ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ టికెట్.. తేల్చుడా? నాన్చుడా..?
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆశావహులపై పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవటం, రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతోంది.
ఈటీవీ- ఖమ్మం: ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆశావహులపై పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవటం, రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు ఆదివారం రానున్నారని, అభ్యర్థి ఎంపికపై కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.
కొలిక్కిరాని కసరత్తు..
రాష్ట్రంలో మూడు స్థానాలకు మినహా మిగిలిన 14 చోట్ల అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఆయా చోట్ల అభ్యర్థులు, ముఖ్యనేతలు, కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను హస్తం పార్టీ ప్రకటించాల్సి ఉంది. సుమారు నెలన్నరకు పైగా చేస్తున్న కసరత్తు కొలిక్కి రావటం లేదు. ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్యనేతలు తమతమ కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతుండటంతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది. ఒకవేళ తాము సూచించిన వారికి సీటు ఇవ్వటం కుదరకపోతే.. ఇంకో నేత కుటుంబీకులు, బంధువులకూ ఇవ్వొద్దంటూ షరతులు విధిస్తున్నట్లు సమాచారం.
తెరపైకి రోజుకో పేరు..
ఖమ్మం లోక్సభ అభ్యర్థిత్వం కోసం దాదాపు అర డజను మంది దరఖాస్తు చేశారు. స్క్రీనింగ్ కమిటీలో వడపోత తర్వాత ముగ్గురు, నలుగురు పేర్లతో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా చేరింది. అధినాయకత్వం పలుమార్లు చర్చించినా అభ్యర్థిని తేల్చలేదు. మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్రెడ్డి, తుమ్మల యుగంధర్, వీవీసీ ట్రస్ట్ అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. సీనియర్ నేతలు వీహెచ్, కుసుమకుమార్ తమకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. తాజాగా రోజుకో పేరు తెరపైకి వస్తుండటం గమనార్హం. సీనియర్ నేతలు మండవ వెంకటేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ కోటాలో తమకు టికెట్ ఇవ్వాలంటూ నాగ సీతారాములు, లోకేశ్యాదవ్ పట్టుబడుతున్నారు. కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ పర్యటనతో అభ్యర్థి ప్రకటన ఉంటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస హయాంలోనే సమగ్రాభివృద్ధి
[ 30-04-2024]
కాంగ్రెస్, భాజపాకు ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనని.. గులాబీ జెండా ఒక్కటే ప్రజలకు అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
గిరిజనులకు అండ.. కాషాయ జెండా
[ 30-04-2024]
కాషాయ జెండా గిరిజనులకు అండగా నిలుస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం మైదానంలో సోమవారం నిర్వహించిన భాజపా జన సభలో ఆయన ప్రసంగించారు. -
స్వయం ప్రేరణతో పోలింగ్ మెరుగు
[ 30-04-2024]
తాజా లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో రెండు దశల పోలింగ్ ముగిసింది. చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో మునుపటి (2019) ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. -
త్రిముఖ వ్యూహం.. గెలుపే లక్ష్యం
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో పాగా వేయటమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, నియోజకవర్గాల వారీగా నాయకుల ప్రచారం కలిసొస్తుందని అంచనా వేస్తోంది. -
కాంగ్రెస్లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు
[ 30-04-2024]
ఖమ్మం నగరంలోని 38, 56వ డివిజన్ల భారాస కార్పొరేటర్లు ఆలియా, పైడిపల్లి రోహిణి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్లో సోమవారం చేరారు. -
అత్యధిక మెజార్టీ నామాదే!
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన నామా నాగేశ్వరరావు 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం. -
కేంద్ర మంత్రి.. రెండుచోట్ల ఓటమి!
[ 30-04-2024]
టెలికమ్యూనికేషన్ల శాఖ కేంద్ర మంత్రిగా పని చేసిన పీవీ రంగయ్య నాయుడు 1996 ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
లోక్సభ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో మిగిలిన 35 మంది అభ్యర్థులకు బ్యాలెట్ పత్రంలో వరుస క్రమం, ఎన్నికల గుర్తులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌతమ్ కేటాయించారు. -
32 కిలోల గంజాయి స్వాధీనం
[ 30-04-2024]
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులను ఖమ్మం ఒకటో పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి మృతి
[ 30-04-2024]
అశ్వాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి సలిగంజి వెంకటేశ్వరరావు(54) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. -
ఖమ్మం బరిలో 35.. మహబూబాబాద్లో 23 మంది
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 35 మంది, మహబూబాబాద్ స్థానంలో 23 మంది బరిలో నిలిచారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా చోట్ల వరుసగా ఆరుగురు, ఇద్దరు అభ్యర్థులు తమ నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. -
ముత్తంగి రూపంలో రాములోరి దర్శనం
[ 30-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సోమవారం ముత్తంగి రూపంలో దర్శనమిచ్చారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతుడైన రామయ్యతండ్రి చూడముచ్చటగా కనిపించి మురిపించాడు.