logo

మన్యంకొండ దర్శనం.. భక్తుల పరవశం

మన్యంకొండ శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవం సందర్భంగా ఆదివారం భక్తజనం పోటెత్తారు.

Published : 06 Feb 2023 06:18 IST

మన్యంకొండ శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవం సందర్భంగా ఆదివారం భక్తజనం పోటెత్తారు. మహబూబ్‌నగర్‌ - రాయచూరు ప్రధాన రహదారి మొదలు కొండపై వరకు ఎటు చూసినా భక్తుల సందడి నెలకొంది. కొండ దిగువన పద్మావతి ఆలయ మైదానం, పైన జాతర మైదానం, కోనేరు ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయాయి. వివిధ ప్రాంతాల నుంచి మన్యంకొండ రాయుడిని దర్శించుకోవడానికి తండోప తండాలుగా కదిలివచ్చారు. అర్ధరాత్రి అనంతరం రథంపై ఊరేగిన శ్రీవారిని మనసారా తిలకించారు.

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని