కొనసాగుతున్న వేట
ఇంకా పట్టుబడని చెడ్డీ గ్యాంగ్ సభ్యుల కోసం ముమ్మరంగా అన్వేషణ సాగుతోంది. విజయవాడ పోలీసులు మిగిలిన వారి కోసం రెండు రాష్ట్రాల్లో వేట కొనసాగిస్తున్నారు. గతేడాది ఆఖర్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరుస చోరీలతో చెడ్డీ గ్యాంగ్ హడలెత్తించింది.
ఇంకా పట్టుబడని చెడ్డీ గ్యాంగ్ సభ్యుల కోసం అన్వేషణ
మధ్యప్రదేశ్, గుజరాత్లో రెండు ప్రత్యేక బృందాలు
ఈనాడు, అమరావతి
ఇంకా పట్టుబడని చెడ్డీ గ్యాంగ్ సభ్యుల కోసం ముమ్మరంగా అన్వేషణ సాగుతోంది. విజయవాడ పోలీసులు మిగిలిన వారి కోసం రెండు రాష్ట్రాల్లో వేట కొనసాగిస్తున్నారు. గతేడాది ఆఖర్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరుస చోరీలతో చెడ్డీ గ్యాంగ్ హడలెత్తించింది. రెండు జిల్లాల వాసుల్ని కంటి మీద కునుకు లేకుండా చేసింది ఈ ముఠా. ఆ తర్వాత పోలీసుల నిఘా పెరగడంతో తిరిగి గుజరాత్ వెళ్లిపోయారు. విజయవాడ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు గుజరాత్ రాష్ట్రం వెళ్లి అక్కడ ముగ్గురిని అరెస్టు చేయగలిగారు. మిగిలిన ఏడుగురు తప్పించుకున్నారు.
గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామం, మధ్యప్రదేశ్లోని జుబువాకు చెందిన పది మంది దొంగలు రెండు ముఠాలుగా విడిపోయి తొమ్మిది రోజుల వ్యవధిలో ఐదు చోరీలకు పాల్పడ్డారు. గతేడాది నవంబరు 29న తెల్లవారుజామున విజయవాడలోని చిట్టినగర్లో, డిసెంబరు 2న నగర శివారు గుంటుపల్లి, 3న గుంటూరు జిల్లా తాడేపల్లి, 4న ఇదే మండలం కుంచనపల్లి, 7న విజయవాడ శివారు పెనమలూరు మండలం పోరంకిలో చోరీలు చేశారు. అనంతరం డిసెంబరు 4న ఓ ముఠా, 8న మరో ముఠా గుజరాత్ వెళ్లిపోయింది.
విజయవాడ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాలు గుజరాత్ వెళ్లి చోరీ చేసిన సొత్తుతో సహా మడియా కాంజీ మేడా, సక్ర మండోడ్, కమలేష్ బాబేరియా అలియాస్ కమలేష్ అలియాస్ కమ్లా జుబువాలను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.20వేలు నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
గుజరాత్లో గత నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. దాహోద్ ప్రాంతంతో ఎన్నికల అనంతర హింసలో జంట హత్యలు జరిగాయి. ఇందులో ప్రధాన నిందితుడు సురేష్. ఇతను చెడ్డీ గ్యాంగులోని కీలక వ్యక్తి. స్థానిక పోలీసులు కూడా అరెస్టు చేసేందుకు గాలిస్తున్నారు. మిగిలిన వారి జాడ కూడా లేదు. పొరుగునే మధ్యప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు ఉన్నందున ఆ రాష్ట్రంలోకి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. దాహోద్ ప్రాంతంలోని ఓ తెగకు చెందిన చాలా కుటుంబాలకు చోరీలే ప్రధాన వృత్తి. అడపాదడపా మాత్రమే స్వస్థలాలకు వస్తుంటారు. దీంతో నిందితులను పట్టుకోవడం పోలీసులకు కత్తి మీద సాములా మారుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే విజయవాడ పశ్చిమ సీటు ఇచ్చేశా: పవన్ కల్యాణ్
[ 10-05-2024]
‘విజయవాడ పశ్చిమ సీటు జనసేనకే ఖాయమైంది. కానీ.. భాజపా అధినాయకత్వం నన్ను ఒక్కటే అడిగింది. -
బతుకు బండిపై.. పెట్రో మంట!
[ 10-05-2024]
ప్రగతి రథ చక్రానికి అత్యంత కీలకమైన ఇంధన ధరలు గత ఐదేళ్లలో భారీగా పెరిగాయి. 2019 జనవరిలో లీటరు పెట్రోలు రూ. 72.31 ఉండగా.. ఈ ఏడాది జనవరి నాటికి రూ. 109.31కు చేరుకుంది. అంటే రూ. 37 పెరిగిందన్నమాట -
గన్నవరంలో చంద్రబాబు పర్యటన నేడు
[ 10-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబు శుక్రవారం గన్నవరంలో పర్యటించనున్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మద్దతుగా నిర్వహించే ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు. -
కూటమితోనే అభివృద్ధి
[ 10-05-2024]
ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. -
సమన్వయంతో పనిచేయండి
[ 10-05-2024]
ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునేలా చూడాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్మిశ్రా అధికారులకు సూచించారు. -
చేష్టలుడిగిన నేత
[ 10-05-2024]
చేనేత కార్మికులను ఆదుకోవడంతోపాటు పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం -
ప్రభుత్వ మార్పుతోనే అభివృద్ధి, సంక్షేమం
[ 10-05-2024]
కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలు ప్రగతి, మంచితనానికి పట్టం కట్టాలని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కోరారు. -
కూటమికే మా మద్దతు
[ 10-05-2024]
గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం మద్దతు ఎన్డీయే కూటమికేనని సంఘ రాష్ట్ర కార్యదర్శి బీఆర్ ఆంజనేయులు అన్నారు. -
కూటమిదే పీఠం
[ 10-05-2024]
జనసేనాని పవన్కల్యాణ్కు విజయవాడ నగరంలో అడుగడుగునా.. తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు నీరాజనం పలికాయి. పవన్ రాకతో జిల్లాలోని ఎన్డీయే కూటమి శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. -
రూపాయి ఇవ్వలేదు రూపుమారలేదు
[ 10-05-2024]
మచిలీపట్నం కలెక్టరేట్ పరిధిలో ఆర్డీవో కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో ఆధునిక వసతులతో భవనం నిర్మించాలని నిర్ణయించడంతోపాటు రూ.2.25కోట్లు కేటాయించారు.2018 సెప్టెంబరు 28న పనులు ప్రారంభించారు. -
సాధారణ కాన్పులో 4 కిలోల బిడ్డ జననం
[ 10-05-2024]
గంపలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చింతలనర్వకు చెందిన మేరీజోస్కు సాధారణ కాన్పులో 4 కిలోల బరువుతో బాబు జన్మించినట్లు వైద్యాధికారులు వి.శ్రుతి, భార్గవి గురువారం తెలిపారు
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ