మొక్కలు మాడిపోతున్నాయ్
ఎండల తీవ్రతకు హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణపై అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో పచ్చదనం కనుమరుగవుతోంది.
సంరక్షణపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ
హౌజింగ్బోర్డు కాలనీ సమీపంలో ఎండుతున్న మొక్కలు
పాలమూరు పురపాలకం, న్యూస్టుడే: ఎండల తీవ్రతకు హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణపై అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో పచ్చదనం కనుమరుగవుతోంది. ఎండలకు తగ్గట్లు సరైన మోతాదులో రోజూ నీరు అందించకపోవడంతో ఆకులు కొమ్మలు చివరకి మాను వరకు దెబ్బతిని మోడుబారుతున్నాయి. మహబూబ్నగర్ పట్టణంలోని ప్రధాన రహదారి పొడవునా డివైడర్ల మధ్య ఉన్న మొక్కలు, ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన సిమెంట్ తొట్లలో ఉంచిన మొక్కలకు సరిగా నీరందడంలేదు. జిల్లా కేంద్రంలో వన్టౌన్ కూడలి నుంచి భగీరథ కాలనీ, క్రిష్టియన్పల్లి, అమిస్తాపూర్ మీదుగా భూత్పూర్ పురపాలిక వరకు, వన్టౌన్ కూడలి నుంచి కొత్త బస్టాండ్, న్యూటౌన్, మెట్టుగడ్డ, ఏనుగొండ మీదుగా బైపాస్ వరకు, పిస్తాహౌజ్ కూడలి నుంచి అప్పన్నపల్లి మీదుగా జడ్చర్ల ప్లై ఓవర్ వరకు, పిస్తాహౌజ్ కూడలి నుంచి బైపాస్ పొడవునా మారుతి నెక్సా షోరూం కూడలి వరకు రహదారి పొడవునా డివైడర్లలో చెట్లు, మొక్కలు నాటారు. వీటికి రోజూ మూడు పూటలు ట్యాంకర్లతో నీరు పట్టాలని ముడా ఆధ్వర్యంలో ఇటీవల రూ.కోటికి పైగా నిధులు అప్రూవల్ చేశారు. వాస్తవానికి నీటి సరఫరా కోసం టెండరు వేయాల్సి ఉండగా ఎమ్మెల్సీ, లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో టెండరు వేయకుండా పాత గుత్తేదారులకే ఎజెండా ఆమోదం క్రింద కలెక్టర్ అనుమతితో పనులు అప్పగించారు. ఇద్దరు గుత్తేదారులు రోజూ ఒక్కపూట మాత్రమే ట్యాంకర్లతో మొక్కలకు నీళ్లు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు.
తొట్లలో మట్టే లేదు
పట్టణంలో ఫుట్పాత్పై సిమెంట్ తొట్లలో ఫెలిషియం జాతి మొక్కలు ఉంచారు. ట్యాంకర్లతో నీరు పట్టే సమయంలో పెద్ద పైపు ద్వారా వచ్చే నీటి ఉద్ధృతికి తొట్లలోని మట్టంతా క్రిందికి జారిపోతుంది. ఫలితంగా ఎక్కడ చూసినా సిమెంట్ తొట్లలో మట్టియే లేకుండా పోయింది. వేసవిలో నీరు సరిగా పట్టకపోవడంతో దాదాపుగా మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల తొట్లు పగిలిపోయి మొక్కలు క్రిందికి వాలినా పట్టించుకునే పరిస్థితి లేదు.
బైపాస్ వెంట ఈత చెట్లు..
బైపాస్ పొడవునా సుమారు 386 ఈత చెట్లు నాటారు. సరిగా నీరు అందని కారణంగా 80 వరకు పూర్తిగా ఎండిపోయాయి. చడీచప్పుడు కాకుండా ఎండిన ఈత చెట్లను తొలగించి వాటి స్థానంలో మళ్లీ కొత్తవి తెచ్చి నాటారు. ఇంత జరిగినా ఈ వేసవిలో మళ్లీ సరిగా నీరు పట్టకపోవడంతో చాలా వరకు ఈత చెట్లు ఎండుతున్నాయి. ఒక్కో ఈత చెట్టుకు సుమారు ఐదు బిందెల నీరు పట్టాలి. గుత్తేదారు సిబ్బంది మాత్రం ట్యాంకర్లతో అలా పోస్తూ ముందుకు వెళ్తుండటంతో వాటికి సరిగా నీరు అందడం లేదు. బైపాస్ పొడవునా ఈ వారం రోజుల్లోనూ మరో 35 ఈత చెట్లు ఎండి మోడుబారుతుండటం గమనార్హం.
పర్యవేక్షించని ఇంజినీర్లు: హరితహారం మొక్కలకు నీరు పెట్టే పనులను ముడా ఇంజినీర్లు పర్యవేక్షించడం లేదు. రూ.100.25 లక్షల భారీ వ్యయంతో నీటి సరఫరా పనులు అప్పగించిన ఇంజినీర్లు వాటి పనితీరు ఎలా ఉందో పర్యవేక్షణ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకసారి ఎండిన మొక్కకు ఎన్నిసార్లు నీటి పెట్టినా ప్రయోజనం ఉండదు. మొక్క ఎండకుండా ప్రతి రోజూ సకాలంలో నీటిని సరఫరా చేసే ప్రక్రియను ముడా అధికారులు అమల్లో ఉంచడం లేదు. మొక్కలకు నీరు సరఫరాపై ఇకనైనా అధికారులు దృష్టి సారించాలని హరిత ప్రియులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలమూరులో గెలిచి.. దిల్లీలో మెరిసి
[ 28-04-2024]
వెనకబడిన ప్రాంతంగా పేరున్న మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఉద్దండులైన ఎంపీలను అందించింది. ఇక్కడ గెలిచిన పలువురికి మంత్రి పదవులు దక్కగా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. -
భారాస హయాంలోనే అభివృద్ధి
[ 28-04-2024]
50 ఏళ్ల కాంగ్రెస్, తెదేపా పాలనలో పాలమూరుకు ఏమైనా న్యాయం జరిగిందా? అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆయన చేపట్టిన ‘పోరుబాట’ బస్సుయాత్ర శనివారం నాగర్కర్నూల్లో కొనసాగింది. -
యువత.. మార్చేను నేతలరాత
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు యువ మంత్రం జపిస్తున్నారు. -
రానున్న ఐదురోజులు వడగాల్పులు: కలెక్టరు హెచ్చరిక
[ 28-04-2024]
రానున్న ఐదు రోజులు నారాయణపేట జిల్లాలో తీవ్రమైన వడగాల్పులతో పాటు ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో 45డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. -
నేడు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 28న టీఎస్ ఆర్జేసీ, ఆర్డీసీ సెట్ - 2024 నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్ తెలిపారు. -
ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దు
[ 28-04-2024]
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. ఈ నెల 29న ఓటరు చైతన్య శోభాయాత్ర పేరుతో జిల్లా కేంద్రంలో మెగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమంపై -
అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగొద్దు: కలెక్టర్
[ 28-04-2024]
జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. -
క్రియాశీల నేతలకు ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రాధాన్యం
[ 28-04-2024]
భాజపా, భారాస అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని.. లోక్సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే యువజన కాంగ్రెస్ కార్యకర్తల్లో 60 శాతం మందికి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, -
కృష్ణానీటిపై జగన్తో కేసీఆర్ చీకటి ఒప్పందం : యెన్నం
[ 28-04-2024]
కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేలా జగన్తో అప్పటి సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
దామరగిద్దలో వివాహిత దారుణహత్య
[ 28-04-2024]
దామరగిద్దలో మహిళ దారుణ హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన మహిళ మరో ఇంట్లో మృతదేహమై కనిపించింది. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యం
[ 28-04-2024]
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి మైదానంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వహించిన సభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. -
నేడు బీసీ గురుకులాల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకులాల జిల్లా సమన్వయకర్త సుగుణశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.