గిరిజన గురుకులం.. ఉజ్వల భవితవ్యం
గిరిజనులను విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
గిరిజనులను విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసింది. సంగారెడ్డికి సదరు విద్యాలయాన్ని కేటాయించగా స్థానికంగా వసతి లేకపోవడంతో పటాన్చెరు మండలం పెద్దకంజర్లలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగిస్తున్నారు. చదువు, వసతి ఒకే చోట ఉండటంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఇటీవల ఇందులో ప్రవేశాలకు టీజీయూసెట్ ప్రకటన విడుదల చేసింది.
ఐదు కోర్సులు..
2017-18 సంవత్సరంలో సంగారెడ్డి గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల మంజూరైంది. ఇక్కడ ఐదు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఎస్సీలో లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, బీకాం హానర్, బీకాం కంప్యూటర్, బీఏ సీబీసీఎస్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఒక్కో దాంట్లో 40 చొప్పున సీట్లు ఉండగా బీఎస్సీ ఫిజికల్ సైన్స్లో అత్యధికంగా 120 సీట్లు ఉన్నాయి. మొత్తం 280 వరకు ఉన్నాయి. 2023-24 సంవత్సరానికి ఆయా వాటి భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఇంటర్ ఉత్తీర్ణులైన, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు అర్హులు.
ప్రాజెక్టులు సైతం..
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో చేరే విద్యార్థుల్లో నైపుణ్యంతో పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. మిర్రర్ ప్రాజెక్టు, ఫ్లిప్డ్ క్లాస్, ఎనర్జీగర్స్, సెమినార్ క్లాసెస్, క్లబ్ యాక్టివిటీస్, సుపూర్ నోవా, భారత్ దర్శన్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఆయా వాటిల్లో ప్రతిభ చాటిన వారిని ప్రభుత్వపరంగా ప్రోత్సహిస్తున్నారు. భారత్ దర్శన్ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే పలువురు శ్రీలంక సందర్శించి వచ్చారు.
దరఖాస్తు ఇలా..
ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గిరిజనులతో పాటు కొన్ని సీట్లు, ఎస్సీ, బీసీలకు సైతం కేటాయించారు. గిరిజన విద్యార్థులకు 85 శాతం, మిగతా వారికి 15 శాతం సీట్లు రిజర్వు చేశారు. http:///tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాల్సి ఉంటుంది. తుది గడువు ఫిబ్రవరి 5. మార్చి 5న ప్రవేశ పరీక్ష ఉంటుంది.
నాణ్యమైన బోధన: శ్రీలత, ప్రిన్సిపల్
గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా అడుగేస్తున్నాం. వివిధ ప్రాజెక్టుల ద్వారా అన్ని అంశాల్లోనూ ముందుండేలా చూస్తున్నాం.
సదుపాయాలు ఇలా..
కళాశాలలో చేరిన వారందరికీ ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తారు. గురుకులంలో పూర్తిస్థాయి ప్రమాణాలతో కూడిన కంప్యూటర్, సైన్స్ ప్రయోగశాల అందుబాటులో ఉన్నాయి. ఉన్నతస్థాయి విలువలు అందించే పుస్తకాలతో కూడిన గ్రంథాలయాన్ని నెలకొల్పారు. అన్ని కోర్సులకూ సాంకేతిక విద్య అందిస్తున్నారు. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకుతో బోధన సాగుతోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ప్రణాళికతో సాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్