logo

ప్రజా సమస్యలపై నిలదీసిన కౌన్సిలర్లు

ప్రజా సమస్యలపై అధికార పార్టీ కౌన్సిలర్లే అధికారులను ప్రశ్నించారు. బుధవారం ఛైర్‌ పర్సన్‌ శాంత అధ్యక్షతన జరిగిన పురపాలక సమావేశంలో సభ్యులు

Updated : 29 Jun 2022 14:07 IST

ఆదోని మార్కెట్ : ప్రజా సమస్యలపై అధికార పార్టీ కౌన్సిలర్లే అధికారులను ప్రశ్నించారు. బుధవారం ఛైర్‌ పర్సన్‌ శాంత అధ్యక్షతన జరిగిన పురపాలక సమావేశంలో సభ్యులు మాట్లాడారు. ఒకటో వార్డులో రహదారులు, మురుగు కాలువలు నిర్మించాలని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని సభ్యురాలు పార్వతి అన్నారు. వెంకటేశ్వరకాలనీలో బోరు మరమ్మతుకు గురైందని, 25వ వార్డులో సామూహిక శౌచాలయాల బిల్లులు రాలేదని, 5వ వార్డులో అసంపూర్తిగా వదిలేసిన సీసీ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని సభ్యులు కోరారు. సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మొక్కుబడి సమావేశాలు కాకుండా.. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. అనంతరం పలువురు సభ్యులు తమ వార్డు సమస్యలపై వినతులు సమర్పించారు. సమావేశంలో వైస్‌ ఛైర్మన్లు మహమ్మద్‌ గౌస్‌, నర్సింహులు, కమిషనర్‌ కృష్ణ, సహాయ కమిషనర్‌ అనుపమ, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని