సత్తుపల్లి తొలి మహిళా ఎమ్మెల్యే రాగమయి
సత్తుపల్లి నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యేగా డాక్టర్ మట్టా రాగమయి నిలిచారు.
సత్తుపల్లి, న్యూస్టుడే: సత్తుపల్లి నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యేగా డాక్టర్ మట్టా రాగమయి నిలిచారు. ఉమ్మడి జిల్లాలోనూ ఏకైక మహిళా ఎమ్మెల్యే తానే కావడం మరో విశేషం. సత్తుపల్లి(వేంసూరు) నియోజకవర్గంలో 1952 నుంచి 2018 వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా ఏనాడు మహిళలకు అవకాశం దక్కలేదు. తొలి ప్రయత్నంలోనే హాట్రిక్ ఎమ్మెల్యే, భారాస అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యపై భారీ మెజార్టీతో గెలిచారు. వైద్యురాలిగా సత్తుపల్లి ప్రజలకు ఆమె సుపరిచితులు కావడంతోపాటు తన భర్త డాక్టర్ దయానంద్ కౌన్సిలర్గా, అత్త మట్టా ఆరోగ్యం ఎంపీపీగా పని చేయడంతో రాజకీయంగా ఆమెకు కలిసొచ్చింది. వైద్య రంగంలో ఉంటూనే దయానంద్ చేసే సేవా కార్యక్రమాల్లో ఆమె పాలు పంచుకోవడం, ప్రజల్లోనూ సానుభూతి, జనం కూడా మార్పు కోరడం వంటి అంశాలతోపాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిల అండదండలు కూడా అమె విజయానికి సోపానాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ గళం.. ప్రచార దళం
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికలు ప్రధాన పార్టీల ముఖ్యనేతలకు సవాల్గా మారాయి. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధిస్తూనే ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. -
అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు
[ 28-04-2024]
రూ.2 లక్షల చొప్పున రైతుల రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా ఇప్పట్లో రైతు రుణమాఫీ కాదని చాలామంది భావించారు. -
కనుమరుగైన హెలికాప్టర్ నియోజకవర్గం
[ 28-04-2024]
భద్రాచలం లోక్సభ స్థానానికి హెలికాప్టర్ నియోజకవర్గంగా పేరుండేది. ఈ స్థానంలో వచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. దేశ ప్రధానులు సైతం ఇక్కడి ఎంపీలను పేరు పెట్టి పిలిచేవారంటే అది నాయకుల గొప్పతనంతో పాటు ఈస్థానానికి ఉన్న ప్రత్యేకతను చాటుతుంది. -
21 మంది ధరావతు కోల్పోయారు..!
[ 28-04-2024]
2019 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానంలో 21మంది అభ్యర్థులు ధరావతు కోల్పోయారు. వీరిలో జాతీయ పార్టీలైన సీపీఎం, భాజపా అభ్యర్థులుండటం విశేషం. జనసేన అభ్యర్థి కూడా ధరావతు కోల్పోయారు. -
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన: మంత్రులు
[ 28-04-2024]
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన అందుతుందని.. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
కానిస్టేబుల్ను సత్కరించిన డీజీపీ
[ 28-04-2024]
దమ్మపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగముత్యాన్ని డీజీపీ రవిగుప్తా శనివారం సత్కరించారు. ఈ ఏడాది మేడారం మహాజాతరలో విధులు నిర్వహించిన సమయంలో నాగముత్యం గుండెపోటుకు గురైన ముగ్గురు వ్యక్తులకు సీపీఆర్ నిర్వహించి కాపాడారు. -
రూ.63 లక్షల నగదు సీజ్
[ 28-04-2024]
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటగిరిక్రాస్రోడ్డులో ఏర్పాటుచేసిన చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి, శనివారం చేపట్టిన తనిఖీల్లో రూ.63 లక్షల నగదు, 275 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కేసీఆర్ కష్టంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: భారాస
[ 28-04-2024]
సుదీర్ఘ కాలంపాటు పోరాటం చేసి తన కష్టంతోనే ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు సమర్థంగా నిర్వర్తించాలి
[ 28-04-2024]
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ లోక్సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఖమ్మం లోక్సభ స్థానం సాధారణ పరిశీలకుడు సంజయ్ జి.కోల్టే అన్నారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 28-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శనివారం భక్తులు విశేష సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు. రామయ్యకు సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ఘోర పరాభవం.. సొంతగడ్డపై అదరగొట్టిన చెన్నై
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం