ఆ ఇద్దరు దోచేస్తున్నారు..!
‘దేశీ శిక్షణలో భాగంగా అధికారులకు రూ.10వేలు చెల్లించి తరగతులకు హాజరయ్యాను. ఒక్కరోజు గైర్హాజరైతే రూ.3వేలు వసూలు చేశారు.
‘దేశీ శిక్షణలో భాగంగా అధికారులకు రూ.10వేలు చెల్లించి తరగతులకు హాజరయ్యాను. ఒక్కరోజు గైర్హాజరైతే రూ.3వేలు వసూలు చేశారు. పరీక్షల సమయంలో హైదరాబాద్, దిల్లీలో కొంతమందికి ఇవ్వాల్సి ఉంటుందని రూ.10వేల నుంచి రూ.15వేలు దండుకున్నారు. శిక్షణ కాలంలో ప్రతి దానికీ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. అడిగినంత ఇవ్వకపోతే డీలర్షిప్ లైసెన్స్ జారీలో ఇబ్బందులకు గురిచేస్తారు. రూ.10వేలతో పూర్తవుతుందనుకున్న శిక్షణకు రూ.లక్ష వెచ్చించాను’ అని భద్రాద్రి జిల్లాకు చెందిన ఓ డీలర్ ఆవేదన వెలిబుచ్చారు.
వివిధ పంటల సాగులో ఎలాంటి ఎరువులు వాడాలి..? ఏ సమయంలో వేటిని ఉపయోగించాలి..? నకిలీ విత్తనాలను గుర్తించటం ఎలా..? తదితర అంశాలపై ఎరువుల డీలర్లకు అవగాహన కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘దేశీ శిక్షణ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. సంబంధిత అధికారుల ధనదాహంతో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం పక్కదారి పడుతోంది.
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం
డీలర్ల బలహీనతలను ఆసరా చేసుకొని..
దేశీ శిక్షణ నిమిత్తం భద్రాద్రి జిల్లాలోని వ్యవసాయ శాఖకు చెందిన అధికారితో పాటు ఓ ఫెసిలిటేటర్.. డీలర్ల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. శిక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10వేలు, సంబంధిత డీలర్ రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. వీటితో ఏడాది కాలంలో 48 వారాలు తరగతి గది శిక్షణ, నాలుగు వారాలు క్షేత్రస్థాయి పరిశీలకు తీసుకెళ్లాలి. అనంతరం పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రం అందించాలి. శిక్షణ కాలంలో డీలర్ల బలహీనతలను ఆసరాగా చేసుకుని అధికారి, ఓ ఫెసిలిటేటర్ రూ.లక్షల్లో దండుకుంటున్నారనే పలువురు ఆందోళన చెందుతున్నారు.
ఎంపిక బాధ్యత సైతం వారిదే..
ఎరువుల డీలర్లను బ్యాచ్గా విభజించి దేశీ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించటం ఆనవాయితీ. ఏడాదిలో రెండు, మూడు బ్యాచ్లకు తర్ఫీదునిస్తారు. ప్రతి బ్యాచ్లో 40 మంది డీలర్లను సంబంధిత మండల వ్యవసాయ అధికారులు ఎంపిక చేయాలి. అయితే ఎంపిక బాధ్యతను సైతం వ్యవసాయశాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారి, ఓ ఫెసిలిటేటర్ నిర్వర్తిస్తున్నారని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ డీలర్లనే ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలో 483 మంది ఎరువుల డీలర్లు ఉంటే సుమారు 280 మందికి శిక్షణ పూర్తైనట్లు సమాచారం.
పాఠాలు చెప్పేవారితోనే కుమ్మక్కై..
శిక్షణ కాలంలో పాఠాలు చెప్పాల్సిన ఓ ఫెసిలిటేటర్తో వ్యవసాయశాఖకు చెందిన అధికారి కుమ్మక్కై ఈ దందాకు పాల్పడుతున్నారని డీలర్లు వాపోతున్నారు. డీలర్ చెల్లించే రూ.10వేలతోనే శిక్షణ, క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాల్సి ఉంటుంది. నాసిరకమైన భోజనం పెడుతున్నారని, కొన్ని సందర్భాల్లో అసలు భోజనమే పెట్టడం లేదని డీలర్లు చెబుతున్నారు. హాజరుశాతం సరిగ్గా లేదని, పరీక్షల సమయంలో ఉన్నతాధికారులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి డీలర్ల ముక్కు పిండి వసూలు చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.
దేశీ శిక్షణలో డీలర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం నాదృష్టికి రాలేదు. విచారణ జరిపిస్తాం. అవినీతికి పాల్పడే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
బాబూరావు, డీఏఓ, భద్రాద్రి కొత్తగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరికలు
[ 26-04-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి భారాసలో చేరిన కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు భానోత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!