logo

జగనన్న కాలనీల్లో వసతులు కల్పించాలి

ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపడుతున్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కేతవరంలోని జగనన్న కాలనీ లేఅవుట్లను ఆయన బుధవారం పరిశీలించారు. నవరత్నాలు కార్యక్రమంలో

Published : 20 Jan 2022 03:28 IST

కేతవరంలో జగనన్న లేఅవుట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కోటేశ్వరరావు

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపడుతున్న జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కేతవరంలోని జగనన్న కాలనీ లేఅవుట్లను ఆయన బుధవారం పరిశీలించారు. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పూడిచెర్లలోని సచివాలయం సందర్శించి పలు దస్త్రాలు పరిశీలించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ డీఏ సుబ్బారెడ్డి, ఎంపీడీవో శివనాగప్రసాద్‌, ఏఈ రామయ్య, ఏపీవో వసుధ, సర్పంచి గోవర్ధన్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని