హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: సత్యవతి రాథోడ్
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వంద రోజుల్లో కేవలం మహిళలకు ఉచిత ప్రయాణం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.
మాట్లాడుతున్న మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, పక్కన ఎంపీ మాలోతు కవిత, హరిప్రియ, దిండిగాల తదితరులు
ఇల్లెందు, న్యూస్టుడే: శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వంద రోజుల్లో కేవలం మహిళలకు ఉచిత ప్రయాణం మినహా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. ఇల్లెందు నియోజకవర్గ భారాస ప్రజాప్రతినిధులు, నాయకులతో మంగళవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతులపై సీఎం, మంత్రులకు చిత్తశుద్ధి లేదని, పొలాలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. స్వార్థం కోసం పార్టీలు మారేవారి తీరు ఎక్కడా ఉన్నా మారదన్నారు. పలుమార్లు ఓటమి చెందిన బలరాంనాయక్ వంటి చెల్లని నోటు ఇప్పుడెలా చెల్లుతుందని ఎద్దేవా చేశారు. రాజకీయ కుట్రల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్టు చేయించిందని, త్వరలో ఆమె నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. ఎంపీగా వందసార్లు మాలోత్ కవిత ఇల్లెందుకు వచ్చి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారని పేర్కొన్నారు. మరోసారి ఆమెను గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ తప్పిదంతోనే..: రైతు బీమా పథకం అమలుకాకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి మాలోతు కవిత అన్నారు. ఎల్ఐసీ వారికి బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో బీమా అమలుకావట్లేదని, కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో భారాస గెలిచే మొదట స్థానం ఇదేనన్నారు. సమావేశంలో ఎన్నికల నియోజకవర్గ ఇన్ఛార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, జడ్పీ ఛైర్మన్ ఆంగోతు బిందు, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, నాయకులు పి.వెంకటేశ్వరరావు, సిలివేరు సత్యనారాయణ, శీలం రమేష్, ఆజాం, కృష్ణప్రసాద్, బాలు, పీవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస హయాంలోనే సమగ్రాభివృద్ధి
[ 30-04-2024]
కాంగ్రెస్, భాజపాకు ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనని.. గులాబీ జెండా ఒక్కటే ప్రజలకు అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
గిరిజనులకు అండ.. కాషాయ జెండా
[ 30-04-2024]
కాషాయ జెండా గిరిజనులకు అండగా నిలుస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం మైదానంలో సోమవారం నిర్వహించిన భాజపా జన సభలో ఆయన ప్రసంగించారు. -
స్వయం ప్రేరణతో పోలింగ్ మెరుగు
[ 30-04-2024]
తాజా లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో రెండు దశల పోలింగ్ ముగిసింది. చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో మునుపటి (2019) ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. -
త్రిముఖ వ్యూహం.. గెలుపే లక్ష్యం
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో పాగా వేయటమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, నియోజకవర్గాల వారీగా నాయకుల ప్రచారం కలిసొస్తుందని అంచనా వేస్తోంది. -
కాంగ్రెస్లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు
[ 30-04-2024]
ఖమ్మం నగరంలోని 38, 56వ డివిజన్ల భారాస కార్పొరేటర్లు ఆలియా, పైడిపల్లి రోహిణి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్లో సోమవారం చేరారు. -
అత్యధిక మెజార్టీ నామాదే!
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన నామా నాగేశ్వరరావు 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం. -
కేంద్ర మంత్రి.. రెండుచోట్ల ఓటమి!
[ 30-04-2024]
టెలికమ్యూనికేషన్ల శాఖ కేంద్ర మంత్రిగా పని చేసిన పీవీ రంగయ్య నాయుడు 1996 ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
లోక్సభ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో మిగిలిన 35 మంది అభ్యర్థులకు బ్యాలెట్ పత్రంలో వరుస క్రమం, ఎన్నికల గుర్తులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌతమ్ కేటాయించారు. -
32 కిలోల గంజాయి స్వాధీనం
[ 30-04-2024]
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులను ఖమ్మం ఒకటో పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి మృతి
[ 30-04-2024]
అశ్వాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి సలిగంజి వెంకటేశ్వరరావు(54) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. -
ఖమ్మం బరిలో 35.. మహబూబాబాద్లో 23 మంది
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 35 మంది, మహబూబాబాద్ స్థానంలో 23 మంది బరిలో నిలిచారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా చోట్ల వరుసగా ఆరుగురు, ఇద్దరు అభ్యర్థులు తమ నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. -
ముత్తంగి రూపంలో రాములోరి దర్శనం
[ 30-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సోమవారం ముత్తంగి రూపంలో దర్శనమిచ్చారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతుడైన రామయ్యతండ్రి చూడముచ్చటగా కనిపించి మురిపించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు