మామిడి మిగిల్చిన నష్టం
మామిడి పంట సాగు చేస్తున్న రైతులు గత కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తగ్గిన దిగుబడులు, గిట్టుబాటు ధర ఆశాజనకంగా లేకపోవడం వంటి కారణాలతో సాగుపై అయిష్టత చూపుతున్నారు. పెట్టుబడులు
ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి
2 వేల హెక్టార్లలో చెట్ల నరికివేత
మామిడి చెట్టును యంత్రంతో కోస్తున్న కూలీ
తగ్గుతున్న విస్తీర్ణం
మెట్టప్రాంతమైన పశ్చిమకృష్ణా పరిధిలోని నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మామిడి పంట సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.55 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు, చీడపీడల ఉద్ధృతి, మంగు సమస్య వంటివి దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి.. మార్కెట్ ధరల హెచ్చుతగ్గుదల వల్ల ఆశించిన ధర లభించడం లేదు. గడిచిన పదేళ్లలో సుమారు 28 వేల ఎకరాల్లో చెట్లను తొలగించగా, గత మూడేళ్లలోనే 4 వేల ఎకరాల్లో తోటలను నరికించారు. రెండు దశాబ్దాలకు పైగా వయసు కలిగిన చెట్లను గుత్తగా విక్రయిస్తున్నారు. కొమ్మలను వంట చెరకు, పేపర్ పరిశ్రమలు, మొద్దులను చెక్క తయారీకి తరలిస్తున్నారు. తొలగించిన తోటల్లో జామ, నిమ్మ, సుబాబుల్, పామాయిల్, మెట్ట, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు.
గిట్టుబాటు ధర లేకనే
ఏటా సీజన్ ప్రారంభంలో టన్ను బంగినపల్లి రూ.60 వేలు, తోతాపురి రూ.50 వేల వరకు ధర పలికి, కోతలు ఊపందుకోగానే అమాంతం ధర పతనమవుతోంది. వ్యాపారులు, దళారులు తమ ఇష్టానుసారంగా ధర నిర్ణయిస్తున్నారు. ఈ ఏడాది కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన తరువాత టన్ను రూ.30 వేలకు పడిపోగా, చివరికి రూ.15 వేలకు చేరింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో మార్కెట్ను దళారులు శాసిస్తున్నారు. హెక్టారుకు సగటున 10 నుంచి 12 టన్నుల వరకు రావాల్సిన దిగుబడి ప్రస్తుతం 4 నుంచి 8 టన్నులు మాత్రమే వస్తుంది. ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరగడంతో సాగు కష్టంగా మారింది.
అటకెక్కిన అనుబంధ పరిశ్రమలు
నూజివీడు డివిజన్ పరిధిలో అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలు అటకెక్కాయి. ఎన్నికల సమయంలో నాయకులు హామీలు గుప్పించడానికి ప్రచారాస్త్రంగా మారింది. పండ్ల రసం, ఒరుగులు, పచ్చళ్లు, తాండ్ర పరిశ్రమలు ఈ ప్రాంతంలో నెలకొల్పితే రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించడానికి అవకాశం ఉంది. మామిడి నిల్వ చేసి ధర ఆశాజనకంగా ఉన్న తరుణంలో విక్రయించడానికి అవసరమైన శీతలగిడ్డంగుల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. మామిడి రైతులను ప్రోత్సహించడానికి ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాల మంజూరు ప్రస్తుతం నిలిచింది. తోటల అభివృద్ధి, సూక్ష్మ, బిందు సేద్యం, పండ్ల తోటల విస్తరణ, మొక్కల సరఫరా, పెట్టుబడులపై రాయితీ, ప్యాక్ హౌస్లు, రిఫర్ వ్యానులు, ప్రోసెసింగ్ యూనిట్ల కోసం రైతులు చేసిన దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి.
పామాయిల్ సాగు చేస్తున్నాం
గిట్టుబాటు ధర రాకపోవడంతో చిట్టేల సమీపంలో ఉన్న మామిడి తోటలో చెట్లను ఇటీవల తొలగించాం. వాటి స్థానంలో పామాయిల్ సాగు చేపట్టి అంతర పంటగా మిర్చి, మెట్ట పంటలు సాగు చేస్తున్నాం. పెట్టుబడులు, రవాణా, కూలీ ఖర్చు బాగా పెరిగింది. మార్కెట్లో పంటకు ఆశించిన ధర రాకపోవడంతో మామిడిపై ఆసక్తి తగ్గింది. - ఎస్.శివశంకర్, రైతు, తిరువూరు
ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి
మామిడి మార్కెట్లపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. మిగిలిన పంటల మాదిరి మద్దతు ధర నిర్ణయించాలి. ఉద్యానశాఖ ద్వారా పథకాలను సకాలంలో మంజూరు చేయాలి. నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావాలి. రైతులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది. లేకపోతే మామిడి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. 18 ఎకరాల్లో చెట్లను నరికించాం. మెట్ట, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నాం. - కె.సుబ్బారావు, రైతు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!