోతు శ్రీను, కుర్రా భాస్కరరావు, ఈరూనాయక్, కోటేశ్వరరావు, ఏడీఏలు శ్రీనివాస్, సరిత, తహసీల్దారు నరసింహారావు, ఎంపీడీఓ రామకృష్ణ, ఏఓ భాస్కరరావు పాల్గొన్నారు.
నేడు సురక్షా దినోత్సవ్ ర్యాలీ
ఖమ్మం నేరవిభాగం: రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించే ‘సురక్షా దినోత్సవ్’ ర్యాలీని విజయవంతం చేయాలని సీపీ విష్ణు ఎస్.వారియర్ కోరారు. తన కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంలోని స్టేడియం నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమై పాత బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన సభ వద్దకు చేరుకుంటుందన్నారు. పోలీసు శాఖ ద్వారా ప్రజలకు ఒనగూరుతున్న సౌకర్యాల గురించి వివరిస్తామని తెలిపారు. జడ్పీ సెంటర్ నుంచి పోలీసు బ్యాండ్తో మయూరిసెంటర్ వరకు సాయంత్రంపాదయాత్ర చేపడతామన్నారు. అనంతరం పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమానికి మంత్రి పువ్వాడ హాజరవుతారని పేర్కొన్నారు. అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, శిక్షణ ఐపీఎస్ అవినాశ్కుమార్, ఏసీపీలు రామోజు రమేశ్, గణేశ్, ప్రసన్నకుమార్, వెంకటస్వామి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..