డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది.
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. కోడ్ ఉల్లంఘించి పక్షం రోజులైనా ఆమెపై బ్యాంకు ఛైర్పర్సన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.సృజన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఆమే రంగంలోకి దిగి శివలీలను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దీర్ఘకాలిక సెలవులో వెళ్లి
డీసీసీబీ తాత్కాలిక సీఈవో శివలీల తన వ్యక్తిగత కారణాలతో ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు సెలవులో వెళ్లారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో విధుల్లో చేరేముందు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుమతి తీసుకోవాలి.. కనీసం జిల్లా సహకార అధికారి (డీసీవో) అనుమతైనా తీసుకోవాలి. డీసీవో అనుమతి తీసుకోకుండా.. ఎన్నికల కోడ్ లెక్క చేయకుండా డీసీసీబీ ఛైర్పర్సన్ ఎస్.వి.విజయ మనోహరిని కలిసి నేరుగా విధుల్లో చేరారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అంటూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి బృందం, జిల్లా ఎన్నికల అధికారి నిర్ధారించారు.
ఆదేశాలు భేఖాతరు
కోడ్ ఉల్లంఘనపై 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని డీసీసీబీ తాత్కాలిక సీఈవోను కలెక్టర్ ఆదేశించారు. ఆమె వివరణ ఇచ్చినా కలెక్టర్ సంతృప్తి చెందలేదు. తాత్కాలిక సీఈవో శివలీలను విధుల నుంచి తప్పించాలని.. ఆ స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డీసీవో రామాంజనేయులుకు ఉత్తర్వులు పంపారు. కలెక్టర్ ఉత్తర్వులను ఆయన ఆప్కాబ్ ఎండీకి నివేదించారు. కలెక్టర్ ఆదేశాలు అమలు చేయాలని, తాత్కాలిక సీఈవోగా ఇదివరకే విధులు నిర్వహించిన విజయకుమార్కు బాధ్యతలు అప్పగించాలని, శివలీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీసీసీబీ ఛైర్పర్సన్కు సూచిస్తూ ఆప్కాబ్ ఎండీ ఉత్తర్వులు పంపారు. ఛైర్పర్సన్, తాత్కాలిక సీఈవో ఇరువురు ఓకే సామాజిక వర్గం కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 30 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని బ్యాంకు ఛైర్పర్సన్ శివలీలకు తాఖీదులు ఇవ్వడం గమనార్హం. 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్ కోరగా.. ఛైర్పర్సన్ ఏకంగా 30 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొనడం గమనార్హం. ఆలోగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని.. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోకుండా కాపాడేందుకే ఇలా తాఖీదులు ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. తాత్కాలిక సీఈవోగా విజయకుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్షణ మంత్రి మాట
[ 06-05-2024]
ఆదోని పట్టణం భీమాస్ సర్కిల్లో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతున్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, వేదికపై ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారధి, ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగార్జున తదితరులు -
భూపత్రం.. జగన్ కుతంత్రం
[ 06-05-2024]
‘‘దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రారంభించాం.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో.. డ్రోన్ల సాయంతో ప్రతి క్షేత్రం, పొలం చిత్రపటాలు తీసుకుని ఎలాంటి లోపాలు లేకుండా.. భూ విస్తీర్ణంలో తేడాలు లేకుండా రైతులకు కచ్చితమైన కొలతలు వేయించి, రీసర్వే చేయించి శాశ్వత భూహక్కు పత్రాలు అందిస్తున్నట్లు’’ జగన్ పదేపదే చెబుతున్నారు. -
ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తా
[ 06-05-2024]
ఆదోని పట్టణంతో పాటు పల్లెలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందిస్తానని ఆదోని భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారథి హామీ ఇచ్చారు. -
నిర్వహణ లోపాలు.. వెలగని దీపాలు
[ 06-05-2024]
నగరం, పట్టణాల్లో అభివృద్ధి వెలుగులు నింపుతామని వైకాపా ప్రభుత్వం పదేపదే చెబుతూ వచ్చింది. తీరా పురవీధుల్లో చీకట్లు నింపింది. వీధి దీపాల నిర్వహణ కోసం రూ.కోట్లు వెచ్చిస్తున్నామని ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. -
పార్కులు ఏర్పాటుచేయని పాలకులు మాకొద్దు
[ 06-05-2024]
కర్నూలు నగర పరిధిలోని కల్లూరు 19వ వార్డు నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీలో పార్కు స్థలం అన్యాక్రాంతమైందని.. తమకు పార్కు కావాలని ఆ కాలనీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి నిరసన గళం
[ 06-05-2024]
పెద్దకడబూరు మండలంలో రెండో రోజు ఆదివారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేపట్టిన ప్రచార యాత్రలో ఊరూరా తాగునీటి సమస్యలు వెల్లువెత్తాయి. జాలవాడి గ్రామస్థులు తాగునీరందించాలని కోరారు. -
ఓట్ల బాట
[ 06-05-2024]
గుంతలు పడ్డాయి.. ప్రయాణానికి ‘దారి’ చూపండని ఐదేళ్లుగా పల్లె జనం విన్నవించినా పట్టించుకోలేదు.. తీరా ఎన్నికల వేళ ‘ఓట్ల’ దారి చూస్తోంది జగన్ సర్కారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.190 కోట్లతో 39 రహదారులను (256 కి.మీ.) ఎన్నికలకు ముందు హడావుడిగా నిర్మిస్తోంది. -
నేటి నుంచి ఉద్యోగుల ఓటు
[ 06-05-2024]
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొంటూ.. దరఖాస్తు చేసుకున్న వారందరికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవచ్చు. -
అమ్మఒడి.. మామ చిక్కుముడి
[ 06-05-2024]
అక్కచెల్లెమ్మలు.. అవ్వాతాతలు అంటూ తీయని మాటలతో బురిడీ కొట్టించడంలో సీఎం జగన్ది అందె వేసిన చేయి.. ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన పథకాల పేరుతో అలవికాని హామీలు ఇచ్చి.. అమలు విషయంలో మాత్రం మాయ చేయడం.. ఏవేవో నిబంధనలంటూ కోతలు వేయడం పరిపాటిగా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్