పెద్ద సార్లు తలచుకుంటే.. అంతా గప్చుప్!
జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో నిత్యావసరాలు పక్కదారి పడుతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే వాటిని తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గద్వాల, న్యూస్టుడే: జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో నిత్యావసరాలు పక్కదారి పడుతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే వాటిని తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో గట్టు గురుకుల పాఠశాలలో ఇదే పరిస్థితిపై పలుమార్లు ఫిర్యాదు చేసిన తర్వాత గానీ ఉన్నతాధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించలేదు. తాజాగా ఓ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు వచ్చిన సరుకులను విద్యార్థినుల చేతనే పక్కకు తీయించి వారి చేతనే ప్యాకింగ్ చేయించి ప్రత్యేక సంచుల్లో ఉంచి వారితోనే మూటలను అర్ధరాత్రి ఆటోల్లోకి చేరవేయించిన వైనంపై విద్యార్థులే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నీరుగార్చే యత్నం: విద్యార్థినుల ఫిర్యాదుపై జిల్లా ఉన్నతాధికారి వచ్చి విచారించగా, విద్యార్థినులు జరిగిన తతంగాన్ని వివరంగా చెప్పినట్లు తెలిసింది. దీనిపై విచారించి నివేదిక స్థానిక డీఈవో ఇవ్వాల్సి ఉంది. అంతలోపే విద్యార్థినులపై ఒత్తిడి తెచ్చి విచారణ అధికారికి విద్యార్థినులు గతంలో ఇచ్చిన లిఖిత పూర్వక వివరాలను మార్చి రాసి ఇచ్చేలా తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సమాజానికి పనికొచ్చే వారిగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా చేయిస్తుండటంపై విద్యార్థినులు ఉన్నతాధికారి ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.
విచారణ జరిపించాలి
గద్వాల పురపాలకం, న్యూస్టుడే: ధరూర్ కేజీబీవీలో గత నెలలో వంట సరకులు మాయం అయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ బుధవారం గద్వాలలోని ఐడీవోసీలో కలెక్టర్ సంతోష్కు వినతిపత్రం అందజేసినట్లు విద్యాలయానికి చెందిన పలువురు సీఆర్టీలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై ఈనెల 19న జీసీడీవో ఫర్జానాబేగం ధరూర్ కేజీబీవీకి వచ్చి విచారించారని వారు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు.
నివేదిస్తాం: ధరూరు కస్తూర్బాలో సరుకుల పక్కదారి అంశంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 19 తేదీన విచారించాం. విద్యార్థినులతో సహా ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాం. సంబంధించి విచారణ నివేదికను స్థానిక డీఈవోకు ఇవ్వనున్నాం. నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు తీసుకునే చర్యలను అమలు చేస్తాం.
ఫర్జానా బేగం, జీసీడీవో, జోగులాంబ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ