ఆలోచించారు.. ఆవిష్కరించారు
కర్నూలు నగర శివారులోని డా.కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో పవన్ కల్యాణ్, నూర్ మహమ్మద్, మహేంద్రరెడ్డి, లోకేష్ చౌదరి, నరేంద్రలు బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు. బీటెక్ ఆఖరి సంవత్సరం కావడంతో ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వచ్చింది. కరోనా కారణంగా
ప్రతిభ చాటుతున్న ఇంజినీరింగ్ విద్యార్థులు
విద్యార్థులు ఆవిష్కరించిన పరికరం
కల్లూరు గ్రామీణ, న్యూస్టుడే : కర్నూలు నగర శివారులోని డా.కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో పవన్ కల్యాణ్, నూర్ మహమ్మద్, మహేంద్రరెడ్డి, లోకేష్ చౌదరి, నరేంద్రలు బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు. బీటెక్ ఆఖరి సంవత్సరం కావడంతో ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి వచ్చింది. కరోనా కారణంగా విద్యార్థులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసి పరికరాన్ని ప్రదర్శించేందుకు సమయం తక్కువగా ఉంది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలా అందరూ బాగా ఆలోచించి ఓ పరికరాన్ని తయారు చేయాలని సంకల్పించారు. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన. అందరికి ఉపయోగపడేలా ఏదైనా చేస్తే బాగుంటుందని ఫ్యాబ్రికేషన్ ఆఫ్ సోలార్ ప్యానెల్ డస్ట్ క్లీనింగ్ మిషన్ను తయారు చేశారు. విద్యుత్తు ఆదా చేసేందుకు ప్రస్తుత రోజుల్లో చాలా మంది సోలార్ బోర్డులు, పరికరాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిపై దుమ్ము పడితే వేడి గ్రహించుకునే శక్తి తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆటోమెటిక్గా దుమ్మును దులిపే యంత్రాన్ని రూపొందించారు. పలువురి చేత శెభాష్ అనిపించుకున్నారు.
తయారీ విధానం.. పనితీరు
పరికరాన్ని తయారుచేసేందుకు నెల రోజులు పట్టిందని, సుమారు రూ.20 వేల వరకు ఖర్చైందని పవన్కల్యాణ్ అనే విద్యార్థి తెలిపారు. (టీంలో సభ్యుడు.. మిత్రుల్లో ఒకరు) సోలార్ ప్యానెల్, రోలర్, చైన్ స్పార్కెట్లు, ఐరన్ స్టాండ్ వినియోగించారు. సోలార్ బోర్డులపై పడే దుమ్మును ఆటోమేటిక్గా ఈ పరికరం శుభ్రం చేస్తుంది. దీంతో సౌరశక్తిని సోలార్ బోర్డులు గ్రహించి విద్యుత్తు సరఫరా చేసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.
పనితీరును వివరిస్తూ..
రైతు కోసం విత్తనం నాటే యంత్రం
ఎమ్మిగనూరు, న్యూస్టుడే : సాంకేతిక రంగంలో చదివిన విద్యార్థులు భిన్న ఆలోచనలు చేసి ఆదుర్స్ అనిపించారు. రైతులు సులభంగా విత్తనం విత్తే పద్ధతిని ఆవిష్కరించారు. ఎమ్మిగనూరు పరిధిలోని ఎర్రకోట ఇంజనీరింగ్ విద్యార్థులు రాజ్కుమార్, మహేష్, జగదీష్, చంద్రశేఖర్, బాషా(లెక్చరర్), రవి శంకర్(హెచ్ఓడి), సునీల్కుమార్ బృంద సభ్యులు రైతుల కష్టాలు తెలుసుకున్నారు. సులభంగా విత్తనం విత్తేలా యంత్రం తయారు చేశారు. వీల్స్ ద్వారా పొలంలో నాటేందుకు ఉపయోగపడుతోంది. ఎకరా పొలంలో సాగుచేసే అవకాశం ఉంది. కాడ్డెదులు, మనుషులతో పనిలేకుండా ఒక్కరే విత్తేందుకు ఇది ఉపయోగపడుతోంది. వీల్స్, సెన్సార్, ఫ్రేమం బోర్డు, డివైడింగ్ యంత్రం, విత్తనం వేసేందుకు పెద్ద బౌల్, మైక్రోకంట్రోలర్ 500, డీజీ మోటర్, పవర్ మోటర్, ఎల్సీడీ బోర్డులను అమర్చుతారు. వీటికి రూ.10 వేలు ఖర్చవుతోంది. సొంత పొలంలో విత్తనం వేసేందుకు అనుకూలంగా ఉంటుంది. వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నట్లు విద్యార్థులు వివరించారు.
సూపర్.. సోలార్ కార్
కర్నూలు విద్యావిభాగం, న్యూస్టుడే : కాలుష్య నియంత్రణలో భాగంగా విద్యుత్తు వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలు, కార్లు అందుబాటులోకి వచ్చాయి. తామూ అలాంటి వాహనాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నారు.. నగర శివారులోని జి.పుల్లయ్య ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్న శ్రీనివాసరావు, ఇనాయతుల్లా, హరికృష్ణ, అశోక్లు. ఈ నలుగురు మిత్రులు కలిసి సోలార్ సిస్టమ్తో నడిచేలా సోలార్ కారును తీర్చిదిద్దారు. ఇందులో వైఫై, బ్లూటూత్ ప్రత్యేకం. వాహనం ఎక్కడ ఉందో తెలిపేలా ఆడియో రూపంలో వివరిస్తుంది. 6 గంటలపాటు ఛార్జింగ్ చేస్తే 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు తిరగొచ్చు. సోలార్ కారు తయారీకి సుమారు రూ.1.60 లక్షలు ఖర్చైనట్లు విద్యార్థులు తెలిపారు.
ప్రమాదాలు నివారించేలా..
కొత్త ఆలోచనలతో నవ సమాజ నిర్మాణానికి అవసరమైన ఆవిష్కరణలు చేయాలని సంకల్పంతో మెదడుకు పదును పెట్టి సరికొత్త ప్రయోగాలు చేశారు. హర్ష, సామ, జగదీష్, రవిశంకర్, జావేద్ బ్బాషా, విజయకుమార్, అరుణ్, వంశీ ఇంజినీరింగ్ చదువుతున్నారు. వాహనాల్లో వేగంగా వెళ్తూ ప్రమాదాల బారిన పడడం వీరు గమనించారు. దీంతో ఇంటెలిజెంట్ బ్రేకింగ్ పద్ధతితో ప్రమాదాలు జరగకుండా చేయాలని ప్రయోగాలు చేసి నూతనమైన యంత్రం ఆవిష్కరించారు. అతివేగంగా వెళ్లే సమయంలో వాహనాలకు ఏదీ అడ్డు వచ్చినా ప్రయోగం ద్వారా అమర్చుకున్న యంత్రంతో నివారించవచ్చు. అల్ట్రా సోని సెన్సార్ బోర్డు, రిసీవర్, మీటర్, కంప్యూటర్ పరిధిలో బోర్డు, సిగ్నల్స్ రిసీవర్, ఫెమీనా మీటర్, బాడీ ఫ్రేమ్, వీల్స్ పరికరాలు అమర్చుకోవాలి. వాటిని కనుగోనేందుకు రెండు నెలల సమయం పట్టింది. దీనికి రూ.11వేలు ఖర్చు అవుతోంది. అల్ట్రాసోనిక్ సెన్సార్ బోర్డు, రిసీవô్ను వాహనానికి అమర్చుకోవాలి. అడ్డంగా వస్తే ఇది సిగ్నల్స్ పంపడంతో డ్రైవô్తో సంబంధం లేకుండా వాహనాలు నిలిపే అవకాశం ఉంటుంది. మిత్రులు కలిసి మూడు నెలలపాటు గదిలో ఉండి వాటిని కనుగొన్నట్లు విద్యార్థులు హర్ష, సామ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!