logo

తెదేపాతోనే అభివృద్ధి సాధ్యం

తెదేపా  అధికారంలోకి రావడం వల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని  కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

Updated : 30 Apr 2024 16:00 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: తెదేపా  అధికారంలోకి రావడం వల్ల అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని  కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం బీవీ సమక్షంలో మల్కాపురం, పెద్దమర్రివీడు, బైలుప్పుల, సిరాళ్లదొడ్డి గ్రామాలకు చెందిన 300 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. వారికి కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఈ పది రోజులు కీలకమని  క్షేత్రస్థాయిలో బాగా పని చేసి గెలుపునకు కృషి చేయాలన్నారు. నాయకులు వీరారెడ్డి, మురళీ రెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని