నేడు పోడు పట్టాల పంపిణీ సర్వం సిద్ధం
జిల్లాలో పోడు పట్టాల పంపిణీ ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుందని, ఇందుకోసం సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు.
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ అనుదీప్
పాల్వంచ కేటీపీఎస్, న్యూస్టుడే: జిల్లాలో పోడు పట్టాల పంపిణీ ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుందని, ఇందుకోసం సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. పాల్వంచలోని సుగుణ గార్డెన్ ఫంక్షన్ హాలులో ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి 500 మంది చొప్పన జిల్లా వ్యాప్తంగా 2,500 మంది లబ్ధిదారులకు తొలిరోజు పట్టాలు అందజేయనున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 50,595 మందికి పట్టాలు ఇస్తామన్నారు. మండలాల వారీగా ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల వద్ద స్థానిక పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ స్వర్ణలత, ఐటీడీఏ ఏపీఓ డేవిడ్రాజ్, ఓఎస్డీ సాయిమనోహర్, డీఎస్పీ వెంకటేశ్, డీఆర్డీఓ మధుసూదన్రాజు, జడ్పీ సీఈఓ విద్యాలత, జడ్పీ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ రమాకాంత్, డీసీఓ వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమాధికారి సంజీవ్రావు, ఆర్అండ్బీ డీఈ నాగేశ్వరరావు, డీఆర్వో అశోక్చక్రవర్తి, ఏఓ గనియా, పాల్వంచ తహసీల్దార్ రంగాప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు మండలం పోచారం తండా, మాణిక్యారం గ్రామాల్లో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, సీఐ కరుణాకర్, కొమరారం ఎస్సై సోమేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
సినీ నటుడు వెంకటేశ్ కుమార్తె ప్రచారం
[ 02-05-2024]
సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్ కూతురు ఆశ్రిత బుధవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓట్లు భద్రం.. తీర్పు సుస్పష్టం..!
[ 02-05-2024]
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈవీఎంలలో ఓటు భద్రమేనా అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. -
భగభగలు
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఖమ్మం జిల్లా బుధవారం నిప్పులగుండంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో అత్యధికంగా 46.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. -
పోలింగ్ సమయంలో అప్రమత్తత అవసరం: కలెక్టర్
[ 02-05-2024]
పోలింగ్ సమయంలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. -
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: పొంగులేటి
[ 02-05-2024]
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు -
ఈసారీ అధిక మెజార్టీ ఇవ్వండి: నామా
[ 02-05-2024]
గత లోక్సభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని, ఈసారి మరింత ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
అభ్యర్థుల్లో వాటా 3 శాతమే
[ 02-05-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యానికి ప్రతీక. ఏ ఎన్నిక జరిగినా ఓటు జాబితాలో మహిళోత్సాహం ఎక్కువనే చెప్పాలి. వివిధ ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా వీరే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల తలరాతను మార్చటంలో కీలకపాత్ర వహించారు. -
మేడే వద్దన్న మోదీని వదిలించుకుందాం: తమ్మినేని
[ 02-05-2024]
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే విదేశీయులదని, దీన్ని రద్దు చేస్తామని పిలుపునిచ్చిన ప్రధాని మోదీని రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓడించి వదిలించుకుందామని, కార్మికుల ఐక్యతను చాటుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. -
రాములోరికి ఘనంగా తిరుమంజనం
[ 02-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో బుధవారం తిరుమంజనం పూజను ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు వేదమంత్రాల నడుమ తిరుమంజనం కొనసాగించారు -
స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలి: ఎస్పీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించేందుకు పోలీసులు కృషిచేయాలని ఎస్పీ బి.రోహిత్రాజు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం