లక్ష్యం లేని చదువు వ్యర్థం
ప్రతి విద్యార్థి జీవితంలో మూడు లక్ష్యాలు ఎంచుకోవాలని మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ‘ఇంజినీరింగ్ విద్య ప్రాముఖ్యత’పై జేపీఎన్సీఈ కళాశాలలో శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న లక్ష్మీనారాయణ
మహబూబ్నగర్ గ్రామీణం : ప్రతి విద్యార్థి జీవితంలో మూడు లక్ష్యాలు ఎంచుకోవాలని మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ‘ఇంజినీరింగ్ విద్య ప్రాముఖ్యత’పై జేపీఎన్సీఈ కళాశాలలో శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. లక్ష్యం లేని చదువు వ్యర్థమని పేర్కొన్నారు. జన్మనిచ్చిన అమ్మానాన్న మనల్ని దగ్గరకు తీసుకొని భుజం తట్టి శభాష్ అనాలని, చదువుకున్న కళాశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లగలగాలని, జనం పోటీపడి మన సంతకం ఆటోగ్రాఫ్గా తీసుకోవాలని.. ఈ మూడు లక్ష్యాలతో విద్యార్థులు చదువుకుంటే ఉన్నత శిఖరాలకు తప్పక చేరుకుంటారన్నారు. విద్యార్థి దశలో కష్టపడే వారే భవిష్యత్తులో బాగుపడతారన్నారు. ఇంజినీరింగ్ విద్య ఎంతో విలువైనదని చెప్పారు. సమాజంలో అంత్యంత ఆవశ్యకతగా ఉండే కోర్సులవైపు విద్యార్థులు మొగ్గు చూపాలంటూ ఎలక్ట్రికల్, మెకానిక్, సివిల్ కోర్సుల ప్రాధాన్యతను లక్ష్మీనారాయణ వివరించారు.సీబీఐటీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ఎల్.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంజినీరింగ్లో చేరే విద్యార్థులు ఆలోచించి అడుగులు వేయాలని సూచించారు. జేపీఎన్సీఈ కళాశాల ఛైర్మన్ కేఎస్ రవికుమార్ అధ్యక్షతన ఏర్పాటైన సదస్సులో కళాశాల కార్యదర్శి వెంకటరామారావు, ప్రిన్సిపల్ డాక్టర్ సుజీవన్కుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్, స్విట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రతినిధులు డాక్టర్ సుధాకర్, లక్ష్మీనారాయణ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉపాధ్యక్షుడు అంబటి పృథ్వీ, జిల్లాలోని వివిధ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో లక్ష్మీనారాయణ
మహబూబ్నగర్ గ్రామీణం : మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామిని మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మీనారాయణ శనివారం దర్శించుకున్నారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, ఆలయ ఛైర్మన్ అలహరి మధుసూదన్కుమార్, ఇతర అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం హనుమద్దాసుల మండపంలో శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. జేపీఎన్సీఈ కళాశాల ఛైర్మన్ కేఎస్ రవికుమార్, కార్యదర్శి వెంకటరామారావు ఆయన వెంట ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!