బాలల పోషణ బలహీనం
ఉమ్మడి జిల్లాలో భావితరం బక్కచిక్కుతోంది. పౌష్టికాహార లోపంతో చిన్నారులు బరువు తగ్గి రక్తహీనత బారిన పడుతున్నారు. ఇలాంటి వారికి ఉచిత వైద్య
గుర్తించడంలో యంత్రాంగం విఫలం
ఖాళీగా పౌష్టికాహార పునరావాస కేంద్రం
ఈనాడు- కర్నూలు, వైద్యాలయం- న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలో భావితరం బక్కచిక్కుతోంది. పౌష్టికాహార లోపంతో చిన్నారులు బరువు తగ్గి రక్తహీనత బారిన పడుతున్నారు. ఇలాంటి వారికి ఉచిత వైద్య సేవలు అందించే కేంద్రం ఉంది. క్షేత్రస్థాయిలో శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో బక్కచిక్కిన భావితరం సేవలు అందుకోలేకపోతోంది.
24 గంటల పాటు సేవలు
పునరావాస కేంద్రంలో 24 గంటలు వైద్యం అందిస్తారు. ఆరోగ్యం మెరుగు పడటానికి ఔషధాలు.. ఉచితంగా పౌష్టికాహారం ఇస్తారు. సంబంధిత పిల్లల తల్లికీ ఉచిత భోజన సదుపాయంతోపాటు నిత్యం రూ.150 చొప్పున ఇస్తారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు రోజుకో మెనూ చొప్పున ఆహారం అందజేసి నిర్దేశించిన 14 రోజుల్లో పిల్లల బరువు పెరిగేలా చూడటమే ఈ కేంద్రం ప్రత్యేకత. ప్రస్తుతం జీజీహెచ్లోని కేంద్రంలో ఇద్దరు న్యూట్రిషియన్లకు ఒక్కరే ఉన్నారు. పౌష్టికాహారం వండటానికి ఇద్దరు వంట మనుషులకు ఒక్కరే ఉన్నారు. వీటిని భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లినా నియామకాలు జరగలేదు.
ఎందుకు బక్కచిక్కుతున్నారంటే
పునరావాస కేంద్రానికి వచ్చే పిల్లల ఆరోగ్య పరిస్థితి పరిగణనలోకి తీసుకొని క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. చిన్నారులు ఎందుకు పౌష్టికాహార లేమితో ఇబ్బంది పడుతున్నారో గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో ఏటా 60వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. చాలా మంది గర్భిణుల్లో హిమోగ్లోబిన్ 8 శాతం కంటే తక్కువగా ఉండటం సమస్యకు ప్రధాన కారణం అవుతుంది. గిరిజన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది.
లోపించిన సమన్వయం
* ఉమ్మడి కర్నూలు జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య, 20 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. బరువు తక్కువ, రక్తహీనత, న్యూమోనియా, ఫిట్స్ తదితర సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను తల్లిదండ్రులు ఆయా కేంద్రాలకు తీసుకెళ్తుంటారు. అలాంచి చిన్నారులను సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పునరావాస కేంద్రానికి పంపించాలి. ఎక్కడా ఈ ప్రక్రియ కొనసాగడం లేదు. కేవలం సర్వజన వైద్యశాలలో గుర్తించిన చిన్నారులనే కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు.
* 2012లో 20 పడకలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ప్రస్తుతం ఐదు మంది చికిత్స పొందుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి రిఫరల్ కేసులు తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం. ఆరోగ్య కార్యకర్త (ఏఎన్ఎం), ఆశాలు బాధ్యత తీసుకోవడం లేదు. అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖ, అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఖర్చుకాక నిధులు వెనక్కి
* జాతీయ ఆరోగ్య మిషన్ కింద పౌష్టికాహార పునరావాస కేంద్రానికి ఏటా రూ.10 లక్షలకుపైగా నిధులు అందుతాయి. క్షేత్రస్థాయి నుంచి రిఫరల్స్ తక్కువగా ఉండటంతో నిధులు ఖర్చు కావడం లేదు. రెండేళ్లకు సంబంధించిన రూ.8 లక్షలకు పైగా నిధులు వెనక్కి మళ్లినట్లు సమాచారం.
* చిన్నారులతోపాటు తల్లులకు వేతన నష్టపరిహారం కింద అందించే నగదు పెండింగ్ ఉంది. సుమారు రూ.3 లక్షల వరకు అందించాల్సి ఉంది. బకాయిలకు సంబంధించి చెక్కు ఇవ్వాలా.. నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలా అనే ప్రణాళికలో అధికారులున్నారు.
ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన ముషిరకు 38 నెలలు.. 14 కిలోల బరువు ఉండాల్సి ఉండగా.. 8 కిలోల లోపే ఉంది. పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతోంది. ఈ బాలిక ఎదుగుదలను పీహెచ్సీ, సీహెచ్సీ స్థాయిలో గుర్తించలేదు. లోపాన్ని తల్లిదండ్రులే గుర్తించి వైద్యం కోసం కర్నూలు సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. ఇక్కడి వైద్యులు గుర్తించి పునరావాస కేంద్రానికి పంపించారు.
నంద్యాలకు చెందిన అనవిక పౌష్టికాహారలేమితో ఇబ్బంది పడుతోంది. దీంతోపాటు కాల్షియం లోపం ఉండటంతో ఎముకలు విరిగిపోతున్నాయి. 31 నెలల ఈ చిన్నారి 14 కిలోలు ఉండాలి..కానీ 7.5 కిలోలే ఉంది. తల్లి నేరుగా చిన్న పిల్లల విభాగానికి తీసుకొచ్చారు. తొలుత బాల స్వాస్థత (డైస్ కేంద్రం)లో చికిత్స అందించి రిఫరల్ కేసుగా పునరావాస కేంద్రానికి పంపారు. మొదట్లోనే క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యను గుర్తించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 26-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. -
బుగ్గన నామినేషన్ పెండింగ్లో ఉంచిన ఎన్నికల అధికారి
[ 26-04-2024]
డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. -
ఇంటింటికి తెలుగుదేశం
[ 26-04-2024]
పెద్దకడుబుర్ మండలం జాలవడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!