logo

తెదేపాను గెలిపిస్తే అర్హలందరికీ సంక్షేమ పథకాలు

రాష్ట్రంలో తెదేపాను  గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ  పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి  అన్నారు.

Published : 24 Apr 2024 10:20 IST

ఎమ్మిగనూరు : రాష్ట్రంలో తెదేపాను  గెలిపిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆ  పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వరరెడ్డి  అన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్ఎంటీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా  బీవీ మాట్లాడుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపాను గెలిపిస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు  ఉచితంగా ప్రయాణం చేయవచ్చని,  అర్హులైన వారికి రూ.4 వేలు పింఛను, చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు  వస్తుందన్నారు.  ఆయన వెంట  తెలుగుదేశం పార్టీ నాయకులు జగదీష్, కొండయ్య చౌదరి, భాస్కర్ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు