మారుతున్న రూపురేఖలు
సర్కారు బడుల్లో సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన విద్య అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ తొలి విడతలో ఎంపిక చేసిన పాఠశాలలు కొన్ని సిద్ధమవుతున్నాయి.
‘మన ఊరు - మన బడి’లో 16 పాఠశాలలు సిద్ధం
హన్వాడ : రంగులు వేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రాథమిక పాఠశాల
న్యూస్టుడే, మహబూబ్నగర్ విద్యావిభాగం : సర్కారు బడుల్లో సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన విద్య అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ తొలి విడతలో ఎంపిక చేసిన పాఠశాలలు కొన్ని సిద్ధమవుతున్నాయి. ఇన్నాళ్లు కళావిహీనంగా ఉన్న విద్యాలయాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే మండలానికి కనీసం రెండు పాఠశాలలను సిద్ధం చేయాలని నిర్ణయించినా.. పలు కారణాలతో సాధ్యపడలేదు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు విద్యాశాఖ అధికారులు, గుత్తేదారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. దీంతో తక్కువ పనులు చేయాల్సి ఉన్న 16 పాఠశాలలు సిద్ధమయ్యాయి. వాటికి రంగులు వేసే పనులకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 835 ఉండగా ‘మన ఊరు-మన బడి’ పథకం తొలి విడతలో 291 పాఠశాలలు ఎంపిక చేశారు. ప్రాధాన్య క్రమంలో కొన్ని పాఠశాలల్లో 12 రకాల అంశాలపై దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో ఈ పనులు కొంత మందకొడిగా సాగుతున్నా.. కొన్ని పాఠశాలల్లో సివిల్ వర్క్స్, భవనాలు, మరుగుదొడ్ల మరమ్మతులు, విద్యుదీకరణ తదితరాలు మాత్రం పూర్తయ్యాయి. రంగులు, డ్యూయల్ డెస్కులు, ఫర్నీచర్, గ్రీన్ చాక్పీస్ బోర్డులను రాష్ట్రస్థాయిలో బల్క్గా సేకరించనుండగా ఈ ప్రక్రియ టెండర్లు పూర్తయి పలు జిల్లాల్లో పనులు కూడా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పలు పాఠశాలల్లో సీలింగ్ ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను కూడా అమర్చారు. వంట, తరగతి గదుల్లో పగుళ్లు ఉంటే లప్పంతో పూడ్చాలని గుత్తేదారులకు సూచించారు. కోయిలకొండ మండలంలో 3 పాఠశాలలు రంగలు వేసేందుకు సిద్ధంగా ఉండగా జడ్చర్ల మండలంలో 3, గండీడ్-2, హన్వాడ-2, రాజాపూర్-2, బాలానగర్-1, భూత్పూరు-1, మిడ్జిల్-1, మహబూబ్నగర్ గ్రామీణ మండలంలో ఒకటి చొప్పున మొత్తం 16 పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలకు బూడిద వర్ణం, ప్రాథమికోన్నత పాఠశాలలకు లేత గోధుమ, అన్ని పాఠశాలల పైకప్పులకు తెలుగు రంగు వేయనున్నారు. తరగతి లోపల, వెలుపల, భవనం, మరుగుదుదొడ్లు ఇలా ఆవరణ మొత్తం రంగులు వేస్తారు. తర్వాత అందమైన చిత్రాలు, పాఠ్యాంశాల్లోని పటాలు, చారిత్రక కట్టడాలు, గ్రామీణ జీవనం ప్రతిబింబించే బొమ్మలు గోడలపై గీయిస్తారు.
జిల్లాలో ఎంపికైన పాఠశాలలు 291
పనులు కొనసాగుతున్నవి 221
టెండర్ల దశలో ఉన్నవి 21
టెండర్లు పూర్తయినవి 49
మహబూబ్నగర్ : కోడూరు పాఠశాలలో ఏర్పాటుచేసిన కొళాయిలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలమూరులో గెలిచి.. దిల్లీలో మెరిసి
[ 28-04-2024]
వెనకబడిన ప్రాంతంగా పేరున్న మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఉద్దండులైన ఎంపీలను అందించింది. ఇక్కడ గెలిచిన పలువురికి మంత్రి పదవులు దక్కగా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. -
భారాస హయాంలోనే అభివృద్ధి
[ 28-04-2024]
50 ఏళ్ల కాంగ్రెస్, తెదేపా పాలనలో పాలమూరుకు ఏమైనా న్యాయం జరిగిందా? అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆయన చేపట్టిన ‘పోరుబాట’ బస్సుయాత్ర శనివారం నాగర్కర్నూల్లో కొనసాగింది. -
యువత.. మార్చేను నేతలరాత
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు యువ మంత్రం జపిస్తున్నారు. -
రానున్న ఐదురోజులు వడగాల్పులు: కలెక్టరు హెచ్చరిక
[ 28-04-2024]
రానున్న ఐదు రోజులు నారాయణపేట జిల్లాలో తీవ్రమైన వడగాల్పులతో పాటు ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో 45డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. -
నేడు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 28న టీఎస్ ఆర్జేసీ, ఆర్డీసీ సెట్ - 2024 నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్ తెలిపారు. -
ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దు
[ 28-04-2024]
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. ఈ నెల 29న ఓటరు చైతన్య శోభాయాత్ర పేరుతో జిల్లా కేంద్రంలో మెగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమంపై -
అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగొద్దు: కలెక్టర్
[ 28-04-2024]
జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. -
క్రియాశీల నేతలకు ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రాధాన్యం
[ 28-04-2024]
భాజపా, భారాస అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని.. లోక్సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే యువజన కాంగ్రెస్ కార్యకర్తల్లో 60 శాతం మందికి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, -
కృష్ణానీటిపై జగన్తో కేసీఆర్ చీకటి ఒప్పందం : యెన్నం
[ 28-04-2024]
కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేలా జగన్తో అప్పటి సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
దామరగిద్దలో వివాహిత దారుణహత్య
[ 28-04-2024]
దామరగిద్దలో మహిళ దారుణ హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన మహిళ మరో ఇంట్లో మృతదేహమై కనిపించింది. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యం
[ 28-04-2024]
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి మైదానంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వహించిన సభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. -
నేడు బీసీ గురుకులాల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకులాల జిల్లా సమన్వయకర్త సుగుణశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!