18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం.
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. ఈ క్రతువులో పోలింగ్ యంత్రాంగం, వివిధ భాగస్వాములు, స్థానిక ప్రముఖుల సహకారంతో యువ ఓటర్ల చైతన్యం, తద్వారా పోలింగ్ పెంపునకు ఎన్నికల సంఘం కృషిచేస్తోంది. సిబ్బంది విధులను గౌరవిస్తూ, వారి పాత్రను తెలియజేస్తూ ‘యు ఆర్ ది ఒన్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగా ఓటుహక్కు పొందిన వారు, 18-30 ఓటర్ల సమూహమే లక్ష్యంగా ఎన్నికల అధికారులు ప్రచార, భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
- పాల్వంచ, న్యూస్టుడే
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పౌరుల్ని ఈ ప్రక్రియలో నిమగ్నం చేసేలా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు వేదికగా ‘టర్నింగ్ 18’ అనే ప్రత్యేక ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల వివరాలు, ఓటు చైతన్యంతో కూడిన సందేశాలను రూపొందించి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్, లింక్డ్ ఇన్ ఇతర పబ్లిక్ యాప్లలో పోస్టు చేస్తున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంలో ఎంత ప్రచారం సాగిస్తున్నా పట్టణ యువతరం పోలింగ్ కేంద్రాలకు రాకుండా ఉదాసీనత ప్రదర్శిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో ఓటింగ్కు దూరంగా ఉంటున్న వారిలో 30 ఏళ్ల లోపువారే అధికంగా ఉంటున్నారని గత ఎన్నికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 18వ లోక్సభ ఎన్నికల్లో పద్దెనిమిదేళ్లు, ఆపై వయస్కులు ఓటేసి కీలకంగా మారాలని ప్రచారం చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ‘స్వీప్’ మాస్టర్ ట్రైనర్ సాయికృష్ణ పేర్కొన్నారు. యువత పోలింగ్పై ఉదాసీనత ప్రదర్శించడానికి గల కారణాలను గుర్తించి, సమస్యలకు పరిష్కారం చూపేలా జిల్లాస్థాయి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. లక్షిత సమూహం దృష్టిని ఆకట్టుకునేలా ఓటరు అంబాసిడర్ల సందేశ వీడియోలతో ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 18 ఏళ్ల వరకు వయసున్న వారిలో స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న వారు 75.4 శాతం మంది ఉన్నారు. వీరిలో 88.9 శాతం మంది సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది.
ముఖ్యంగా 18-30 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళా ఓటర్ల ఓటు భాగస్వామ్యాన్ని పెంచేలా ‘సమాచార సహిత చిత్రావళి’(ఇన్ఫోగ్రాఫిక్స్)తో ప్రచారం, ప్రదర్శనకు సిద్ధమవుతున్నట్లు భద్రాద్రి జిల్లా స్వీప్ నోడల్ అధికారి, అదనపు కలెక్టర్ విద్యాచందన పేర్కొన్నారు. దీనికి తోడుగా, మునుపటి ఎన్నికల ఆసక్తికర అంశాలను నేటి తరం ఓటర్లతో పంచుకునేలా ఎన్నికల కథల(చునావి కిస్సే)నూ అందుబాటులోకి తేవడం మరో విశేషం. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే యువత దృష్టిని ఎన్నికలపై మరల్చే ‘పదకేళీ’లను ఎన్నికల సంఘం స్థానిక భాషల్లో సృష్టించింది.
యంత్రాంగం బాధ్యతను గుర్తుచేస్తూ..
ఎంతటి బృహత్తర కార్యక్రమైనా అధికార యంత్రాంగం సమష్టి కృషి లేనిదే విజయం కావడం సాధ్యమని ఎన్నికల సంఘం భావిస్తోంది. ‘టర్నింగ్ 18’ వంటి కార్యక్రమం విజయవంతానికి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అందరు భాగస్వాముల అమూల్య పాత్రను గుర్తించడం, అభినందించడం, విధుల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘యు ఆర్ ది ఒన్’ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. ‘ఏదేమైనా సరే, అదనపు బాధ్యత మాదే. కాబట్టి మీరు (ఓటర్లు) శ్రమించనక్కర్లేదు’ అనే ఇతివృత్తంతో పలు కథలు, దృశ్యాలతో వినూత్న ప్రచారం సాగిస్తున్నారు. శిక్షణలు, సమావేశాల్లో వీటిని ప్రదర్శిస్తున్నట్లు జిల్లాస్థాయి ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు.
పాల్వంచ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ‘టర్నింగ్-18’ కార్యక్రమంలో భాగంగా ఇటీవల కళాశాలలో విద్యార్థులకు ఓటు ప్రాధాన్యాన్ని వివరించారు. లోక్సభ ఎన్నికల్లో పక్కాగా ఓటేయాలని స్నేహితులు అందరం నిర్ణయించుకున్నాం. ప్రలోభాలకు తలొగ్గకుండా, కుల,మతాలు చూడకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి నచ్చిన అభ్యర్థికి ఓటేస్తా.
- ఆకునూరి వివేకవర్ధన్, డిగ్రీ ద్వితీయ సంవత్సరం, పాల్వంచ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదిలోనూ బాలికలదే హవా
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా గతంకంటే కాస్త మెరుగైన స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ ఫలితాల మాదిరిగానే ఈ పరీక్షల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 12,294 మంది పరీక్షలు రాశారు. -
వార్షిక మరమ్మతుల ప్రణాళికపై సమీక్ష
[ 01-05-2024]
పాల్వంచ కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాన్ని జెన్కో డైరెక్టర్ బి.లక్ష్మయ్య మంగళవారం సందర్శించారు. కేటీపీఎస్లోని బాయిలర్, యాష్ ప్లాంట్, యూసీబీ, కోల్ మిల్, టర్బైన్ తదితర విభాగాలను పరిశీలించి.. అక్కడి వివరాలు ఏరియా ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. -
పది ఫలితాల్లో వెనుకంజ
[ 01-05-2024]
పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఖమ్మం జిల్లా గతేడాదితో పోల్చిచూస్తే వెనుకంజ వేసింది. 92.24 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. గతేడాది 88.72 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానం దక్కించుకోగా.. ఈ ఏడాది మూడు అడుగులు కిందకు దిగజారింది. -
ఖమ్మం కాంగ్రెస్కు కంచుకోట: భట్టి
[ 01-05-2024]
కాంగ్రెస్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట లాంటిదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ డీసీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
దేశంలో భాజపా గెలిచే అవకాశం లేదు: కూనంనేని
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా గెలిచే ప్రసక్తి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేశంలో జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 192 లోక్సభ స్థానాల్లో మెజార్టీ ఓటర్లు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని తెలిపారు. -
పదిలో మెరిశారు
[ 01-05-2024]
పదోతరగతి ఫలితాల్లో ఉభయ జిల్లాల్లోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. అనేక మంది 10 జీపీఏ సాధించారు. -
తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ: తుమ్మల
[ 01-05-2024]
తల తాకట్టు పెట్టయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖామంతి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. -
సంక్షేమం పేరుతో అప్పులమయం
[ 01-05-2024]
పదేళ్లు పాలించిన భారాస అధినేత కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధి పేరుతో తెలంగాణను అప్పులపాలు చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
నయనానందకరంగా సీతారామ కల్యాణం
[ 01-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చన సాగింది. సింధూర తిలకాన్ని నుదట ధరించిన భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి హనుమాన్ చాలీసాను పఠించారు. -
సింగరేణిలో 92 శాతం బొగ్గు ఉత్పత్తి
[ 01-05-2024]
ప్రస్తుత వార్షిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా జరిగింది. మొత్తం సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనులు 92 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాయి.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!