ఆస్తి గొడవ.. తండ్రి చేతిలో కొడుకు హతం
భూమి పంచాలంటూ గొడవ పడి గాఢ నిద్రకు చేరుకున్న సొంత కొడుకును అతని తండ్రి బలమైన కర్రతో కొట్టి అంతం చేశాడు.
పెద్దేముల్, న్యూస్టుడే: భూమి పంచాలంటూ గొడవ పడి గాఢ నిద్రకు చేరుకున్న సొంత కొడుకును అతని తండ్రి బలమైన కర్రతో కొట్టి అంతం చేశాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలంలోని ఇందూరు గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామీణ సీఐ రాంబాబు, స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన మహబూబ్ జానీకి ముంతాజ్ బేగం, రిజ్వాన భార్యలు. మొదటి భార్యకు కూతురు, రెండో భార్యకు కొడుకు గోరెమియా(26), కుతూరు ఉన్నారు. జానీకి గ్రామంలో 8 ఎకరాల భూమి ఉంది. అందరి పెళ్లిళ్లు జరిగాయి. ఇళ్ల పంపకాలూ పూర్తయ్యాయి. పక్కపక్కనే ఉంటున్నారు. తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతుండటంతో నాలుగేళ్ల క్రితం రిజ్వాన తన కొడుకు గోరెమియా, కోడలు నసీమా బేగంలను తీసుకుని జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. అక్కడే కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు, మూడు మాసాలకు ఒకసారి ఇందూరు వచ్చి వెళ్లేవారు. వచ్చిన ప్రతిసారి తమకు గల 8 ఎకరాల భూమి విషయమై గొడవ జరిగేది. ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం గోరెమియా ఇందూరుకు వచ్చాడు. మద్యం తాగి తండ్రి జానీతో గొడవకు దిగాడు. బుధవారం సైతం తండ్రితో భూమి పంపకాలు చేయాలని గొడవకు దిగడంతో రోజంతా ఇలాగే గడిచింది. 8 ఎకరాల భూమిని గ్రామంలోనే ఓ రైతుకు కౌలుకు ఇచ్చామని వివరించారు. కౌలు డబ్బులు ఇవ్వడం లేదు. భూమి పంపకాలు కావడం లేదు. మీ అంతు చూస్తానని హెచ్చరించి చీకటి పడగానే గోరెమియా తన ఇంట్లో మంచంపై నిద్రపోయాడు. గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత అప్పటికే పథకం వేసుకున్న తండ్రి బలమైన కర్రతో దాడి చేసి చంపేశాడు. కొడుకు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత పరారయ్యాడు. ఉదయం 8 గంటల ప్రాంతంలో పక్కింటి వారు వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో అతను పడి ఉన్నాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై అబ్దుల్ రవూఫ్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని సీఐ రాంబాబుకు తెలిపారు. పోలీసులు సంఘటన జరిగిన ప్రదేశంతో పాటు పలు చోట్ల గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడి తల్లి రిజ్వాన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..