మామిడి మిగిల్చిన నష్టం
మామిడి పంట సాగు చేస్తున్న రైతులు గత కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తగ్గిన దిగుబడులు, గిట్టుబాటు ధర ఆశాజనకంగా లేకపోవడం వంటి కారణాలతో సాగుపై అయిష్టత చూపుతున్నారు. పెట్టుబడులు
ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి
2 వేల హెక్టార్లలో చెట్ల నరికివేత
మామిడి చెట్టును యంత్రంతో కోస్తున్న కూలీ
తగ్గుతున్న విస్తీర్ణం
మెట్టప్రాంతమైన పశ్చిమకృష్ణా పరిధిలోని నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మామిడి పంట సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.55 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు, చీడపీడల ఉద్ధృతి, మంగు సమస్య వంటివి దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి.. మార్కెట్ ధరల హెచ్చుతగ్గుదల వల్ల ఆశించిన ధర లభించడం లేదు. గడిచిన పదేళ్లలో సుమారు 28 వేల ఎకరాల్లో చెట్లను తొలగించగా, గత మూడేళ్లలోనే 4 వేల ఎకరాల్లో తోటలను నరికించారు. రెండు దశాబ్దాలకు పైగా వయసు కలిగిన చెట్లను గుత్తగా విక్రయిస్తున్నారు. కొమ్మలను వంట చెరకు, పేపర్ పరిశ్రమలు, మొద్దులను చెక్క తయారీకి తరలిస్తున్నారు. తొలగించిన తోటల్లో జామ, నిమ్మ, సుబాబుల్, పామాయిల్, మెట్ట, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు.
గిట్టుబాటు ధర లేకనే
ఏటా సీజన్ ప్రారంభంలో టన్ను బంగినపల్లి రూ.60 వేలు, తోతాపురి రూ.50 వేల వరకు ధర పలికి, కోతలు ఊపందుకోగానే అమాంతం ధర పతనమవుతోంది. వ్యాపారులు, దళారులు తమ ఇష్టానుసారంగా ధర నిర్ణయిస్తున్నారు. ఈ ఏడాది కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన తరువాత టన్ను రూ.30 వేలకు పడిపోగా, చివరికి రూ.15 వేలకు చేరింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో మార్కెట్ను దళారులు శాసిస్తున్నారు. హెక్టారుకు సగటున 10 నుంచి 12 టన్నుల వరకు రావాల్సిన దిగుబడి ప్రస్తుతం 4 నుంచి 8 టన్నులు మాత్రమే వస్తుంది. ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరగడంతో సాగు కష్టంగా మారింది.
అటకెక్కిన అనుబంధ పరిశ్రమలు
నూజివీడు డివిజన్ పరిధిలో అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలు అటకెక్కాయి. ఎన్నికల సమయంలో నాయకులు హామీలు గుప్పించడానికి ప్రచారాస్త్రంగా మారింది. పండ్ల రసం, ఒరుగులు, పచ్చళ్లు, తాండ్ర పరిశ్రమలు ఈ ప్రాంతంలో నెలకొల్పితే రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించడానికి అవకాశం ఉంది. మామిడి నిల్వ చేసి ధర ఆశాజనకంగా ఉన్న తరుణంలో విక్రయించడానికి అవసరమైన శీతలగిడ్డంగుల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. మామిడి రైతులను ప్రోత్సహించడానికి ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాల మంజూరు ప్రస్తుతం నిలిచింది. తోటల అభివృద్ధి, సూక్ష్మ, బిందు సేద్యం, పండ్ల తోటల విస్తరణ, మొక్కల సరఫరా, పెట్టుబడులపై రాయితీ, ప్యాక్ హౌస్లు, రిఫర్ వ్యానులు, ప్రోసెసింగ్ యూనిట్ల కోసం రైతులు చేసిన దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి.
పామాయిల్ సాగు చేస్తున్నాం
గిట్టుబాటు ధర రాకపోవడంతో చిట్టేల సమీపంలో ఉన్న మామిడి తోటలో చెట్లను ఇటీవల తొలగించాం. వాటి స్థానంలో పామాయిల్ సాగు చేపట్టి అంతర పంటగా మిర్చి, మెట్ట పంటలు సాగు చేస్తున్నాం. పెట్టుబడులు, రవాణా, కూలీ ఖర్చు బాగా పెరిగింది. మార్కెట్లో పంటకు ఆశించిన ధర రాకపోవడంతో మామిడిపై ఆసక్తి తగ్గింది. - ఎస్.శివశంకర్, రైతు, తిరువూరు
ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి
మామిడి మార్కెట్లపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. మిగిలిన పంటల మాదిరి మద్దతు ధర నిర్ణయించాలి. ఉద్యానశాఖ ద్వారా పథకాలను సకాలంలో మంజూరు చేయాలి. నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావాలి. రైతులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది. లేకపోతే మామిడి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. 18 ఎకరాల్లో చెట్లను నరికించాం. మెట్ట, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నాం. - కె.సుబ్బారావు, రైతు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు అధికారులపై ఫిర్యాదు చేస్తాం: బొండా ఉమా
[ 06-05-2024]
వైకాపా అరాచకాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లుగా రాష్ట్ర ప్రధానా ఎన్నికల అధికారి కార్యాలయం స్పందించట్లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
[ 06-05-2024]
ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
[ 06-05-2024]
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయి: నారా లోకేశ్
[ 06-05-2024]
పాపాల పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
జగనాసుర వారి.. నరకాపురి..!
[ 06-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని రహదారులపై ప్రయాణించినవారెవరైనా సరే.. జగన్ సర్కారును శాపనార్థాలు పెట్టకుండా ఉండలేరు. అటు ప్రైవేటు వాహనాలవారే కాదు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం మేం నడపలేం అంటూ మొత్తుకున్న సందర్భాలెన్నో. పల్లె వెలుగు బస్సులు నడి రోడ్డుమీదనే ఎన్నిసార్లు నిలిచిపోయాయో లెక్కే లేదు. -
ఉద్యోగుల ఓట్లకూ వైకాపా గాలం..!
[ 06-05-2024]
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగంలో తీవ్ర గందరగోళం నెలకొంది. వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. వారికి బ్యాలట్ విడుదల కాలేదు. -
ప్రవాసాంధ్రులూ.. పారాహుషార్!
[ 06-05-2024]
ఒక్క వ్యవసాయ భూములు, పొలాలే కాదు... ఇళ్లు, ఇళ్ల స్థలాలు, భవనాలు సహా.. అన్నిరకాల స్థిరాస్తులకు ఎసరు పెట్టేసింది జగన్ సర్కారు. కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం దొడ్డిదారిన ఆస్తులను కాజేసే అక్రమార్కులకు ఇది వరంగా మారనుంది. -
ప్రశాంతంగా నీట్
[ 06-05-2024]
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు కళాశాలల వద్దకు విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్దేశిత సమయం కంటే ముందే చేరుకున్నారు. -
పట్టా లేదు... వంశీ.. పత్తా లేరు..
[ 06-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అర్హులకు అందని ద్రాక్షగానే మారాయి. రాజకీయ అండదండలు ఉన్నవారికే అధిక శాతం పట్టాలు దక్కాయి. -
ఉట్టిపడిన సంప్రదాయం
[ 06-05-2024]
రుగ్వేదం పద్మశ్రీకి ప్రపంచ రికార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్వరలయ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. -
తెదేపా కార్యకర్తలపై రెచ్చిపోయిన వైకాపా మూకలు
[ 06-05-2024]
ప్రశాతంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. -
పేర్ని నాని అరాచకానికి చెక్ పెడదాం
[ 06-05-2024]
మచిలీపట్నం నియోజకవర్గాన్ని సొంత సామాజ్యంగా భావిస్తూ రాచరికపు పోకడలతో అన్ని వర్గాలను అణిచివేస్తున్న పేర్ని వెంకట్రామయ్య(నాని) కబంధ హస్తాల నుంచి నియోజకవర్గాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని సైనిక్ సమతాదళ్(ఎస్ఎస్డీ) నాయకులు స్పష్టం చేశారు. -
రేపు పవన్ రాక!
[ 06-05-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 7న గన్నవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుకు మద్దతుగా ఆయన రానున్నట్లు సమాచారం. -
వైకాపాకు గుణపాఠం చెప్పే సమయం వచ్చింది
[ 06-05-2024]
పెత్తందారులు.. పేదలు అంటూ నాలుగు సంవత్సరాల పాటు నయవంచక పాలనకు పాల్పడిన వైకాపాకు తగురీతిన బుద్ధి చెప్పేందుకు సమయం వచ్చిందని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం అన్నారు. -
నిబంధనలు బేఖాతర్
[ 06-05-2024]
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైకాపా నాయకులు వాటిని పట్టించుకోవడం లేదు. ఎటువంటి అనుమతులతో పనిలేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. -
సూపర్-6 పథకాలతో సంక్షేమం పరుగులు
[ 06-05-2024]
అవనిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించడమే లక్ష్యం. సూపర్-6 పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాం. నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తాం. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. -
మీ భూములు కొల్లగొట్టేస్తారు..!
[ 06-05-2024]
ప్రజల ఆస్తులు, భూములు కొల్లగొట్టేందుకే వైకాపా ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే భూసర్వే, భూరక్ష పేర్లతో రైతుల భూములను సర్వే చేసింది. ఇందులో చాలా వ్యత్యాసాలు బయటపడ్డాయి. -
‘జగన్.. అధికార దుర్వినియోగం చేశారు’
[ 06-05-2024]
గత ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇస్తే.. ముఖ్యమంత్రి జగన్ దుర్వినియోగం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దుయ్యబట్టారు. -
తెదేపాకు అవరోధం.. వైకాపాకు సహకారం
[ 06-05-2024]
నందిగామలో తెదేపా కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యను పోస్టల్ బ్యాలట్ ఓటు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా ఆర్వో ఎ.రవీంద్రరావు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని ఆమెను బయటికి పంపించారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
[ 06-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా డీకే బాలాజీ తెలిపారు. -
పోస్టల్ బ్యాలట్ సమాచారానికి హెల్ప్లైన్లు
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ పట్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్లైన్లను ఏర్పాటు చేసినట్లు నోడల్ అధికారి షాహిద్బాబు తెలిపారు. -
సీఎం పర్యటనకా? పోస్టల్ బ్యాలట్కా?
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ విషయంలో పోలీసులకు కొత్త సమస్య ఎదురైంది. ఎన్నికల విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందికి ఈ ఓటింగ్కు 6వ తేదీ కేటాయించారు. -
ఈవీఎం-వీవీ ప్యాడ్ల ఓటింగ్ సజావుగా సాగాలి
[ 06-05-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం-వీవీ ప్యాడ్ల) ద్వారా జరిగే ఓటింగ్ ప్రక్రియ సక్రమంగా, సజావుగా జరిగేలా చూడాలని ఎన్నికల పరిశీలకురాలు మంజురాజ్వాల్ సూచించారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
[ 06-05-2024]
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
ఫెసిలిటేషన్ కేంద్రాల సంఖ్య పెంపు
[ 06-05-2024]
ద్యోగుల పోస్టల్ బ్యాలట్ వినియోగ నిమిత్తం జిల్లాలో అదనపు ఫెసిలిటేషను కేంద్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ సెంట్రల్, మైలవరం నియోజకవర్గాల ఆర్వోల కార్యాలయాల్లో ఆదివారం నూతనంగా పోస్టల్ బ్యాలట్ వినియోగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఫారం-12 అందజేతకు మరో అవకాశం
[ 06-05-2024]
పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు ముందుగా ఫారం-12 కచ్చితంగా అందజేయాల్సి ఉంది. వివిధ కారణాల వల్ల వీటిని ఇప్పటి వరకు సమర్పంచని వారికి ఈసీఐ మరో అవకాశం కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి