ఎండల గండాలకు జాగ్రత్తలే గొడుగు
మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది.
నిర్మానుష్యంగా మారిన సత్తుపల్లి రింగ్ సెంటర్
సత్తుపల్లి, కల్లూరు, న్యూస్టుడే: మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది. సింగరేణి గనులున్న సత్తుపల్లిలో ప్రస్తుతం గరిష్టంగా 39, కనిష్ఠంగా 24 డిగ్రీల సెల్సియస్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. త్వరలోనే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటే పరిస్థితులు కన్పిస్తున్నాయి. దీంతో ఉదయం 10గంటల తర్వాత ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని కలవర పడుతున్నారు. కొందరు ఏసీలు, కూలర్లు కొనుగోలు చేసే పనిలో ఉన్నారు. మరి కొందరు మట్టికుండలు, ఇతర ఉపశమన చర్యలు ఏర్పాటు చేసుకుంటున్నారు. భానుడి తీవ్రతకు పండ్ల రసాలు, శీతలపానీయాల వినియోగం పెరిగింది. అధిక ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం సమయాల్లో పట్టణాల్లో జనసంచారం లేక రోడ్లు, అంతర్గత వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వడదెబ్బకు గురయ్యారు.
వైద్యనిపుణుల సూచనలివే..
ఎండల గండం నుంచి గట్టెక్కేందుకు వైద్యనిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ తమ శరీరాలను డీహైడ్రేషన్కు గురవకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. బయటకు వెళ్లాల్సివస్తే గొడుగు, తెల్లని టోపీ, వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలి. ఎప్పటికప్పుడు మంచి నీళ్లు, కొబ్బరి నీరు, మజ్జిగ తీసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు తినాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య బాధితులు నీడ పట్టున ఉండటమే మేలు. వడదెబ్బ లక్షణాలైన జ్వరం రావడం, వాంతులు, విరేచనాలు, అపస్మారక స్థితిలోకి వెళ్లడం వంటివి కన్పిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దూర ప్రాంత ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదాలు వేసుకోవడమే మంచిది. ఉదయం 11గంటల్లోపు, సాయంత్రం 4గంటల తర్వాతే ప్రయాణాలు చేయాలి. వేపుళ్లు, బయట చిరుతిళ్లకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. వడగాల్పుల సమయంలో ముక్కు, చెవుల్లోకి వేడిగాలి చొరబడకుండా తువాళ్లను చుట్టుకోవాలి.
శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి
శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ కలిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. ఫ్లూయిడ్స్నూ తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. ఆసుపత్రిలోనూ అవసరమైన అన్ని మందులు, ఓఆర్ఎస్లు అందుబాటులో ఉన్నాయి.
డా.కిరణ్, సత్తుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం
వడదెబ్బకు లోనైతే జాగ్రత్తపడాలి
వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడకు చేర్చాలి. తడిగుడ్డతో ఒళ్లంతా తుడిచి మజ్జిగలో ఉప్పుకలిపి తాగించాలి. తీవ్రత ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. వేసవిలో రోజుకు 15 గ్లాసుల నీళ్లు తాగాలి. ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. మరిన్ని జాగ్రత్తలకోసం సమీప ఆశా, ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలి.
డా.నవ్యకాంత్, కల్లూరు సీహెచ్సీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ గళం.. ప్రచార దళం
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికలు ప్రధాన పార్టీల ముఖ్యనేతలకు సవాల్గా మారాయి. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధిస్తూనే ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. -
అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు
[ 28-04-2024]
రూ.2 లక్షల చొప్పున రైతుల రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా ఇప్పట్లో రైతు రుణమాఫీ కాదని చాలామంది భావించారు. -
కనుమరుగైన హెలికాప్టర్ నియోజకవర్గం
[ 28-04-2024]
భద్రాచలం లోక్సభ స్థానానికి హెలికాప్టర్ నియోజకవర్గంగా పేరుండేది. ఈ స్థానంలో వచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. దేశ ప్రధానులు సైతం ఇక్కడి ఎంపీలను పేరు పెట్టి పిలిచేవారంటే అది నాయకుల గొప్పతనంతో పాటు ఈస్థానానికి ఉన్న ప్రత్యేకతను చాటుతుంది. -
21 మంది ధరావతు కోల్పోయారు..!
[ 28-04-2024]
2019 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానంలో 21మంది అభ్యర్థులు ధరావతు కోల్పోయారు. వీరిలో జాతీయ పార్టీలైన సీపీఎం, భాజపా అభ్యర్థులుండటం విశేషం. జనసేన అభ్యర్థి కూడా ధరావతు కోల్పోయారు. -
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన: మంత్రులు
[ 28-04-2024]
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన అందుతుందని.. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
కానిస్టేబుల్ను సత్కరించిన డీజీపీ
[ 28-04-2024]
దమ్మపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగముత్యాన్ని డీజీపీ రవిగుప్తా శనివారం సత్కరించారు. ఈ ఏడాది మేడారం మహాజాతరలో విధులు నిర్వహించిన సమయంలో నాగముత్యం గుండెపోటుకు గురైన ముగ్గురు వ్యక్తులకు సీపీఆర్ నిర్వహించి కాపాడారు. -
రూ.63 లక్షల నగదు సీజ్
[ 28-04-2024]
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటగిరిక్రాస్రోడ్డులో ఏర్పాటుచేసిన చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి, శనివారం చేపట్టిన తనిఖీల్లో రూ.63 లక్షల నగదు, 275 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కేసీఆర్ కష్టంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: భారాస
[ 28-04-2024]
సుదీర్ఘ కాలంపాటు పోరాటం చేసి తన కష్టంతోనే ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు సమర్థంగా నిర్వర్తించాలి
[ 28-04-2024]
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ లోక్సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఖమ్మం లోక్సభ స్థానం సాధారణ పరిశీలకుడు సంజయ్ జి.కోల్టే అన్నారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 28-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శనివారం భక్తులు విశేష సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు. రామయ్యకు సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్