జగన్ చోద్యం.. ‘కాడి’తప్పిన కౌలుసేద్యం
ముఖ్యమంత్రి గారూ...! మీ ఆత్మబంధువు జగన్ పేరిట 2019 జులై 8న రైతులకు మీరు రాసిన లేఖ గుర్తుందా?... రైతు భరోసా ద్వారా కౌలుదార్లకు మేలు జరగబోతోందని చెప్పారు. మరి నిజంగా ఆదిశగా ఏమైనా చేశారా..?
కర్నూలు వ్యవసాయం, న్యూస్టుడే
ముఖ్యమంత్రి గారూ...! మీ ఆత్మబంధువు జగన్ పేరిట 2019 జులై 8న రైతులకు మీరు రాసిన లేఖ గుర్తుందా?... రైతు భరోసా ద్వారా కౌలుదార్లకు మేలు జరగబోతోందని చెప్పారు. మరి నిజంగా ఆదిశగా ఏమైనా చేశారా..? ఏడాదికి ఎంత మందికి భరోసా కల్పిస్తుందీ ఏనాడైనా సమీక్షించారా?.. రాధాకృష్ణ కమిషన్ లెక్కల ప్రకారం లక్షల మందికి పైగానే ఉండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1.02 లక్షల మంది కౌలు రైతులున్నారు... వారికి మీరెలా మేలు చేశారో వివరించగలరా...?
రైతు సంక్షేమంటూ గద్దెనెక్కిన జగన్ కౌలు రైతుల నోట్లో మట్టికొట్టారు. నవరత్నాలతో కూడిన ఎన్నికల ప్రణాళికే తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటూ ప్రవచించే ఆయన.. మూడేళ్లలోనే 99 శాతం హామీలు అమలు చేశామని బీరాలు పలుకుతుంటారు. కౌలు రైతులకిచ్చిన హామీ ఏ మేరకు అమలు చేశారో చూస్తేనే జగన్ సర్కారు ప్రభుత్వ తీరు ఎలా ఉందో స్పష్టమవుతుంది. కౌలుకు సాగుచేస్తున్న వారందరికీ అమలు చేస్తామని చెప్పి..అమల్లోకి వచ్చే సరికి కులాల లెక్కన విభజించారు. ఇతర వర్గాల కౌలురైతులకు మొండిచేయి చూపిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులతోపాటు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకే వర్తింపజేస్తామంటూ మెలిక పెట్టారు. సాయంలో కోత పెట్టడం ద్వారా వారికిచ్చే భరోసా మొత్తాన్ని కూడా మిగుల్చుకున్నారు. కౌలురైతుకు భరోసా కల్పించడం ఇదేనా? రైతుసంక్షేమం అంటే ఇదా? ఇందుకే జగన్ మళ్లీ కావాలా? ఆయన్ని మళ్లీ సీఎంగా గెలిపించాలా? అనే ప్రశ్నలు కౌలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
కొండంత చెప్పారు.. గోరంత ఇచ్చారు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు లక్ష ఇరవై వేల మంది వరకు కౌలుకు భూమి తీసుకొని సాగు చేస్తున్నారు. తెదేపా హయాంలో 60 వేల మందికి పైగా కౌలు రైతులకు సాగు ధ్రువీకరణ పత్రాలు (సీసీఆర్సీ) ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం ఏడాదిలో 11 నెలల కాలపరిమితితో 41 వేల మందికే సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. కార్డుదారుల్లో సగం మందికి కూడా పెట్టుబడి సాయం అందించడం లేదు. కౌలుదారులు ఎకరాకు రూ.20-30 వేల వరకు కౌలు చెల్లించి పంటలు సాగు చేస్తున్నారు. ఏడాదిలో ఖరీఫ్, రబీ సీజన్లలో కౌలురైతులు రూ.650 కోట్లు అప్పులు చేసి పంటలు పండించారు. ఖరీఫ్లో పత్తి, వేరుశనగ, కంది, మొక్కజొన్న, మిరప, ఉల్లి, పొగాకు వంటి పంటలు సాగు చేయగా..తీవ్ర వర్షాభావ పరిస్థితులతో తుడిచిపెట్టుకుపోయాయి. రబీలో అత్యధికంగా శనగ సాగు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా కరవుతో ఇదే పరిస్థితి ఎదురైంది. వారికి రైతుభరోసా పెట్టుబడి సాయం అందడం లేదు.. కనీసం పంట రుణాలైనా ఇప్పిస్తారనుకుంటే అదీ లేదు. అధికారులు కౌలుకార్డులు చేతిలో పెట్టి పత్తాలేకుండా పోతున్నారు. కరవుతో దిగుబడులు రాక..చివరికి పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
అప్పుల ఊబిలో చిక్కుకుని...
కౌలురైతుల్లో నిరుపేద కుటుంబాల వారే అత్యధికం. సగటున ఒక్కో రైతు 3 నుంచి 4 ఎకరాలను కౌలుకు సాగు చేస్తున్నారు. ఎకరాకు కనీసం రూ.30 వేల చొప్పున పెట్టుబడి చూసినా కనీసం రూ.లక్షకు పైగానే ఖర్చు పెడుతున్నారు. వర్షాలు, వరదలు, కరవులతో పంటచేతికి రాక పెద్దఎత్తున నష్టపోతున్నారు. అయినా వారికి కౌలురైతు కార్డులు(సీసీఆర్సీ) అందిద్దామని ఆలోచన చేయడం లేదు. రాయితీ విత్తనాలివ్వడం లేదు. పెట్టుబడి రాయితీ, పంటల బీమా ప్రయోజనాలూ కల్పించడం లేదు. కౌలుదారులు పంటలను సాగు చేస్తే భూ యజమానులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఒక్క ఖరీఫ్లోనే రూ.650 కోట్ల మేర కౌలుదారులకు అప్పులు మిగిలాయి.
ఊపిరి తీసిన మడి
నందికొట్కూరుకు చెందిన నాగమునీంద్ర గౌడ్(33) గనిలో పని చేసేవారు.. ఎంత కష్టం చేసినా బతుకుబండి ముందుకెళ్లడం లేదు.. పిల్లలు, కుటుంబాన్ని ఉన్నతస్థానంలో ఉంచాలని కలలు కన్నారు.. వ్యవసాయం చేసి ఆర్థికాభివృద్ధి సాధించొచ్చని ఆశించారు. ఇందులో భాగంగా ఎకరం రూ.25 వేల చొప్పున 15 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. మొక్కజొన్న, పత్తి, మిరప, వరి పంటలను సాగు చేశారు. కరవు కాటేసింది.. ఐదెకరాల్లో వేసిన వరి నీరు లేక ఎండిపోయింది. వర్షాధారం కింద సాగు చేసుకున్న మొక్కజొన్న ఎదగలేదు. కౌలు, పంటపెట్టుబడికి చేసిన అప్పులు కళ్లముందు కనిపించాయి. అప్పు ఎలా తీర్చాలో తెలియక కుమిలిపోయారు. గతేడాది సెప్టెంబరు 13న ఆత్మహత్య చేసుకున్నారు.. ‘ డబ్బులు ఇవ్వాలని అప్పులోళ్లు ఇంటికొస్తున్నారు.. రూ.10 లక్షల వరకు అప్పు ఉంది.. ఏం చేయాలో అర్థంకావడం లేదని’’ భార్య పుష్పావతి ఆవేదన వ్యక్తం చేశారు.
649 మందికే పంట రుణం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.220 కోట్ల పంట రుణాలు లక్ష్యంగా కాగా కేవలం 649 మంది కౌలుదారులకు ఉమ్మడి జిల్లాలోని బ్యాంకుల ద్వారా రూ.6.86 కోట్లు మంజూరు చేశారు. గతనెల 20న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో కర్నూలు జిల్లాలో రూ.40.83 కోట్లు, నంద్యాలలో రూ.52 కోట్లు కలిపి మొత్తం రూ.92.83 కోట్ల పంట రుణాలు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ అధికారులు జడ్పీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు.
సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలుదార్లకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.లక్ష నుంచి రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించాలని గతేడాది ఖరీఫ్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం జగన్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో రూ.లక్షన్నర కాదు కదా.. కనీసం రూ.50 వేలు కూడా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది.
జగన్ హామీ ప్రకారం..1.02 లక్షల మందిలో 17,996 మందికి పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.24.29 కోట్ల సాయం అందుతోంది. మరో 1,02,004 మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వకపోగా, పెట్టుబడి సాయం అందడం లేదు. సీఎం ఇచ్చిన హామీ మేరకు 1.02 లక్షల మంది కౌలుదారులకు ఏడాదికి పెట్టుబడి సాయం రూ.13,500ల చొప్పున రూ.137.70 కోట్లు దక్కాలి. అయిదేళ్లలో రూ.688 కోట్ల మేర రైతులకు బాకీ పడ్డారు. అయినా కౌలు రైతులకు ఎంతో గొప్ప మేలు చేస్తున్నామని, అన్ని రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నామని జగన్ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.
24,183 మందికి అందని పెట్టుబడి సాయం
2023-24 ఆర్థిక సంవత్సరంలో కౌలు రైతులకు మొదటి విడతగా మేలో రూ.7,500 అక్టోబరులో రూ.4 వేలు కలిపి రూ.11,500 రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేశారు. రెండు విడతలో కర్నూలులో 7,306 మందికి రూ.8.40 కోట్లు, నంద్యాలలో 10,004 మందికి రూ.11.50 కోట్లు అందించారు. 24,183 మంది కౌలుదారులకు రూ.27.81 కోట్ల రైతుభరోసా పెట్టుబడి సాయం ఇవ్వకుండా వైకాపా మోసం చేసింది.
రూ.32.50 కోట్లు ఎగవేత
కౌలురైతులకు రెండో విడతలో అక్టోబరులో ఇవ్వాల్సిన రూ.4వేలు నవంబరులో అందజేశారు. మూడోవిడత 2024 జనవరిలో ఇవ్వాల్సిన ఉండగా నెల రోజులు ఆలస్యంగా ఫిబ్రవరి 2న పంపిణీ చేశారు. మూడో విడతలో రూ.2వేల చొప్పున కర్నూలులో 7,723 మందికి రూ.1.82 కోట్లు, నంద్యాలలో 10,273 మందికి రూ.2.28 కోట్లు అందజేయనున్నారు. ఏడాదిలో మూడు విడతల్లో 23 వేల మంది కౌలుదారులు రూ.32.50 కోట్లు మిగుల్చుకున్నారు.
పరిహారం పరిహాసం
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏటా అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులకు ఈ ఏడాది కూడా అప్పులే మిగిలాయి..రెండు, మూడేళ్లుగా అప్పులు ఏటా పెరుగుతున్నాయి. అప్పులు చెల్లించలేక కౌలురైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నెలలో కనీసం 5-10 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చాటింపేసుకుంటోంది. కౌలురైతులు చనిపోతే సీసీఆర్సీ కార్డులు కలిగిన వారందరికీ రైతు ఆత్మహత్యల కింద ప్రభుత్వం అందించే రూ.7 లక్షల పరిహారం పంపిణీ చేయాలి. ఉమ్మడి జిల్లాలో ఐదేళ్ల కాలంలో 20 మందికి కూడా ప్రభుత్వ పరిహారం అందలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నంద్యాల అభివృద్ధిని నాయకులు మరిచారు
[ 02-05-2024]
నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి నంద్యాలను అభివృద్ధి చేయకుండా, సమస్యలను పట్టించుకోలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్రెడ్డి విమర్శించారు. -
వైకాపా పాలనకు చరమగీతం పాడుదాం
[ 02-05-2024]
వైకాపా చేపట్టిన ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని చిప్పగిరి మండల తెదేపా నాయకులు అన్నారు. -
తెదేపాలో చేరికలు
[ 02-05-2024]
మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు తెదేపాలో చేరారు. -
శ్యాంబాబును గెలిపించుకుందాం
[ 02-05-2024]
తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబుకు ఓటు వేసి గెలిపించుకోవాలని తెదేపా నాయకులు కేఈ.నిఖిలేష్, సుబ్బరాయుడు అన్నారు. -
మంచి మనిషిని చూసి ఓటెయ్యండి
[ 02-05-2024]
మంచి మనిషి సౌమ్యుడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ను అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మం నారాయణ అన్నారు. -
ఉపాధ్యాయ ఉద్యమ దార్శనికుడు దాచూరి రామిరెడ్డి
[ 02-05-2024]
ఉపాధ్యాయ ఉద్యమ దార్షనికుడు దాచూరి రామిరెడ్డి ఉద్యమ స్ఫూర్తి ఉపాధ్యాయ లోకానికి దిక్సూచి లాంటిదని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు. -
తెదేపాలో చేరికలు
[ 02-05-2024]
ఆదోని పట్టణంలో 3వ వార్డు బసన్న కట్ట, గోకర్ జెండా ప్రాంతానికి చెందిన 150 మంది వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరారు. -
పెన్షన్ కోసం వృద్ధుల అవస్థలు
[ 02-05-2024]
ఆదోని పట్టణంలో పెన్షన్ దారులు బ్యాంకుల వద్ద గురువారం ఇబ్బందులు పడ్డారు. -
బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. -
కూటమి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 02-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతో రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని తెదేపా ఫ్లోర్ లీడర్ దయాసాగర్ అన్నారు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
[ 02-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జేసీ, నంద్యాల ఎన్నికల అధికారి రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. -
అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడి మృతి
[ 02-05-2024]
మండలంలోని కైరవాడి గ్రామంలో అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడు గురువారం మృతి చెందారు. -
సకల జనుల సంక్షేమం
[ 02-05-2024]
ఒక్క రూపాయి కూడా కట్టే పని లేకుండానే.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను.. ఉద్యోగులు, యువత, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు.. ఇలా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఉందంటూ క్షేత్రస్థాయిలో ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. -
హామీలు గుప్పించి.. సేవలు వికటించి
[ 02-05-2024]
జగన్ ప్రభుత్వ ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఆసుపత్రి భవనాల నిర్వహణ గాలికొదిలేసింది. -
దారితప్పిన మాటలు.. పుర వాసులకు కష్టాలు
[ 02-05-2024]
-
4న లోకేశ్ రాక
[ 02-05-2024]
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 4న నంద్యాలలో యువగళం సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ తెలిపారు. -
పింఛను దూరం 90 కి.మీ.
[ 02-05-2024]
జగన్నాటకంలో పండుటాకులు విలవిలలాడుతున్నారు. -
3 ఎమ్మెల్యేలు.. 6కి.మీ..18ఏళ్లు
[ 02-05-2024]
ఈ అంకెలు ఏంటీ అనుకుంటున్నారా..? సి.బెళగల్ మండలం కొండాపురం- ఇనగండ్ల మధ్య 6 కి.మీ. మట్టి రోడ్డును బీటీగా మారుస్తామని గత 18 ఏళ్లలో ముగ్గురు ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. -
మ్యానిఫెస్టోలో అన్నివర్గాలకు ప్రాధాన్యం
[ 02-05-2024]
రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు దర్పణం పట్టేలా తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఉందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
గడప.. గడపలో అబద్ధాలు చెప్పండి!
[ 02-05-2024]
అన్ని వర్గాలను అలరించేలా ఉన్న తెదేపా మ్యానిఫెస్టోపై అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేయించేందుకు వైకాపా నాయకులు కుట్రలకు తెర తీశారు. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 02-05-2024]
మండలంలోని నల్లచెలిమల, ఎంకే కొట్టాల, గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బంటుపల్లి, బేతపల్లి, బండపల్లి, ఈదులదేవరబండ గ్రామాల్లో తెదేపా కూటమి అభ్యర్థి వీరభద్రగౌడు, జనసేన ఇన్ఛార్జి వెంకప్ప బుధవారం ప్రచారం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై నిరంతర నిఘా
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, టూరిజం బార్లలో మద్యం అమ్మకాలపై నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ పర్యవేక్షణాధికారి, ఏపీఎస్బీసీఎల్ డిపో మేనేజర్ ఎం.సుధీర్బాబు తెలిపారు. -
అక్రమ మద్యం తరలిస్తూ పట్టుపడ్డ వైకాపా నాయకుడు
[ 02-05-2024]
అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వైకాపా నాయకుడు శ్రీకాంత్రెడ్డితో పాటు మరో నలుగురిని సెబ్ పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆలూరులో బుధవారం జరిగింది. -
డోన్లో 45.7 డిగ్రీలు
[ 02-05-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. -
శిశువు అపహరణకు యత్నం
[ 02-05-2024]
కర్నూలు సర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగం నుంచి ప్రమీల అనే మహిళ బుధవారం రాత్రి 7 గంటలకు నవజాత శిశువును ఎత్తుకెళ్తూ సెక్యూరిటీ గార్డుకు పట్టుబడటం సంచలనంగా మారింది. -
హత్యాయత్నం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
[ 02-05-2024]
అనుమానంతో కట్టుకున్న భార్యను చంపేందుకు యత్నించిన నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన రాజుకు పదేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ కర్నూలు అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్