logo

29న బనగానపల్లికి చంద్రబాబు రాక

బనగానపల్లికి ఈ నెల 29న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి బుధవారం తెలిపారు.

Updated : 28 Mar 2024 06:41 IST

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లికి ఈ నెల 29న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొంటారని, మధ్యాహ్నం 11 గంటలకు పెట్రోల్‌ బంకు కూడలిలో సభ ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 8 గంటలకు బనగానపల్లి తెదేపా కార్యాలయంలో కార్యకర్తలు, నాయకుల సమావేశం ఉంటుందని, ప్రతి ఒక్కరు హాజరవ్వాలని బీసీ కోరారు. 

సంజామల, న్యూస్‌టుడే:  ప్రజాగళం సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు. బుధవారం సంజామలలో ఆయన మాట్లాడారు. సభ విజయవంతం చేయడానికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని