కోల్ ప్లాంట్ కింగ్
కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు.
ఓ విభాగాధిపతి వేధింపులు, అవకతవకలపై కేటీపీఎస్ ఉద్యోగుల ఆవేదన
పాల్వంచ, న్యూస్టుడే: కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. విధుల్లో తమపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఉన్నతాధికారులకు ఇటీవల ఓ ఫిర్యాదు సైతం అందింది. ఈ విషయాన్ని పలు సంఘాల నాయకులూ తీవ్రంగా పరిగణిస్తున్నారు. కోల్ ప్లాంట్లో ఆర్టిజన్ స్థాయి నుంచి సూపరింటెండెంట్ ఇంజినీర్ వరకు సుమారు వెయ్యి మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 5, 6వ దశ కర్మాగారాల్లో విద్యుదుత్పత్తికి ప్రధానంగా కావాల్సిన బొగ్గు ఇక్కడ్నుంచే అందుతుంది. పలు స్థాయుల్లో డివిజన్లోని ఎస్ఈ, నలుగురు డీఈలు, ఏడీఈ, ఏఈ, ఏఈఈ, ఇతర ఉద్యోగులు ప్రధానపాత్ర పోషిస్తారు. ఎలక్ట్రికల్, మెకానికల్, ఆపరేషన్, ఫ్యూయల్ నిర్వహణ విభాగాల డీఈలపై ఎస్ఈ, సీఈ స్థాయి ఉన్నతాధికారి నియంత్రణ ఉంటుంది. కానీ, ఆ అధికారుల తర్వాతి స్థానంలో ఉండే డీఈ స్థాయి అధికారి చెప్పిందే శాసనమని, లేదంటే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఇటీవల పలువురు ఉద్యోగులు ఆరోపించారు. పైస్థాయి అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఇదేమిటని నిలదీసే ఇంజినీర్లను అదును చూసి బదిలీ చేయడమో, విభాగాలు మార్చడమే చేస్తున్నారని సమాచారం. ప్లాంట్లో ఏదైనా ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. కార్యాలయ పనివేళలు, క్షేత్రస్థాయి తనిఖీలు పట్టించుకోరు. స్మార్ట్ఫోన్ గంటల పాటు వాడతారనే విమర్శలున్నాయి. విద్యుత్తు కర్మాగారాల్లో, ముఖ్యంగా పనిప్రదేశాల్లో ధూమపానం నిషేధం. ఈ నిబంధనను ఆయన అస్సలు పట్టించుకోరు.
కీలక విభాగం.. రూ.కోట్లల్లో కొనుగోళ్లు!
కోల్ప్లాంట్లో తాను పనిచేసే ముఖ్య విభాగానికి ఏది కావాలన్నా సదరు డీఈనే సిఫార్సు చేస్తుంటారు. రూ.కోట్ల విలువైన సామగ్రి కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కొన్నేళ్లుగా తనకు అనుకూలమైన ఏజెన్సీల వద్దే సామగ్రి కొనుగోలు చేసేలా చూడటం ద్వారా పర్సంటేజీలు తీసుకుంటున్నట్లు కొందరు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పైఅధికారి ప్రవర్తన, ఆరోపణల నిగ్గుతేల్చాలని కర్మాగారం చీఫ్ ఇంజినీర్, సీఎండీ, ఉద్యోగ సంఘాలకు ఓ ఉద్యోగి ఆన్లైన్లో లేఖ పంపారు. స్థానిక ఎమ్మెల్యే సైతం ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశముంది.
ఒకేచోట.. ఏళ్లుగా పాతుకుపోయి!
సదరు డీఈది ఎలక్ట్రికల్ విభాగం. కానీ కొన్నేళ్లుగా వేరే విభాగం అగ్రస్థానంలో పనిచేస్తున్నారు. అక్కడి విభాగంలో అర్హులైన వేరే డీఈలున్నప్పటికీ ఆయన స్థానం కొన్నేళ్లుగా పదిలంగా ఉండటం ఆశ్చర్యకరం. ఏడీఈ నుంచి పదోన్నతులు పొందుతూ డీఈ స్థాయికి చేరిన ఆ అధికారి, ఒకే పని ప్రదేశంలో సుమారు రెండు దశాబ్దాలుగా బదిలీల్లేకుండా కొనసాగుతుండటం గమనార్హం. ఈయన కారణంగా అర్హులైన అధికారులకు అన్యాయం జరుగుతోందన్న వాదన వ్యక్తమవుతోంది. చెప్పింది వినకుంటే ఎక్కడ బదిలీల చేయిస్తాడోనని కిందిస్థాయి ఉద్యోగులు కిమ్మనకుండా ఉంటున్నారు.
కోల్ప్లాంట్లో ఓ అధికారిపై వస్తున్న ఆరోపణలపై దృష్టిసారిస్తా. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తా. ఎవరైనా ఉద్యోగులు ఇబ్బంది పడితే నా దృష్టికి తీసుకురావచ్చు. కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని వెంటనే పరిశీలిస్తున్నాం. విధుల్లో ఏ స్థాయి అధికారి అనుచితంగా ప్రవర్తించినా, ఎదుర్కొనే ఆరోపణలు నిజమని తేలినా చర్యలు తప్పవు.
మేక ప్రభాకర్రావు, చీఫ్ ఇంజినీర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా కార్యకర్తలూ శక్తిమంతులే..
[ 05-05-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలు ఊపిరి పోశాయని పేర్కొన్నారు. -
ఆకలి చావులు లేకుండా చేసిన ఘనత ఎన్టీఆర్దే: నామా
[ 05-05-2024]
నాడు కాంగ్రెస్ పాలనలో ఆకలి చావులు ఉండేవని, వాటిని అరికట్టేందుకు అన్న ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాతోనే సుస్థిర పాలన: తాండ్ర
[ 05-05-2024]
భాజపాతోనే సుస్థిర పాలన సాధ్యమని ఖమ్మం లోక్సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. సత్తుపల్లి, మధిరలో శనివారం నిర్వహించిన వేర్వేరు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. -
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్
[ 05-05-2024]
ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకుడు సంజయ్ జి.కోల్టేతో కలిసి కలెక్టరేట్లో ఆన్లైన్లో ఈ ప్రక్రియను శనివారం నిర్వహించారు. -
ఉపాధి కూలీలకు భానుడి సెగ
[ 05-05-2024]
భానుడి భగభగతో ఉపాధి హామీ పథకం కూలీలు పని ప్రదేశాల్లో అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. పనిచేసే చోట ఎలాంటి నీడ, కనీస వసతులు లేక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేకపోతున్నారు. -
మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
[ 05-05-2024]
రబీ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అధికారులు హడావుడి చేసి 236 కొనుగోలు కేంద్రాలు తెరచి నెల రోజులు దాటిపోయింది. ఇందులో కేవలం 70 కొనుగోలు కేంద్రాల్లో 8,760 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. -
గెలిచే వరకు.. ఆపకు పరుగు
[ 05-05-2024]
‘జీవితమంతా ఉరుకులు పరుగులు’ అన్నది నానుడి. మాట వరుసకు కాకుండా నిజంగా ఓ లక్ష్యం కోసం పరుగునే ఆయుధంగా మలుచుకున్న వారి శ్రమ వృథా కాలేదు. -
దోస్త్కు వేళాయె..!
[ 05-05-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నప్పటికీ చాలామంది డిగ్రీ కోర్సులనే ప్రధానంగా ఎంపిక చేసుకుంటారు. -
మండుటెండల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు..!
[ 05-05-2024]
ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా 44 నుంచి 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
1,105 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు: కలెక్టర్
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల కోసం జిల్లాలో 1,105 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!