icon icon icon
icon icon icon

Buggana: బుగ్గన నామినేషన్‌ పెండింగ్‌లో ఉంచిన ఎన్నికల అధికారి

డోన్‌ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నామినేషన్‌ను ఎన్నికల అధికారి పెండింగ్‌లో ఉంచారు.

Updated : 26 Apr 2024 16:58 IST

నంద్యాల: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మరోసారి డోన్‌ నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు వైకాపా అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నామినేషన్ల పరిశీలన సందర్భంగా.. ఆయన ఎన్నికల అఫిడవిట్‌పై తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించలేదని, నామినేషన్‌ పత్రంలో కొన్ని కాలమ్స్‌ భర్తీ చేయలేదని ఫిర్యాదు చేశారు.

దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వెంటనే నామినేషన్‌ తిరస్కరించాలని కోరారు. మంత్రి బుగ్గనకు ఉన్న మొత్తం ఆస్తులు, అఫిడవిట్‌లో వెల్లడించిన ఆస్తుల వివరాలకు సంబంధించిన పత్రాలను ఆర్వోకు చూపించారు. తెదేపా పిర్యాదుపై స్పందించిన (రిటర్నింగ్‌ అధికారి) ఆర్వో.. ప్రస్తుతం ఆయన నామినేషన్‌ను పెండింగ్‌లో ఉంచారు. సాయంత్రంలోగా ఆస్తుల వివరాలు ఇవ్వాలని బుగ్గన తరఫు న్యాయవాదికి నోటీసు ఇచ్చారు. బుగ్గన నామినేషన్‌ తిరస్కరించకుండా పెండింగ్‌లో పెట్టడాన్ని తప్పుబడుతూ కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆర్వోపై ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img